Political News

‘అంతర్వేది’ తో బీజేపీ – వైసీపీ మధ్య గ్యాప్ పెరిగిందా?

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం రాజకీయ దుమారం రేపింది. దీంతో, వైసీపీ సర్కార్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏపీలో జరుగుతున్నాయో లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలని, ఎవరు రెచ్చగొడుతున్నారో తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతర్వేదిలో అరెస్ట్ చేసిన వారిని, గృహనిర్బంధంలో ఉంచిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.

వైసీపీ హయాంలో హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. దేవాలయాలకు సంబంధించిన రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించాలని బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

ఈ నేపథ్యంలో అంతర్వేది ఘటన వైసీపీ, బీజేపీల మధ్య గ్యాప్ పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కారుపై బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు విమర్శలు గుప్పించడం విశేషం. ఇటీవల కాలంలో పాలనా విషయాల్లో వైసీపీతో బీజేపీకి కొంత గ్యాప్ ఉందని టాక్ వచ్చింది. అయితే,కేంద్రంలో ఎన్డీఏతో వైసీపీకి ఉన్న సఖ్యత రీత్యా ఒకటి అర సందర్భాల్లో తప్ప…బీజేపీ పెద్దగా వైసీపీని టార్గెట్ చేయలేదు. అయితే, హిందుత్వ ఎజెండానే బలంగా భావిస్తోన్న బీజేపీ…రథం దగ్ధం విషయంలో వైసీపీపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో వైసీపీ, బీజేపీల మధ్య బాగా గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. హిందువుల సెంటిమెంట్ దెబ్బతినడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఈ ఘటనపై సీరియస్ గా ఉన్నారట. ఎప్పటి నుంచో ఏపీతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీకి ఈ ఘటన పూర్తిగా కలిసివచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పై, వైసీపీ సర్కార్ పై ఏపీ బీజేపీ నేతల వైఖరి ఏ విధ:గా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.

This post was last modified on September 11, 2020 2:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: APBJPYSRCP

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago