Political News

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం!

రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఢిల్లీకి చేరాయి. అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజ‌మే. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ(ఏపీ) ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీట్ల విష‌యాలు.. అభ్య‌ర్థుల ఎంపిక‌లు త‌దిత‌ర కీల‌క విష‌యంపై చ‌ర్చలు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్టీల అగ్ర‌నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డే రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు ప‌రిష్క‌రాం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తున్నటీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం.. బీజేపీని క‌లుపుకొని పోయేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలో 57 అసెంబ్లీ స్థానాల‌కు, 22 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌కుండా.. పెండింగులో పెట్టారు. దీనిని తేల్చుకునేందుకు.. బీజేపీతో పొత్తును క‌న్ప‌ర్మ్ చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఢిల్లీ చేరుకున్నారు.

బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో శుక్ర‌వారం మార్నింగ్ వారు భేటీ అవుతార‌ని తెలుస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అక్క‌డి అగ్ర‌నేత‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కూడా.. ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని సీట్లు కావాల‌నే విష‌యంపై అధిష్టానానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా ఢిల్లీ బాట ప‌ట్టిన నేప‌థ్యంలో దీనిపై ఒక క్లారిటీ రానుంది. రేపో మాపో.. పొత్తుల‌పై ఒక ప్ర‌క‌ట‌న కూడా బీజేపీ చేయ‌నుంది.

ఇక‌, తెలంగాణ విష‌యం చూస్తే.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు శంఖం పూరించిన సీఎం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్ప‌టికే 17 పార్ల‌మెంటు స్థానాల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే అంశంపై దృష్టి పెట్టారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి.. ఇద్ద‌రు నుంచి ముగ్గురు చొప్పున పేర్ల‌తో ఆయ‌న డిల్లీ బాట ప‌ట్టారు. ఈ జాబితాను పార్టీ అగ్ర‌నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల ముందు ఉంచి.. ఫైనల్ చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on March 7, 2024 11:04 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

22 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

24 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

1 hour ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

2 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

2 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

3 hours ago