Political News

ఓట‌మిని అంగీక‌రించిన కొడాలి.. నెటిజ‌న్ల కామెంట్స్‌

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజ‌న్ల ట్రోల్స్ అదిరిపోతున్నాయి. ఆన్ దిరికార్డ్‌, ఆఫ్ దిరికార్డు గా వైసీపీ నాయ‌కులు కూడా ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజ‌గా కొడాలి నాని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను కొడాలి నాని చేశారు.

“నాకు ఇప్పుడు 53 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు. 58 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయలేం. అందుకే 2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నాకు ఇద్దరు కుమార్తెలకు. రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తన తమ్ముడి కుమారుడికి ఆసక్తి ఉంటే వస్తాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పనులుపైనే దృష్టి సారిస్తా” అని నాని అన్నారు. అయితే.. ఆయ‌న ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిపక్షాల‌కు మాత్రం ఆయుధాలు అందించార‌ని వైసీపీ నాయ‌కులు పెద‌వి విరుస్తున్నారు.

ఇక‌, నెటిజ‌న్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కొడాలి ప‌ని అయిపోయింది. ఆయ‌న త‌న ఓట‌మిని ముందే ఒప్పేసుకున్నారు. అనే కామెంట్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఇక‌, గుడివాడ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా గెలిచినా.. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంద‌న్న వ్యాఖ్య‌ల‌పై స్థానికులు కూడా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్ప‌టికి నాలుగు సార్లుగా కొడాలి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న చెబుతున్న అభివృద్ధి ఇంకా చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని.. ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. టీడీపీ దూకుడుతో “సెంటిమెంటు అస్త్రాలు” ప్ర‌యోగిస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కొడాలి నాని.. తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులతో పాటు వైసిపి శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం ఓటమి భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని చేస్తున్నాడంటూ విమర్శలు గుర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాతగా పేరుగాంచిన కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on March 8, 2024 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago