భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే వేరుగా ఉంటోంది. ఆ పార్టీని మెప్పించేందుకా అన్నట్లు ఆయన ‘హిందుత్వ’ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. భాజపా అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ఆయన అనేక పనులు చేశారు. ఆయన ట్వీట్లలో కూడా చాలా వాటిని పరిశీలిస్తే ‘బీజేపీ’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది పవన్ను అభిమానించే చాలామందికి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇవి చాలవన్నట్లు పవన్ తాజాగా చేసిన ఒక ఫొటో షూట్ విమర్శల పాలవుతోంది. తన ఫామ్ హౌస్లోనో మరెక్కడో కానీ.. కుర్చీలో కూర్చుని పవన్ ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు ఈ ఫొటోల్లో. కానీ ఇది సహజంగా, అనుకోకుండా తీసిన ఫొటోలు కావన్నది స్పష్టం.
పనిగట్టుకుని ఒక సెటప్ చేయించుకుని ఫొటో షూట్ చేయించుకున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్.. ప్రధాని నరేంద్ర మోడీని అనుసరిస్తున్నాడేమో అనిపిస్తోంది. మోడీకి ఇలాంటి ఫొటో షూట్ల పిచ్చి బాగా ఉందన్న సంగతి తెలిసిందే. కరోనా టైంలో దేశం అల్లాడిపోతుంటే ఇప్పుడు కూడా నెమలిని పక్కన పెట్టుకుని ఫొటో షూట్లు చేయించుకున్న మహానుభావుడాయన. ఇలాంటి ఫొటోలతో ఏం సంకేతాలివ్వాలనుకుంటారో ఏమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకతే కనిపిస్తోంది. ప్రధానిని చెడా మడా తిట్టారు నెటిజన్లు. ఈ సంగతి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండే జనసేన వర్గాలకు తెలియకుండా ఉండకపోవచ్చు. మరి పవన్కు ఏం అవసరమని ఇలాంటి విన్యాసాలు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఈ ఫొటో షూట్ గురించి ఒకప్పటి ప్రజారాజ్యం నేత, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ ఒక కౌంటర్ కూడా వేశారు. ‘‘ఏమీ తెలియని వాళ్లకు తెలివైన వాళ్లుగా కనిపించాలని అనుకుంటే.. తెలివైన వాళ్ల ముందు ఏమీ తెలియని వాళ్లుగా మిగిలిపోతాం’’ అని ఆయన పంచ్ వేశారు.
This post was last modified on September 11, 2020 1:06 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…