తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలు ఉండగా.. తాజాగా విడుదల చేసిన జాబితాలో నలుగురికి మాత్రమే సీట్లు ఎనౌన్స్ చేసింది. వీటిలో రెడ్లకే పెద్దపీట వేయడం గమనార్హం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అన్ని సమీకరణలు చూసుకుని, ఆర్థికంగా, సామాజిక వర్గం పరంగా, గత రాజకీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీట్లను కేటాయించినట్టు తెలుస్తోంది.
జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానానికి సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. దీంతో మొత్తం 5 స్థానాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. ఇక, దేశవ్యాప్తంగా చూసుకుంటే.. 32 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టయింది. దీనిలోనూ కొందరు బంధువులకు టికెట్ కేటాయించారు.
ప్రస్తుత కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్కు బెంగళూరు రూరల్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచే పోటీ చేయనున్నారు. వాస్తవానికి ఈ టికెట్ విషయంలో కొంత తర్జన భర్జన జరిగింది. తమ సీటు తమకు ఇచ్చేయాలని కామ్రెడ్ల నుంచి వివాదం రావడంతో సోనియా గాంధీ దౌత్యం చేసి ఈ సీటును కుమారుడికే ఇప్పించుకున్నారు. ఫలితంగా ఫస్ట్ జాబితాలోనే రాహుల్కు వయనాడ్ దక్కింది.
ఇక, కేరళలోని పథనం తిట్ట పార్లమెంటు స్థానాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోని రెండో కుమారుడు ఆంటో ఆంటోనీకి కేటాయించడం గమనార్హం. చిత్రం ఏంటంటే పెద్ద కుమారుడు ఇటీవలే బీజేపీలోకి చేరిపోయాడు. దీంతో ఈ కుటుంబం మొత్తం యూటర్న్ తీసుకునే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ సారి ఓటమి తథ్యమని కాంగ్రెస్లోనే చర్చ సాగుతున్న సిట్టింగ్ ఎంపీ, పార్టీ సీనియర్ నేత శశి థరూర్కు తిరిగి తిరువనంతపురం టికెట్నే కేటాయించారు. ఈయన తరచుగా బీజేపీ విధానాలను సమర్థిస్తుండడం గమనార్హం. మొత్తానికి కాంగ్రెస్లో మెరుపులు లేని జాబితా అయితే వచ్చింది.
This post was last modified on March 8, 2024 9:05 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…