Political News

ఇంట్లో మాట్లాడి చెబుతానన్న ముద్ర‌గ‌డ

రాజ‌కీయ అరంగేట్రంపై సుదీర్ఘ చ‌ర్చ‌లు.. వాదోప‌వాదాలు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే తాను ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేర‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే.. మంచిరోజు చూసుకుని చేర‌తాన‌ని. దీనికి ముందు మీడియాకు తాను స‌మాచారం ఇస్తాన‌ని ముద్ర‌గడ పేర్కొన్నారు.దీంతో ముద్ర‌గ‌డ కుటుంబం రాజ‌కీయ ప్ర‌స్తానం తిరిగి ప్రారంభ‌మైన‌ట్ట‌యింది.

ఇదిలావుంటే.. గ‌త రెండు రోజులుగా తీవ్ర నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి కూడా ముద్ర‌గ‌డ ఇంటికి వైసీపీ నాయ‌కులు ప‌లువురు క్యూ క‌ట్టారు. తొలుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. త‌ర్వాత మాజీ మంత్రి క‌న్న‌బాబు వంటివారు కూడా ముద్ర‌గ‌డ‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇలా .. బుధ‌వారం అంతా చ‌ర్చ‌ల వ్యవ‌హారం సాగింది. అనంత‌రం.. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త ఎంపీ మిథున్‌రెడ్డి రంగంలోకి దిగారు.

దీంతో క‌థ సుఖాంత‌మైంది. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కే ముద్ర‌గ‌డ ఇంటికి వ‌చ్చిన వైసీపీ కీల‌క నాయ కులు.. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు మ‌రింత ముందుకు తీసుకువెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడికి టికెట్‌ను ఆశిస్తుండ‌గా.. ఈ ద‌ఫా ముద్ర‌గ‌డ‌నే బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్టు వైసీపీ నాయ‌కులు చెప్పా రు. దీనిపై ఇంట్లో మాట్లాడి చెబుతాన‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు.

పార్టీలో చేర‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. అయితే.. కాపు స‌మ‌స్య‌ల‌పైనే త‌న డిమాండ్లు ఉన్నాయ‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. దీనికి స్ప‌ష్టత ల‌భించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న చేరిక ఖాయ‌మైంది. ఇదే విష‌యాన్ని ముద్ర‌గ‌డ కూడా అధికారికంగా వెల్ల‌డించారు. అయితే.. మంచి రోజు పార్టీలోచేర‌తాన‌ని చెప్పారు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

3 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

4 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

4 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

5 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

5 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

6 hours ago