Political News

బీసీలు తొక్కిపట్టి నార తీస్తారు: ఎంపీ రామ్మోహన్

మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, బీసీ సోదరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సభా వేదికపై వైసీపీ మాజీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాంకు కండువా కప్పి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని జయరాం అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని, చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. ఈ సభలో టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీచ్ కు సభ దద్దరిల్లిపోయింది. ఎంతోమందికి పల్లకీలు మోసిన బీసీలను పల్లకీ ఎక్కించింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

1982లో ఏపీలో ఎక్కడ ఏ కులం ఉందో తెలియదని, వారిని వెదికి వెదికి అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పంపించిన ఘనత టీడీపీది, అన్నగారిదని చెప్పారు. కింజరాపు ఎర్రన్నాయుడు రాజకీయ జీవితానికి ఎన్టీఆర్ పునాది వేస్తే..దానిపై తాను రెండు సార్లు ఎంపీగా గెలిచానని చెప్పారు.

బీసీల కోసం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, 2014 నుంచి 2019 వరకు విద్య, ఉపాధి పరంగా కోట్ల రూపాయలతో అనేక పథకాలు తీసుకువచ్చారన్నారు. రూ.3,700 కోట్ల మేర బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి బీసీలకు చేయూతనిచ్చింది చంద్రబాబేనని చెప్పారు.

అయితే, ఒక్క అవకాశం అంటూ 2019లో దుర్మార్గుడు జగన్ అధికారంలోకి వచ్చాడని, దాంతో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని చెప్పారు. రూ.74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దుర్మార్గుడు జగన్ అని, బీసీలకు సంబంధించిన అనేక పథకాలను ఆపేశాడని ఆరోపించారు.
బీసీలకు 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని జగన్ బడాయి కొట్టుకుంటున్నాడని, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వద్దకు బీసీ సోదరులు వెళితే కప్పు టీ ఇవ్వడానికి కూడా నిధులు లేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తారని, నమ్మకద్రోహం చేస్తే తొక్కిపట్టి నార తీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. నా బీసీ అనే అర్హత జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్యానల్ స్పీకర్ అయ్యే అవకాశం దక్కితే… లోక్ సభలో మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ చేశారని ఆరోపించారు. రాజ్యసభలో ప్యానల్ స్పీకర్ అవకాశం వస్తే విజయసాయిరెడ్డికి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టీడీపీకి వస్తే ప్యానల్ స్పీకర్ గా కాదు, ఏకంగా స్పీకర్ గానే దళిత బిడ్డ బాలయోగిని కూర్చోబెట్టిందని గుర్తు చేశారు. ఎర్రన్నాయుడును కేంద్ర మంత్రిని చేసింది టీడీపీ అని అన్నారు.

Satya

Recent Posts

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

15 minutes ago

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…

47 minutes ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

3 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

4 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

5 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

5 hours ago