Political News

మోడీ తిరిగి ఆమె పాదాలకు నమస్కరించారు

రాజ‌కీయంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకునే నిర్ణ‌యాలు.. ఇచ్చే ఆదేశాలు.. చేసే మేళ్ల‌ను త‌ప్పుబ‌ట్టేవారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. వ్య‌క్తిగ‌తం విష‌యానికి వ‌స్తే మాత్రం మోడీ ఒకింత ఆద‌ర్శంగానే ఉంటారు. ఈ విష‌యం అనేక సంద‌ర్భాల్లో నిరూపిత మైంది. ఆయ‌న ఎవ‌రితోనూ త‌న కాళ్ల‌కు మొక్కించుకోరు. ఇది చాలా సంద‌ర్భాల్లో క‌నిపించింది. పార్టీ నేత‌ల్లో చోటా వారు చాలా మంది ప్ర‌ధాని మోడీకి పాద‌ న‌మ‌స్కారం చేసేందుకు ఉత్సాహ ప‌డ‌తారు. కానీ, ఆయ‌న వారిని సున్నితంగా వారిస్తా రు. ఒక సంద‌ర్భంలో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా.. పాద‌న‌మ‌స్కారం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, మోడీ వారించారు. ఇది అప్ప‌ట్లో వైర‌ల్ అయింది.

ఇక‌, ప‌ద్మ పుర‌స్కారాలు అందిస్తున్న వేళ గ‌త ఏడాది కూడాప‌లువురు ఉద్ధండులు ఆయ‌న పాదాల‌కు న‌మ‌స్క‌రించే ప్ర‌య త్నం చేస్తే.. తాను స్వ‌యంగా సీటులోంచి లేచి వ‌చ్చి.. వారించారు. తాజాగా కూడా ఇలాంటి ఘ‌ట‌నే వైర‌ల్‌గా మారింది. దేశంలో నే తొలి సారిగా జాతీయ సృష్టికర్తల అవార్డులను అందించారు. ప్ర‌ధాని మోడీ ఈ అవార్డుల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళ అవార్డును అందుకునే ముందు.. ప్ర‌ధాని మోడీ పాదాలకు నమస్కరించబోయింది. అయితే.. ఆమె మ‌హిళ కావ‌డంతో ముట్టుకుని వారించ‌కుండా.. మోడీ తిరిగి ఆమె పాదాలకు నమస్కరించారు.

కొస‌మెరుపు..
ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయ నేత‌ల‌కు, ముఖ్యంగా పార్టీల అధినాయ‌కుల‌కు పాద‌న‌మ‌స్కారాలు చేసేవారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల విశాఖ‌లో సీఎం జ‌గ‌న్‌కు అన‌కాప‌ల్లి వైసీపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ పాద‌న‌మ‌స్కారం చేశారు. దీనిని ఆయ‌న వారించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఇక‌, తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఏఐఎస్‌ల నుంచి మంత్రుల వ‌ర‌కు పాద‌న మ‌స్కారాలు చేయ‌ని వారు చాలా త‌క్కువ మంది ఉంటారు. సో.. ఇలాంటివారికి మోడీ ఆద‌ర్శ‌మ‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on March 8, 2024 9:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago