Political News

నాకు సలహాలిచ్చిన వాళ్లు వైసీపీలోకి పోయారు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కులంగా కాపులకు ఉన్న ప్రాధాన్యమే వేరు. ఐతే ఈ కులం పేరు చెప్పి కొందరు నాయకులు మంచి స్థాయికి వెళ్లారు కానీ.. వాళ్లు ఆ కులానికి చేసిందేంటి అనే ప్రశ్న తలెత్తినపుడు సరైన సమాధానాలు రావు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి నేతల విషయంలో తరచుగా ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీళ్లిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ మధ్య రాసిన లేఖలు, సూచనలు చర్చనీయాంశంగా మారాయి.

టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. 50-60 సీట్లు తీసుకోవాలని.. అధికారంలోకి వస్తే పవన్ ముఖ్యమంత్రిగా కొంత కాలం ఉండేలా డిమాండ్లు చేయాలని వీళ్లిద్దరూ డిమాండ్లు చేసిన వాళ్లే. ఐతే పొత్తులో వాళ్లు కోరినట్లుగా జరగకపోవడంతో ఇద్దరూ పవన్ తీరును తప్పుబడుతూ మళ్లీ లేఖాస్త్రాలు సంధించారు. తాము పవన్ మేలు కోరితే ఆయన మాత్రం తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి వారిలో వ్యక్తమైంది.

కట్ చేస్తే కొన్ని రోజులకే హరిరామ జోగయ్య కొడుకు వైసీపీలో చేరిపోయాడు. తాజాగా ముద్రగడ కుటుంబంతో సహా వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అగ్ర నేతలు కొందరు ఆయన్ని ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని భావిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముద్రగడ పోటీలో ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు సలహాలు ఇచ్చిన కాపు పెద్దలు.. వైసీపీలో చేరిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన మేలు కోరి సలహాలు ఇచ్చినట్లుగా చెప్పిన పెద్దలు ఇప్పుడు వైసీపీలో ఎలా చేరతారని ఆయన ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ లాంటి అంశాలపై నిబద్ధతతో వ్యాఖ్యలు చేస్తే ఓకే కానీ.. పింక్ డైమండ్ తరహాలో మాటలు మారిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

This post was last modified on March 7, 2024 10:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago