Political News

ఇంట్లో మాట్లాడి చెబుతానన్న ముద్ర‌గ‌డ

రాజ‌కీయ అరంగేట్రంపై సుదీర్ఘ చ‌ర్చ‌లు.. వాదోప‌వాదాలు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే తాను ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేర‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే.. మంచిరోజు చూసుకుని చేర‌తాన‌ని. దీనికి ముందు మీడియాకు తాను స‌మాచారం ఇస్తాన‌ని ముద్ర‌గడ పేర్కొన్నారు.దీంతో ముద్ర‌గ‌డ కుటుంబం రాజ‌కీయ ప్ర‌స్తానం తిరిగి ప్రారంభ‌మైన‌ట్ట‌యింది.

ఇదిలావుంటే.. గ‌త రెండు రోజులుగా తీవ్ర నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి కూడా ముద్ర‌గ‌డ ఇంటికి వైసీపీ నాయ‌కులు ప‌లువురు క్యూ క‌ట్టారు. తొలుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. త‌ర్వాత మాజీ మంత్రి క‌న్న‌బాబు వంటివారు కూడా ముద్ర‌గ‌డ‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇలా .. బుధ‌వారం అంతా చ‌ర్చ‌ల వ్యవ‌హారం సాగింది. అనంత‌రం.. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త ఎంపీ మిథున్‌రెడ్డి రంగంలోకి దిగారు.

దీంతో క‌థ సుఖాంత‌మైంది. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కే ముద్ర‌గ‌డ ఇంటికి వ‌చ్చిన వైసీపీ కీల‌క నాయ కులు.. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు మ‌రింత ముందుకు తీసుకువెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడికి టికెట్‌ను ఆశిస్తుండ‌గా.. ఈ ద‌ఫా ముద్ర‌గ‌డ‌నే బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్టు వైసీపీ నాయ‌కులు చెప్పా రు. దీనిపై ఇంట్లో మాట్లాడి చెబుతాన‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు.

పార్టీలో చేర‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. అయితే.. కాపు స‌మ‌స్య‌ల‌పైనే త‌న డిమాండ్లు ఉన్నాయ‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. దీనికి స్ప‌ష్టత ల‌భించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న చేరిక ఖాయ‌మైంది. ఇదే విష‌యాన్ని ముద్ర‌గ‌డ కూడా అధికారికంగా వెల్ల‌డించారు. అయితే.. మంచి రోజు పార్టీలోచేర‌తాన‌ని చెప్పారు.

This post was last modified on March 7, 2024 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

8 minutes ago

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

52 minutes ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

1 hour ago

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

1 hour ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

1 hour ago

అన్నగారికి అసలు టెన్షనే లేదు

అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…

1 hour ago