తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పంచాయితీ మొదలైంది. ఈ పంచాయితీకి అడ్వర్టైజ్మెంట్లు ప్రధాన కారణం కావటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వం జారిచేసిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలు మిస్సయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫొటో కూడా తప్పనిసరిగా కనబడుతోంది. సీఎంతో పాటు డిప్యుటి సీఎం ఫొటోను అడ్వర్టైజ్మెంట్లలో చూపించాలన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.
ఆ నిర్ణయానికి తగ్గట్లే ప్రతి ప్రకటన అది దినపత్రికల్లో కావచ్చు, పోస్టర్లలో కావచ్చు, చివరకు హోర్డింగుల్లో అయినా రేవంత్, బట్టి ఫొటోలు ఉంటున్నాయి. కాని తాజాగా అంటే సోమవారం ప్రభుత్వం జారిచేసిన అడ్వర్టైజ్మెంట్ లో కేవలం రేవంత్ రెడ్డి ఫొటో మాత్రమే ఉన్నది. భట్టి ఫొటో ఎందుకు మిస్సయ్యిందనే విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజాపాలనలో కొలువుల పండుగ పేరుతో ప్రభుత్వం ఒక ప్రకటన జారిచేసింది. అందులో గడచిన మూడునెలల్లో 5192 టీచర్లు, డాక్టర్లు, లెక్చిరర్లు, మెడికల్ స్టాప్, కానిస్టేబుళ్ళ ఉద్యోగాలిచ్చినట్లు అందులో ఉంది.
ఈ 5192 మంది అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెద్దగా నిర్వహించింది. దీనికోసమనే ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు జారీచేసింది. రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే ముందే అనుసరించాల్సిన ప్రోటోకాల్ ను అధిష్టానం స్పష్టంగా నిర్దేశించిందట. దాని ప్రకారం ప్రభుత్వం జారీచేసే ప్రతి అడ్వర్టైజ్మెంట్లోను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటో కూడా రేవంత్ ఫొటోతో పాటు ఉండితీరాల్సిందే అని చెప్పిందని పార్టీవర్గాలు చెప్పాయి. అంత స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికి ఇప్పుడు డిప్యుటి సీఎం ఫొటో ఎందుకు మిస్సయ్యిందనే పంచాయితీ మొదలైంది.
ఇదే విషయమై భట్టీ కార్యాలయంతో పాటు పార్టీలో ఆయన మద్దతుదారులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రకటనను జారీచేసిన సమాచార పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులను డిప్యుటి సీఎం కార్యాలయం వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఇపుడు మొదలైన పంచాయితి చివరకు ఎక్కడిదాకా వెళుతుందో తెలీటంలేదు. ఎవరి ఆదేశాల మేరకైనా భట్టి ఫొటో తీసేశారా ? లేకపోతే పొరబాటు జరిగిందా అన్నది ఇక్కడ కీలకమైంది. చివరకు ఏమి తేలుతుందో చూడాలి.
This post was last modified on March 5, 2024 2:31 pm
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాంచి ఊపుమీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన…
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో…
కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయ్యాయి. సంతృప్తి విషయంలో కూటమి పార్టీల నాయకులు తల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…
దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా…
తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…