Political News

4 స్థానాల్లో ప్ర‌క‌ట‌న..రెడ్ల‌కే పెద్ద‌పీట‌

తెలంగాణలోని పార్ల‌మెంటు స్థానాల‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 17 స్థానాలు ఉండ‌గా.. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో న‌లుగురికి మాత్ర‌మే సీట్లు ఎనౌన్స్ చేసింది. వీటిలో రెడ్ల‌కే పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అన్ని స‌మీక‌ర‌ణ‌లు చూసుకుని, ఆర్థికంగా, సామాజిక వ‌ర్గం ప‌రంగా, గ‌త‌ రాజ‌కీయ అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని సీట్ల‌ను కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానానికి సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. దీంతో మొత్తం 5 స్థానాల్లో ఇప్ప‌టి వ‌రకు కాంగ్రెస్ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ట్టు అయింది. ఇక‌, దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే.. 32 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్ట‌యింది. దీనిలోనూ కొంద‌రు బంధువుల‌కు టికెట్ కేటాయించారు.

ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేష్‌కు బెంగ‌ళూరు రూర‌ల్ పార్ల‌మెంటు స్థానాన్ని కేటాయించారు. ఇక‌, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి వ‌య‌నాడ్ నుంచే పోటీ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఈ టికెట్ విష‌యంలో కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రిగింది. త‌మ సీటు త‌మ‌కు ఇచ్చేయాల‌ని కామ్రెడ్ల నుంచి వివాదం రావ‌డంతో సోనియా గాంధీ దౌత్యం చేసి ఈ సీటును కుమారుడికే ఇప్పించుకున్నారు. ఫ‌లితంగా ఫ‌స్ట్ జాబితాలోనే రాహుల్‌కు వ‌య‌నాడ్ ద‌క్కింది.

ఇక‌, కేర‌ళ‌లోని ప‌థ‌నం తిట్ట పార్ల‌మెంటు స్థానాన్ని పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం ఏకే ఆంటోని రెండో కుమారుడు ఆంటో ఆంటోనీకి కేటాయించ‌డం గ‌మ‌నార్హం. చిత్రం ఏంటంటే పెద్ద కుమారుడు ఇటీవ‌లే బీజేపీలోకి చేరిపోయాడు. దీంతో ఈ కుటుంబం మొత్తం యూట‌ర్న్ తీసుకునే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు ఈ సారి ఓట‌మి త‌థ్య‌మ‌ని కాంగ్రెస్‌లోనే చ‌ర్చ సాగుతున్న సిట్టింగ్ ఎంపీ, పార్టీ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్‌కు తిరిగి తిరువ‌నంత‌పురం టికెట్‌నే కేటాయించారు. ఈయ‌న త‌ర‌చుగా బీజేపీ విధానాల‌ను స‌మ‌ర్థిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి కాంగ్రెస్‌లో మెరుపులు లేని జాబితా అయితే వ‌చ్చింది.

This post was last modified on March 8, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

1 hour ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

2 hours ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

3 hours ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

3 hours ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

5 hours ago