Political News

ఓట‌మిని అంగీక‌రించిన కొడాలి.. నెటిజ‌న్ల కామెంట్స్‌

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజ‌న్ల ట్రోల్స్ అదిరిపోతున్నాయి. ఆన్ దిరికార్డ్‌, ఆఫ్ దిరికార్డు గా వైసీపీ నాయ‌కులు కూడా ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజ‌గా కొడాలి నాని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను కొడాలి నాని చేశారు.

“నాకు ఇప్పుడు 53 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు. 58 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయలేం. అందుకే 2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నాకు ఇద్దరు కుమార్తెలకు. రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తన తమ్ముడి కుమారుడికి ఆసక్తి ఉంటే వస్తాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పనులుపైనే దృష్టి సారిస్తా” అని నాని అన్నారు. అయితే.. ఆయ‌న ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిపక్షాల‌కు మాత్రం ఆయుధాలు అందించార‌ని వైసీపీ నాయ‌కులు పెద‌వి విరుస్తున్నారు.

ఇక‌, నెటిజ‌న్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కొడాలి ప‌ని అయిపోయింది. ఆయ‌న త‌న ఓట‌మిని ముందే ఒప్పేసుకున్నారు. అనే కామెంట్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఇక‌, గుడివాడ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా గెలిచినా.. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంద‌న్న వ్యాఖ్య‌ల‌పై స్థానికులు కూడా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్ప‌టికి నాలుగు సార్లుగా కొడాలి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న చెబుతున్న అభివృద్ధి ఇంకా చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని.. ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. టీడీపీ దూకుడుతో “సెంటిమెంటు అస్త్రాలు” ప్ర‌యోగిస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కొడాలి నాని.. తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులతో పాటు వైసిపి శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం ఓటమి భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని చేస్తున్నాడంటూ విమర్శలు గుర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాతగా పేరుగాంచిన కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on March 8, 2024 9:36 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

3 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

40 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago