బీసీలకు రాజ్యాధికారం రావాలని కలలుగన్న విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావును స్మరించుకుంటూ జయహో బీసీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు ఇది అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాయని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. బీసీల బాగు కోసం తాను, పవన్ ఇద్దరం కలిసి పనిచేస్తున్నామన్నారు.
40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని చెప్పారు. అందుకే బీసీల రుణం తీర్చుకోవాలి అని, ఈ క్రమంలోనే 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకు వచ్చామని చెప్పారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.
బీసీ కార్పొరేషన్ల పేరుతో జగన్ దొంగ లెక్కలు చూపించి ఎక్కడ నిధులు దొరికితే అక్కడ దొడ్డిదారిన మళ్లించారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. టీడీపీఆధ్వర్యంలోనే బీసీలకు రిజర్వేషన్లు పెంచామని గుర్తు చేశారు. కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25 శాతానికి రిజర్వేషన్లు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన-తెలుగుదేశం కూటమిని గెలిపించాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఒకవేళ బీసీలలో ఎవరికైనా రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే వారికి సముచిత స్థానాన్ని కేటాయించి నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత తనదని అన్నారు. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయకూడదన్న చట్టాన్ని టీడీపీ-జనసేన కూటమి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. జగన్ పాలనలో 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారనిి, వేలాదిమంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాజకీయంగా బీసీ వర్గాలను అణిచివేసే ధోరణిని సహించబోమని, అందుకే బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని అన్నారు.
ఎస్సీలకు ఎస్సీలకు ఏ విధంగా ఉందో రక్షణ చట్టం ఉందో… బీసీల జోలికి ఎవరైనా వస్తే ఖబడ్దార్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీల కోసం కనీసం 10 వేల కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. బీసీలు పరిశ్రమలు పెట్టాలన్న, ఆర్థికంగా పైకి రావాలన్నా, ఆధునిక పనిముట్లు కావాలన్నా ఆదుకుంటామని అన్నారు. జగన్ తీసివేసిన విద్యా పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తామన్నారు. జీవో నంబర్ 217 ను రద్దు చేస్తామన్నారు.
బీసీ డిక్లరేషన్ లో 10 పాయింట్లు
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…