అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ప్రతిపక్షాలపైకి కేసీయార్ ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ రెడ్డి ప్రయోగించబోతున్నారు. అదేమిటంటే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవటం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. టార్గెట్ ప్రకారం ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారనే నమ్మకం కుదరగానే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవాలని ప్లాన్ చేశారట. తక్కువలో తక్కువ 12-15 మంది ఎంఎల్ఏలు హస్తం గూటికి రావడం ఖాయమైతే అప్పుడు గేమ్ మొదలు పెట్టాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.
అయితే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక పార్లమెంట్ ఎన్నికలకు ముందా ? తర్వాతా అన్నదే తేల్చుకోలేకపోతున్నారట. ఎందుకంటే రాజకీయంగా ఎలా చేస్తే లాభం ఉంటుందనే విషయంపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీయార్ చేసిందిదే. ముందుగా టీడీపీ ఎంఎల్ఏలపైన టార్గెట్ పెట్టారు. ఒక్కో ఎంఎల్ఏని లాగేసుకుని చివరకు టీడీపీఎల్పీలో చీలిక తెచ్చారు. మెజారిటి టీడీపీ ఎంఎల్ఏలను అప్పటి టీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎంఎల్ఏలపైన టార్గెట్ పెట్టారు. ఈ పార్టీ విషయంలో కూడా అలాగే చేశారు.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను లేవనీయకుండా దెబ్బకొట్టేందుకు కేసీయార్ శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రాంత వైరుధ్యం వల్ల టీడీపీని సాంతం దెబ్బకొట్టడంలో కేసీయార్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ విషయంలో మాత్రం ఫెయిలయ్యారు. దాని ఫలితమే ఇపుడు అధికారంలో కాంగ్రెస్ కూర్చోవటం. అప్పట్లో తాను ఏదైతే వ్యూహాన్ని అమలుచేసారో ఇపుడు అదే వ్యూహాన్ని రేవంత్ అమలుచేయబోతున్నారంతే. ఎంత అవకాశం ఉంటే అంత బీఆర్ఎస్ ను చీల్చి చెండాటమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ప్రస్తుత పాలిటిక్స్ అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయాయి. రాజకీయాల్లోకి ఎవరు ప్రవేశిస్తున్నా వ్యక్తిగత లాభాలు, ప్రయోజనాలను రక్షించుకోవటం కోసమని బాగా తెలుసు. పార్టీలు మారుతున్నా కేవలం ఇందుకోసమే అనడంలో సందేహం లేదు. అందుకనే ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులు కండువాలు మార్చేసుకోవటానికి కారణం ఇదే. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు రేవంత్ ను కలిశారు. మరి వీళ్ళంతా రేవంత్ ను ఎందుకు కలిశారు ? తొందరలో ఏమి చేయబోతున్నారు అన్నది చూడాలి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…