Political News

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం!

రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఢిల్లీకి చేరాయి. అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజ‌మే. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ(ఏపీ) ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీట్ల విష‌యాలు.. అభ్య‌ర్థుల ఎంపిక‌లు త‌దిత‌ర కీల‌క విష‌యంపై చ‌ర్చలు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్టీల అగ్ర‌నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డే రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు ప‌రిష్క‌రాం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తున్నటీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం.. బీజేపీని క‌లుపుకొని పోయేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలో 57 అసెంబ్లీ స్థానాల‌కు, 22 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌కుండా.. పెండింగులో పెట్టారు. దీనిని తేల్చుకునేందుకు.. బీజేపీతో పొత్తును క‌న్ప‌ర్మ్ చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఢిల్లీ చేరుకున్నారు.

బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో శుక్ర‌వారం మార్నింగ్ వారు భేటీ అవుతార‌ని తెలుస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అక్క‌డి అగ్ర‌నేత‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కూడా.. ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని సీట్లు కావాల‌నే విష‌యంపై అధిష్టానానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా ఢిల్లీ బాట ప‌ట్టిన నేప‌థ్యంలో దీనిపై ఒక క్లారిటీ రానుంది. రేపో మాపో.. పొత్తుల‌పై ఒక ప్ర‌క‌ట‌న కూడా బీజేపీ చేయ‌నుంది.

ఇక‌, తెలంగాణ విష‌యం చూస్తే.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు శంఖం పూరించిన సీఎం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్ప‌టికే 17 పార్ల‌మెంటు స్థానాల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే అంశంపై దృష్టి పెట్టారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి.. ఇద్ద‌రు నుంచి ముగ్గురు చొప్పున పేర్ల‌తో ఆయ‌న డిల్లీ బాట ప‌ట్టారు. ఈ జాబితాను పార్టీ అగ్ర‌నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల ముందు ఉంచి.. ఫైనల్ చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on March 7, 2024 11:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

54 minutes ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

1 hour ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

2 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

3 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

4 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

5 hours ago