Political News

‘జ‌గ‌న్ తాక‌ట్టు పెట్టింది.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం’

ఏపీ స‌చివాల‌యాన్ని తాక‌ట్టు పెట్టి రూ.370 కోట్లు తీసుకురావ‌డం ప‌ట్ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఒక‌సారి దీనిపై ఆయ‌న వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రోసారి ఆయ‌న సీరియ‌స్ అయ్యారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండె లాంటి సచివాలయాన్ని తాకట్టుపెట్టడంపై మండిపడ్డారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం ప్రభుత్వ భవనాలను కాదని…తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రం పరువు, ప్రతిష్ఠను వైసీపీ ప్రభుత్వం మంటగలిపిందని.. ఇప్పుడు ఏకంగా పరిపాలన భవాన్నే తాకట్టు పెట్టడం ద్వారా ఏపీ బ్రాండ్ మరింత దిగజారనుందన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏపీ సచివాలయాన్ని తాకట్టు పెట్ట‌డం రాష్ట్రానికి ఎంతో అవమానకరమన్నారు. రూ. 370 కోట్ల అప్పుకోసం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చునే భవనాన్నే తాకట్టు పెట్టడం సిగ్గుచేటన్నారు. అసలు ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను మాత్రమే కాదని..రాష్ట్రం పరువు, ప్రతిష్ఠ, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు.

ఎంతో కష్టపడి సంపాదించిన ఏపీ బ్రాండ్ విలువను సీఎం జగన్ రోజురోజుకు సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మరోసారి జగన్ కు ఓటు వేస్తే..ఈసారి ప్రజలను సైతం అమ్మకాలని పెట్టేస్తాడని హెచ్చరించారు. కాగా, వైసీపీ ప్రభుత్వం సర్కార్ భవనాలు తాకట్టు పెట్టడం ఇదే తొలిసారి కాదని…గతంలోనూ విశాఖలోని విలువైన భవనాలు, ఖాళీస్థలాలను తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం తీవ్ప వివాదానికి దారి తీసింది.

అప్పట్లో పెద్దఎత్తున విమర్ళలు చెలరేగాయి. ఇప్పుడు ఏకంగా సెక్రటరేయేట్ ను తాకట్టు పెట్టడంతో ప్రజలు అవాక్కవుతు న్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్రప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. ఇప్పటికే పరిధికి మించి లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏ రోజుకు ఆరోజు ఆర్బీఐ వద్ద చేబదులు తీసుకుంటే తప్ప రోజులు గడవని పరిస్థితులు నెలకొన్నాయ‌ని చంద్ర‌బాబు స‌హా నాయ‌కులు వ్యాఖ్యానించారు.

This post was last modified on March 6, 2024 10:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

5 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

6 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

7 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

7 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

7 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

8 hours ago