రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు.. ఇచ్చే ఆదేశాలు.. చేసే మేళ్లను తప్పుబట్టేవారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. వ్యక్తిగతం విషయానికి వస్తే మాత్రం మోడీ ఒకింత ఆదర్శంగానే ఉంటారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపిత మైంది. ఆయన ఎవరితోనూ తన కాళ్లకు మొక్కించుకోరు. ఇది చాలా సందర్భాల్లో కనిపించింది. పార్టీ నేతల్లో చోటా వారు చాలా మంది ప్రధాని మోడీకి పాద నమస్కారం చేసేందుకు ఉత్సాహ పడతారు. కానీ, ఆయన వారిని సున్నితంగా వారిస్తా రు. ఒక సందర్భంలో ఏపీ సీఎం జగన్ కూడా.. పాదనమస్కారం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మోడీ వారించారు. ఇది అప్పట్లో వైరల్ అయింది.
ఇక, పద్మ పురస్కారాలు అందిస్తున్న వేళ గత ఏడాది కూడాపలువురు ఉద్ధండులు ఆయన పాదాలకు నమస్కరించే ప్రయ త్నం చేస్తే.. తాను స్వయంగా సీటులోంచి లేచి వచ్చి.. వారించారు. తాజాగా కూడా ఇలాంటి ఘటనే వైరల్గా మారింది. దేశంలో నే తొలి సారిగా జాతీయ సృష్టికర్తల అవార్డులను అందించారు. ప్రధాని మోడీ ఈ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఓ మహిళ అవార్డును అందుకునే ముందు.. ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించబోయింది. అయితే.. ఆమె మహిళ కావడంతో ముట్టుకుని వారించకుండా.. మోడీ తిరిగి ఆమె పాదాలకు నమస్కరించారు.
కొసమెరుపు..
ఇటీవల కాలంలో రాజకీయ నేతలకు, ముఖ్యంగా పార్టీల అధినాయకులకు పాదనమస్కారాలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల విశాఖలో సీఎం జగన్కు అనకాపల్లి వైసీపీ అభ్యర్థి భరత్ పాదనమస్కారం చేశారు. దీనిని ఆయన వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏఐఎస్ల నుంచి మంత్రుల వరకు పాదన మస్కారాలు చేయని వారు చాలా తక్కువ మంది ఉంటారు. సో.. ఇలాంటివారికి మోడీ ఆదర్శమనడంలో సందేహం లేదు.
This post was last modified on March 8, 2024 9:24 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…