Political News

ఓట‌మిని అంగీక‌రించిన కొడాలి.. నెటిజ‌న్ల కామెంట్స్‌

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజ‌న్ల ట్రోల్స్ అదిరిపోతున్నాయి. ఆన్ దిరికార్డ్‌, ఆఫ్ దిరికార్డు గా వైసీపీ నాయ‌కులు కూడా ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజ‌గా కొడాలి నాని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలను కొడాలి నాని చేశారు.

“నాకు ఇప్పుడు 53 ఏళ్లు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటానన్నారు. 58 ఏళ్ల తర్వాత రాజకీయాలు చేయలేం. అందుకే 2029 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. నాకు ఇద్దరు కుమార్తెలకు. రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తన తమ్ముడి కుమారుడికి ఆసక్తి ఉంటే వస్తాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే నియోజకవర్గం లో చేయాల్సిన అభివృద్ధి పనులుపైనే దృష్టి సారిస్తా” అని నాని అన్నారు. అయితే.. ఆయ‌న ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య‌లు చేశారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిపక్షాల‌కు మాత్రం ఆయుధాలు అందించార‌ని వైసీపీ నాయ‌కులు పెద‌వి విరుస్తున్నారు.

ఇక‌, నెటిజ‌న్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కొడాలి ప‌ని అయిపోయింది. ఆయ‌న త‌న ఓట‌మిని ముందే ఒప్పేసుకున్నారు. అనే కామెంట్లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఇక‌, గుడివాడ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా గెలిచినా.. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంద‌న్న వ్యాఖ్య‌ల‌పై స్థానికులు కూడా ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్ప‌టికి నాలుగు సార్లుగా కొడాలి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఆయ‌న చెబుతున్న అభివృద్ధి ఇంకా చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని.. ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు.. టీడీపీ దూకుడుతో “సెంటిమెంటు అస్త్రాలు” ప్ర‌యోగిస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కొడాలి నాని.. తాజాగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులతో పాటు వైసిపి శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. టిడిపి నేతలు మాత్రం ఓటమి భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు కొడాలి నాని చేస్తున్నాడంటూ విమర్శలు గుర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాతగా పేరుగాంచిన కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on March 8, 2024 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

1 hour ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago