వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజన్ల ట్రోల్స్ అదిరిపోతున్నాయి. ఆన్ దిరికార్డ్, ఆఫ్ దిరికార్డు గా వైసీపీ నాయకులు కూడా ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజగా కొడాలి నాని.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను కొడాలి నాని చేశారు.
“నాకు ఇప్పుడు 53 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు. 58 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయలేం. అందుకే 2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నాకు ఇద్దరు కుమార్తెలకు. రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తన తమ్ముడి కుమారుడికి ఆసక్తి ఉంటే వస్తాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పనులుపైనే దృష్టి సారిస్తా” అని నాని అన్నారు. అయితే.. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ప్రతిపక్షాలకు మాత్రం ఆయుధాలు అందించారని వైసీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
ఇక, నెటిజన్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కొడాలి పని అయిపోయింది. ఆయన తన ఓటమిని ముందే ఒప్పేసుకున్నారు. అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక, గుడివాడలో ఇప్పటి వరకు అప్రతిహతంగా గెలిచినా.. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్న వ్యాఖ్యలపై స్థానికులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికి నాలుగు సార్లుగా కొడాలి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన చెబుతున్న అభివృద్ధి ఇంకా చేయకపోవడం ఏంటని.. ఇక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. టీడీపీ దూకుడుతో “సెంటిమెంటు అస్త్రాలు” ప్రయోగిస్తున్నారంటూ.. ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కొడాలి నాని.. తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులతో పాటు వైసిపి శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం ఓటమి భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని చేస్తున్నాడంటూ విమర్శలు గుర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాతగా పేరుగాంచిన కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
This post was last modified on March 8, 2024 9:36 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…