Political News

4 స్థానాల్లో ప్ర‌క‌ట‌న..రెడ్ల‌కే పెద్ద‌పీట‌

తెలంగాణలోని పార్ల‌మెంటు స్థానాల‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 17 స్థానాలు ఉండ‌గా.. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో న‌లుగురికి మాత్ర‌మే సీట్లు ఎనౌన్స్ చేసింది. వీటిలో రెడ్ల‌కే పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అన్ని స‌మీక‌ర‌ణ‌లు చూసుకుని, ఆర్థికంగా, సామాజిక వ‌ర్గం ప‌రంగా, గ‌త‌ రాజ‌కీయ అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని సీట్ల‌ను కేటాయించిన‌ట్టు తెలుస్తోంది.

జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, చేవెళ్ల స్థానానికి సునీతా మహేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించారు. దీంతో మొత్తం 5 స్థానాల్లో ఇప్ప‌టి వ‌రకు కాంగ్రెస్ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన‌ట్టు అయింది. ఇక‌, దేశ‌వ్యాప్తంగా చూసుకుంటే.. 32 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్ట‌యింది. దీనిలోనూ కొంద‌రు బంధువుల‌కు టికెట్ కేటాయించారు.

ప్ర‌స్తుత క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సోద‌రుడు డీకే సురేష్‌కు బెంగ‌ళూరు రూర‌ల్ పార్ల‌మెంటు స్థానాన్ని కేటాయించారు. ఇక‌, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మ‌రోసారి వ‌య‌నాడ్ నుంచే పోటీ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఈ టికెట్ విష‌యంలో కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రిగింది. త‌మ సీటు త‌మ‌కు ఇచ్చేయాల‌ని కామ్రెడ్ల నుంచి వివాదం రావ‌డంతో సోనియా గాంధీ దౌత్యం చేసి ఈ సీటును కుమారుడికే ఇప్పించుకున్నారు. ఫ‌లితంగా ఫ‌స్ట్ జాబితాలోనే రాహుల్‌కు వ‌య‌నాడ్ ద‌క్కింది.

ఇక‌, కేర‌ళ‌లోని ప‌థ‌నం తిట్ట పార్ల‌మెంటు స్థానాన్ని పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం ఏకే ఆంటోని రెండో కుమారుడు ఆంటో ఆంటోనీకి కేటాయించ‌డం గ‌మ‌నార్హం. చిత్రం ఏంటంటే పెద్ద కుమారుడు ఇటీవ‌లే బీజేపీలోకి చేరిపోయాడు. దీంతో ఈ కుటుంబం మొత్తం యూట‌ర్న్ తీసుకునే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. మ‌రోవైపు ఈ సారి ఓట‌మి త‌థ్య‌మ‌ని కాంగ్రెస్‌లోనే చ‌ర్చ సాగుతున్న సిట్టింగ్ ఎంపీ, పార్టీ సీనియ‌ర్ నేత శ‌శి థ‌రూర్‌కు తిరిగి తిరువ‌నంత‌పురం టికెట్‌నే కేటాయించారు. ఈయ‌న త‌ర‌చుగా బీజేపీ విధానాల‌ను స‌మ‌ర్థిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి కాంగ్రెస్‌లో మెరుపులు లేని జాబితా అయితే వ‌చ్చింది.

This post was last modified on March 8, 2024 9:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

39 minutes ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

5 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

7 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

11 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

12 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

13 hours ago