Political News

బీజేపీకి పెరిగిపోతున్న తలనొప్పులు

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీలో తలనొప్పులు పెరిగిపోతున్నాయి. మొదటిజాబితాలో భాగంగా తొమ్మిది మంది అభ్యర్ధులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఆరుగురి అభ్యర్ధిత్వాలపై పార్టీలో గోలగోల జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటులో నాన్ లోకల్ ఈటల రాజేందర్ కు టికెట్ ఇవ్వటాన్ని లోకల్ నేతలంతా తప్పుపడుతున్నారు. నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతికి నిరాశ తప్పలేదు. అలాగే జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు ఇవ్వటాన్ని పార్టీలోని చాలామంది నేతలు వ్యతరేకిస్తున్నారు.

ఎందుకంటే ఇక్కడి నుండి పోటీచేయటానికి ఆలె నరేంద్ర కొడుకు ఆలె భాస్కర్, మాజీమంత్రి బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. మొదటిజాబితాలో తమ పేర్లు లేకపోవటంతో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మండిపోతున్నారు. వీళ్ళందరి విషయాలను పక్కనపెట్టేస్తే హైదరాబాద్ లోక్ సభ అభ్యర్ధిగా మాధవీలత ఎంపికపై చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏమిటంటే మాధవీలత అసలు పార్టీ నేతే కాదు. టికెట్ ను ప్రకటించిన తర్వాతే మాధవి ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో సభ్యత్వం కూడా లేని మాధవికి పార్టీ టికెట్ ఇవ్వటంపైన చాలామంది జోకులు వేసుకుంటున్నారు.

అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ మాట్లాడుతు హైదరాబాద్ పార్లమెంటు సీటులో పోటీచేయటానికి పార్టీలో మగాడే దొరకలేదా అని సెటైర్లు వేశారు. మాధవి ఎంపికపై రాజాసింగ్ తన అసంతృప్తిని తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించే చేశారని అందరికీ తెలుసు. ఎందుకంటే మాధవీలత గెలుపు కాదు కనీసం గట్టిపోటీ ఇవ్వాలన్నా రాజాసింగ్ సహకారం తప్పని పరిస్ధితి.

ఇలాంటి పరిస్ధితుల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి ఎంపికలో పార్టీ అధిష్టానం కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని రాజాసింగ్ మండిపోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కిషన్ రెడ్డికి రాజాసింగ్ కు ఏమాత్రం పడదు. అందుకనే కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి ఎంపికపై రాజాసింగ్ సెటైర్లు వేసింది.

This post was last modified on March 4, 2024 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago