Political News

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం!

రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఢిల్లీకి చేరాయి. అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజ‌మే. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ(ఏపీ) ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీట్ల విష‌యాలు.. అభ్య‌ర్థుల ఎంపిక‌లు త‌దిత‌ర కీల‌క విష‌యంపై చ‌ర్చలు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్టీల అగ్ర‌నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డే రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు ప‌రిష్క‌రాం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తున్నటీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం.. బీజేపీని క‌లుపుకొని పోయేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలో 57 అసెంబ్లీ స్థానాల‌కు, 22 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌కుండా.. పెండింగులో పెట్టారు. దీనిని తేల్చుకునేందుకు.. బీజేపీతో పొత్తును క‌న్ప‌ర్మ్ చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. ఢిల్లీ చేరుకున్నారు.

బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో శుక్ర‌వారం మార్నింగ్ వారు భేటీ అవుతార‌ని తెలుస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. అక్క‌డి అగ్ర‌నేత‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె కూడా.. ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని సీట్లు కావాల‌నే విష‌యంపై అధిష్టానానికి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా ఢిల్లీ బాట ప‌ట్టిన నేప‌థ్యంలో దీనిపై ఒక క్లారిటీ రానుంది. రేపో మాపో.. పొత్తుల‌పై ఒక ప్ర‌క‌ట‌న కూడా బీజేపీ చేయ‌నుంది.

ఇక‌, తెలంగాణ విష‌యం చూస్తే.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు శంఖం పూరించిన సీఎం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్ప‌టికే 17 పార్ల‌మెంటు స్థానాల్లో ఎవ‌రెవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే అంశంపై దృష్టి పెట్టారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి.. ఇద్ద‌రు నుంచి ముగ్గురు చొప్పున పేర్ల‌తో ఆయ‌న డిల్లీ బాట ప‌ట్టారు. ఈ జాబితాను పార్టీ అగ్ర‌నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీల ముందు ఉంచి.. ఫైనల్ చేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

This post was last modified on March 7, 2024 11:04 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

30 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

1 hour ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

1 hour ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

2 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

3 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago