భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే వేరుగా ఉంటోంది. ఆ పార్టీని మెప్పించేందుకా అన్నట్లు ఆయన ‘హిందుత్వ’ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. భాజపా అధినాయకత్వాన్ని మెప్పించేందుకు ఆయన అనేక పనులు చేశారు. ఆయన ట్వీట్లలో కూడా చాలా వాటిని పరిశీలిస్తే ‘బీజేపీ’ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇది పవన్ను అభిమానించే చాలామందికి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆయన తన ఐడెంటిటీని కోల్పోతున్నారనే అభిప్రాయాలున్నాయి. ఇవి చాలవన్నట్లు పవన్ తాజాగా చేసిన ఒక ఫొటో షూట్ విమర్శల పాలవుతోంది. తన ఫామ్ హౌస్లోనో మరెక్కడో కానీ.. కుర్చీలో కూర్చుని పవన్ ప్రశాంతంగా పుస్తకాలు చదువుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు ఈ ఫొటోల్లో. కానీ ఇది సహజంగా, అనుకోకుండా తీసిన ఫొటోలు కావన్నది స్పష్టం.
పనిగట్టుకుని ఒక సెటప్ చేయించుకుని ఫొటో షూట్ చేయించుకున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్.. ప్రధాని నరేంద్ర మోడీని అనుసరిస్తున్నాడేమో అనిపిస్తోంది. మోడీకి ఇలాంటి ఫొటో షూట్ల పిచ్చి బాగా ఉందన్న సంగతి తెలిసిందే. కరోనా టైంలో దేశం అల్లాడిపోతుంటే ఇప్పుడు కూడా నెమలిని పక్కన పెట్టుకుని ఫొటో షూట్లు చేయించుకున్న మహానుభావుడాయన. ఇలాంటి ఫొటోలతో ఏం సంకేతాలివ్వాలనుకుంటారో ఏమో కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకతే కనిపిస్తోంది. ప్రధానిని చెడా మడా తిట్టారు నెటిజన్లు. ఈ సంగతి ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండే జనసేన వర్గాలకు తెలియకుండా ఉండకపోవచ్చు. మరి పవన్కు ఏం అవసరమని ఇలాంటి విన్యాసాలు చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఈ ఫొటో షూట్ గురించి ఒకప్పటి ప్రజారాజ్యం నేత, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ ఒక కౌంటర్ కూడా వేశారు. ‘‘ఏమీ తెలియని వాళ్లకు తెలివైన వాళ్లుగా కనిపించాలని అనుకుంటే.. తెలివైన వాళ్ల ముందు ఏమీ తెలియని వాళ్లుగా మిగిలిపోతాం’’ అని ఆయన పంచ్ వేశారు.
This post was last modified on September 11, 2020 1:06 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…