Political News

నాకు సలహాలిచ్చిన వాళ్లు వైసీపీలోకి పోయారు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కులంగా కాపులకు ఉన్న ప్రాధాన్యమే వేరు. ఐతే ఈ కులం పేరు చెప్పి కొందరు నాయకులు మంచి స్థాయికి వెళ్లారు కానీ.. వాళ్లు ఆ కులానికి చేసిందేంటి అనే ప్రశ్న తలెత్తినపుడు సరైన సమాధానాలు రావు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి నేతల విషయంలో తరచుగా ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీళ్లిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ మధ్య రాసిన లేఖలు, సూచనలు చర్చనీయాంశంగా మారాయి.

టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. 50-60 సీట్లు తీసుకోవాలని.. అధికారంలోకి వస్తే పవన్ ముఖ్యమంత్రిగా కొంత కాలం ఉండేలా డిమాండ్లు చేయాలని వీళ్లిద్దరూ డిమాండ్లు చేసిన వాళ్లే. ఐతే పొత్తులో వాళ్లు కోరినట్లుగా జరగకపోవడంతో ఇద్దరూ పవన్ తీరును తప్పుబడుతూ మళ్లీ లేఖాస్త్రాలు సంధించారు. తాము పవన్ మేలు కోరితే ఆయన మాత్రం తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి వారిలో వ్యక్తమైంది.

కట్ చేస్తే కొన్ని రోజులకే హరిరామ జోగయ్య కొడుకు వైసీపీలో చేరిపోయాడు. తాజాగా ముద్రగడ కుటుంబంతో సహా వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అగ్ర నేతలు కొందరు ఆయన్ని ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని భావిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముద్రగడ పోటీలో ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు సలహాలు ఇచ్చిన కాపు పెద్దలు.. వైసీపీలో చేరిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన మేలు కోరి సలహాలు ఇచ్చినట్లుగా చెప్పిన పెద్దలు ఇప్పుడు వైసీపీలో ఎలా చేరతారని ఆయన ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ లాంటి అంశాలపై నిబద్ధతతో వ్యాఖ్యలు చేస్తే ఓకే కానీ.. పింక్ డైమండ్ తరహాలో మాటలు మారిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

This post was last modified on March 7, 2024 10:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

3 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

4 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

4 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

6 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

7 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

8 hours ago