జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్లో ధ్వజమెత్తారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం ఇదేనా విజన్ భయ్యా అంటూ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. తాజాగా మంగళవారం విశాఖలో పర్యటించిన సీఎం జగన్.. వచ్చే ఎన్నికల తర్వాత.. తాను విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తానని చెప్పారు. అంతేకాదు..తాను సీఎంగా ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా వెల్లడించారు. తనకు ఒక విజన్ ఉందని.. కానీ, దుష్టచతుష్టయం దీనిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
అయితే.. సాధారణంగా ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి భారీ కౌంటర్లు వస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. కానీ, టీడీపీ కంటే కూడా ఎక్కువగా ఆయన సోదరి.. కాంగ్రెస్ చీఫ్ షర్మిల రెచ్చిపోయారు. విశాఖపట్టణం పరిపాలన రాజధాని, 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో షర్మిల నిప్పులు చెరిగారు.
“పరిపాలన రాజధానిలో పాలన ప్రారంభించడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్ మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ను కేంద్రం అమ్మెస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం.. ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారు అని” అని షర్మిల వ్యాఖ్యానించారు.
This post was last modified on March 6, 2024 4:04 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…