టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు వేళ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా రెండు కీలక నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్(కమ్మ సామాజిక వర్గం), కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జీలుగా నియమించారు. మరోవైపు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో 2014 సీన్ ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కానుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి.
175 అసెంబ్లీ సీట్లన్న ఏపీలో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. 25 పార్లమెంట్ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే… మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు. 5 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ పడనుంది. అదే సమయంలో 24 ఎమ్మెల్యే సీట్లలో జనసేన పోటీ చేయనుంది. 6 సీట్లు బీజేపీకి కేటాయించనున్నట్టు తెలిసింది. అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీ, జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మిగిలిన చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీకి దిగుతారు..
ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా 118 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 24 స్థానాల్లో జనసేన అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. టీడీపీ – జనసేన – బీజేపీతో పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే తర్వాతి జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోల 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే తమకు అసెంబ్లీ సీట్లు పెద్ద ప్రాధాన్యం కాదని ఎక్కవ లోక్సభ స్థానాలు ఇవ్వాలని అమిత్షా, నడ్డా ప్రతిపాదించారు.
ఈ క్రమంలో లోక్ సభ సీట్ల కేటాయింపుపైనే సందిగ్థత నెలకొంది. దీనిపై స్పందించిన చంద్రబాబు… నాలుగు స్థానాల్లో బీజేపీ సీట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని తర్వాత ఒక రాజ్య సభ స్థానాన్ని ఇస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థులకు మేలు జరుగుతుందని వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి బీజేపీ అగ్రనేతలు తీసుకెళ్లారు. పూర్తి సమీకరణల అనంతరం సీట్ల సర్దుబాటు, పొత్తుపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
This post was last modified on March 8, 2024 9:30 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…