Political News

గ‌వ‌ర్న‌ర్ ఇలా చేసి ఉండాల్సింది కాదు

తెలంగాణలోని గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ల విష‌యంలో చోటుచేసుకున్న వివాదానికి హైకోర్టు తెర‌దించిం ది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన వారి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును కోర్టు త‌ప్పుబ‌ట్టింది. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చేసిన సిఫార‌సు మేర‌కు గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అని గ‌వ‌ర్న‌ర్‌ను ఉద్దేశించికోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలో రేవ‌త్‌రెడ్డి ప్ర‌భుత్వం సిఫార‌సు చేసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, అమిర్ అలీఖాన్‌ల అభ్య‌ర్థిత్వాల‌ను కోర్టు తోసిపుచ్చింది.

ఏం జ‌రిగింది?

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వ హ‌యాంలో దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల‌ను గ‌వ‌ర్న‌ర్ కోటాలో మండ‌లికి నామినేట్‌ చేస్తూ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మంత్రి మండలి తీర్మానం చేసింది. దీనిని ఆమోదించాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి పంపించారు. అయితే..ఆమె దీనిని ఆమోదించ‌క‌పోగా రోజుల వ్య‌వ‌ధిలోనే తిరస్కరించారు. దీంతో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు, కుర్రాలు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంద‌ని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇంకా తీర్పు రావాల్సి ఉంది.(అప్ప‌టికి)

ఇంత‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మారిపోయింది. ఆ వెంట‌నే సీఎం రేవంత్‌రెడ్డి ఇదే గ‌వ‌ర్న‌ర్ నామినే టెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను సిఫార్సు చేస్తూ.. గవర్నర్ కు ఫైలు పం పించారు. ఆ వెంట‌నే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై వారి పేర్లను ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

యూట‌ర్న్ ఇలా..

రేవంత్ స‌ర్కారు సిఫారసు చేసిన అభ్య‌ర్థుల వ్య‌వ‌హారంపై మ‌రోసారి బీఆర్ ఎస్ నేత‌లు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్‌లో కోరారు. దీంతో తాజాగా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని పేర్కొంది.

ఏం జ‌రుగుతుంది: మ‌రికొద్ది రోజుల్లో అంటే ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కావొచ్చు.. లేదా ముందే అయినా.. మ‌ళ్లీ అమిర్‌, కోదండరాంల‌కే అవ‌కాశం ఇస్తూ.. నామినేట్ చేయొచ్చు.

This post was last modified on March 7, 2024 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago