Political News

బీసీలు తొక్కిపట్టి నార తీస్తారు: ఎంపీ రామ్మోహన్

మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, బీసీ సోదరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సభా వేదికపై వైసీపీ మాజీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాంకు కండువా కప్పి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని జయరాం అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని, చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. ఈ సభలో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీచ్ కు సభ దద్దరిల్లిపోయింది. ఎంతోమందికి పల్లకీలు మోసిన బీసీలను పల్లకీ ఎక్కించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో తెలియదని, వారిని వెదికి వెదికి అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పంపించిన ఘనత టీడీపీది, అన్నగారిదని చెప్పారు. కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ జీవితానికి ఎన్టీఆర్ పునాది వేస్తే..దానిపై తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని చెప్పారు.

బీసీల కోసం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, 2014 నుంచి 2019 వరకు విద్య, ఉపాధి పరంగా కోట్ల రూపాయలతో అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. రూ.3,700 కోట్ల మేర బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి బీసీలకు చేయూతనిచ్చింది చంద్రబాబేనని చెప్పారు.

అయితే, ఒక్క అవకాశం అంటూ 2019లో దుర్మార్గుడు జగన్ అధికారంలోకి వచ్చాడని, దాంతో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని చెప్పారు. రూ.74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దుర్మార్గుడు జగన్ అని, బీసీలకు సంబంధించిన అనేక పథకాలను ఆపేశాడని ఆరోపించారు.
బీసీలకు 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని జగన్ బడాయి కొట్టుకుంటున్నాడని, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వద్దకు బీసీ సోదరులు వెళితే కప్పు టీ ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తారని, నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. నా బీసీ అనే అర్హత జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్యానల్ స్పీకర్ అయ్యే అవకాశం దక్కితే… లోక్ సభలో మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ చేశారని ఆరోపించారు. రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ అవకాశం వస్తే విజయసాయిరెడ్డికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టీడీపీకి వస్తే ప్యానల్ స్పీకర్ గా కాదు, ఏకంగా స్పీకర్ గానే దళిత బిడ్డ బాలయోగిని కూర్చోబెట్టిందని గుర్తు చేశారు. ఎర్రన్నాయుడును కేంద్ర మంత్రిని చేసింది టీడీపీ అని అన్నారు.

Satya

Recent Posts

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

15 minutes ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

2 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

2 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

3 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

3 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

4 hours ago