రాజకీయ అరంగేట్రంపై సుదీర్ఘ చర్చలు.. వాదోపవాదాలు.. తర్జన భర్జనల అనంతరం.. కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే తాను ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేరనున్నట్టు వెల్లడించారు. అయితే.. మంచిరోజు చూసుకుని చేరతానని. దీనికి ముందు మీడియాకు తాను సమాచారం ఇస్తానని ముద్రగడ పేర్కొన్నారు.దీంతో ముద్రగడ కుటుంబం రాజకీయ ప్రస్తానం తిరిగి ప్రారంభమైనట్టయింది.
ఇదిలావుంటే.. గత రెండు రోజులుగా తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి కూడా ముద్రగడ ఇంటికి వైసీపీ నాయకులు పలువురు క్యూ కట్టారు. తొలుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. తర్వాత మాజీ మంత్రి కన్నబాబు వంటివారు కూడా ముద్రగడతో చర్చలు జరిపారు. ఇలా .. బుధవారం అంతా చర్చల వ్యవహారం సాగింది. అనంతరం.. తూర్పు గోదావరి జిల్లా వైసీపీ సమన్వయ కర్త ఎంపీ మిథున్రెడ్డి రంగంలోకి దిగారు.
దీంతో కథ సుఖాంతమైంది. గురువారం ఉదయం 7 గంటలకే ముద్రగడ ఇంటికి వచ్చిన వైసీపీ కీలక నాయ కులు.. ఆయనతో చర్చలు మరింత ముందుకు తీసుకువెళ్లారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన కుమారుడికి టికెట్ను ఆశిస్తుండగా.. ఈ దఫా ముద్రగడనే బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు వైసీపీ నాయకులు చెప్పా రు. దీనిపై ఇంట్లో మాట్లాడి చెబుతానని ముద్రగడ పేర్కొన్నారు.
పార్టీలో చేరడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే.. కాపు సమస్యలపైనే తన డిమాండ్లు ఉన్నాయని ముద్రగడ పేర్కొన్నారు. దీనికి స్పష్టత లభించినట్టు తెలిసింది. దీంతో ఆయన చేరిక ఖాయమైంది. ఇదే విషయాన్ని ముద్రగడ కూడా అధికారికంగా వెల్లడించారు. అయితే.. మంచి రోజు పార్టీలోచేరతానని చెప్పారు.
This post was last modified on March 7, 2024 2:21 pm
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…