భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే వేరుగా ఉంటోంది. ఆ పార్టీని మెప్పించేందుకా అన్నట్లు ఆయన ‘హిందుత్వ’ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. భాజపా అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ఆయన అనేక పనులు చేశారు. ఆయన ట్వీట్లలో కూడా చాలా వాటిని పరిశీలిస్తే ‘బీజేపీ’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది పవన్ను అభిమానించే చాలామందికి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇవి చాలవన్నట్లు పవన్ తాజాగా చేసిన ఒక ఫొటో షూట్ విమర్శల పాలవుతోంది. తన ఫామ్ హౌస్లోనో మరెక్కడో కానీ.. కుర్చీలో కూర్చుని పవన్ ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు ఈ ఫొటోల్లో. కానీ ఇది సహజంగా, అనుకోకుండా తీసిన ఫొటోలు కావన్నది స్పష్టం.
పనిగట్టుకుని ఒక సెటప్ చేయించుకుని ఫొటో షూట్ చేయించుకున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్.. ప్రధాని నరేంద్ర మోడీని అనుసరిస్తున్నాడేమో అనిపిస్తోంది. మోడీకి ఇలాంటి ఫొటో షూట్ల పిచ్చి బాగా ఉందన్న సంగతి తెలిసిందే. కరోనా టైంలో దేశం అల్లాడిపోతుంటే ఇప్పుడు కూడా నెమలిని పక్కన పెట్టుకుని ఫొటో షూట్లు చేయించుకున్న మహానుభావుడాయన. ఇలాంటి ఫొటోలతో ఏం సంకేతాలివ్వాలనుకుంటారో ఏమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకతే కనిపిస్తోంది. ప్రధానిని చెడా మడా తిట్టారు నెటిజన్లు. ఈ సంగతి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండే జనసేన వర్గాలకు తెలియకుండా ఉండకపోవచ్చు. మరి పవన్కు ఏం అవసరమని ఇలాంటి విన్యాసాలు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఈ ఫొటో షూట్ గురించి ఒకప్పటి ప్రజారాజ్యం నేత, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ ఒక కౌంటర్ కూడా వేశారు. ‘‘ఏమీ తెలియని వాళ్లకు తెలివైన వాళ్లుగా కనిపించాలని అనుకుంటే.. తెలివైన వాళ్ల ముందు ఏమీ తెలియని వాళ్లుగా మిగిలిపోతాం’’ అని ఆయన పంచ్ వేశారు.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…