రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీలో తలనొప్పులు పెరిగిపోతున్నాయి. మొదటిజాబితాలో భాగంగా తొమ్మిది మంది అభ్యర్ధులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఆరుగురి అభ్యర్ధిత్వాలపై పార్టీలో గోలగోల జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటులో నాన్ లోకల్ ఈటల రాజేందర్ కు టికెట్ ఇవ్వటాన్ని లోకల్ నేతలంతా తప్పుపడుతున్నారు. నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతికి నిరాశ తప్పలేదు. అలాగే జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు ఇవ్వటాన్ని పార్టీలోని చాలామంది నేతలు వ్యతరేకిస్తున్నారు.
ఎందుకంటే ఇక్కడి నుండి పోటీచేయటానికి ఆలె నరేంద్ర కొడుకు ఆలె భాస్కర్, మాజీమంత్రి బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. మొదటిజాబితాలో తమ పేర్లు లేకపోవటంతో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మండిపోతున్నారు. వీళ్ళందరి విషయాలను పక్కనపెట్టేస్తే హైదరాబాద్ లోక్ సభ అభ్యర్ధిగా మాధవీలత ఎంపికపై చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏమిటంటే మాధవీలత అసలు పార్టీ నేతే కాదు. టికెట్ ను ప్రకటించిన తర్వాతే మాధవి ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో సభ్యత్వం కూడా లేని మాధవికి పార్టీ టికెట్ ఇవ్వటంపైన చాలామంది జోకులు వేసుకుంటున్నారు.
అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ మాట్లాడుతు హైదరాబాద్ పార్లమెంటు సీటులో పోటీచేయటానికి పార్టీలో మగాడే దొరకలేదా అని సెటైర్లు వేశారు. మాధవి ఎంపికపై రాజాసింగ్ తన అసంతృప్తిని తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించే చేశారని అందరికీ తెలుసు. ఎందుకంటే మాధవీలత గెలుపు కాదు కనీసం గట్టిపోటీ ఇవ్వాలన్నా రాజాసింగ్ సహకారం తప్పని పరిస్ధితి.
ఇలాంటి పరిస్ధితుల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి ఎంపికలో పార్టీ అధిష్టానం కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని రాజాసింగ్ మండిపోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కిషన్ రెడ్డికి రాజాసింగ్ కు ఏమాత్రం పడదు. అందుకనే కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి ఎంపికపై రాజాసింగ్ సెటైర్లు వేసింది.
This post was last modified on March 4, 2024 12:21 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…