అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ప్రతిపక్షాలపైకి కేసీయార్ ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ రెడ్డి ప్రయోగించబోతున్నారు. అదేమిటంటే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవటం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. టార్గెట్ ప్రకారం ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారనే నమ్మకం కుదరగానే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవాలని ప్లాన్ చేశారట. తక్కువలో తక్కువ 12-15 మంది ఎంఎల్ఏలు హస్తం గూటికి రావడం ఖాయమైతే అప్పుడు గేమ్ మొదలు పెట్టాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.
అయితే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక పార్లమెంట్ ఎన్నికలకు ముందా ? తర్వాతా అన్నదే తేల్చుకోలేకపోతున్నారట. ఎందుకంటే రాజకీయంగా ఎలా చేస్తే లాభం ఉంటుందనే విషయంపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీయార్ చేసిందిదే. ముందుగా టీడీపీ ఎంఎల్ఏలపైన టార్గెట్ పెట్టారు. ఒక్కో ఎంఎల్ఏని లాగేసుకుని చివరకు టీడీపీఎల్పీలో చీలిక తెచ్చారు. మెజారిటి టీడీపీ ఎంఎల్ఏలను అప్పటి టీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎంఎల్ఏలపైన టార్గెట్ పెట్టారు. ఈ పార్టీ విషయంలో కూడా అలాగే చేశారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను లేవనీయకుండా దెబ్బకొట్టేందుకు కేసీయార్ శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రాంత వైరుధ్యం వల్ల టీడీపీని సాంతం దెబ్బకొట్టడంలో కేసీయార్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ విషయంలో మాత్రం ఫెయిలయ్యారు. దాని ఫలితమే ఇపుడు అధికారంలో కాంగ్రెస్ కూర్చోవటం. అప్పట్లో తాను ఏదైతే వ్యూహాన్ని అమలుచేసారో ఇపుడు అదే వ్యూహాన్ని రేవంత్ అమలుచేయబోతున్నారంతే. ఎంత అవకాశం ఉంటే అంత బీఆర్ఎస్ ను చీల్చి చెండాటమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ప్రస్తుత పాలిటిక్స్ అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయాయి. రాజకీయాల్లోకి ఎవరు ప్రవేశిస్తున్నా వ్యక్తిగత లాభాలు, ప్రయోజనాలను రక్షించుకోవటం కోసమని బాగా తెలుసు. పార్టీలు మారుతున్నా కేవలం ఇందుకోసమే అనడంలో సందేహం లేదు. అందుకనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులు కండువాలు మార్చేసుకోవటానికి కారణం ఇదే. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ ను కలిశారు. మరి వీళ్ళంతా రేవంత్ ను ఎందుకు కలిశారు ? తొందరలో ఏమి చేయబోతున్నారు అన్నది చూడాలి.
This post was last modified on March 9, 2024 11:41 am
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…