Political News

ప‌వ‌న్‌ని కలిస్తే.. జ‌గ‌న్ ఊరుకుంటాడా

వైసీపీకి జ‌న‌సేన‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉన్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్య‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మ‌ల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆరణి శ్రీనివాసులు నేరుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న‌ను క‌లిశారు. త‌న రాజ‌కీయ భ‌వితవ్యంపై చ‌ర్చించారు. అంతే.. ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక్ కాగానే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆర‌ణిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి వేరే పార్టీ అధ్యక్షుడ్ని కలిశారని, స‌ద‌రు స‌స్పెన్ష‌న్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ ప‌లునియోజ‌క‌వ‌ర్గాలకు స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ప‌క్క‌న పెట్టింది. ఈ స్థానం నుంచి ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. తనను కాదని అధిష్టానం వేరొకరికి తన నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వీడాలని భావించిన ఆయ‌న‌.. ఈ క్రమంలో జనసేనాని పవన్ తో సమావేశమై చర్చించారు. పార్టీలో చేరిక‌కు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఆయ‌న‌ త్వరలోనే జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.

మ‌రింత మంది జంప్?

వైనాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఇంఛార్జ్‌ల వరుస జాబితాలు విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ సీటు గల్లంతు కావడంతో అసంతృప్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోరిన చోట సీటు రాకున్నా కొందరు అధిష్టానా నికి ఆ మాట స్పష్టం చేస్తున్నారు. ఇదివరకే కొందరు నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా.. తాజాగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తనను ఇంఛార్జ్‌గా ప్రకటించక పోవడం, టికెట్ పై స్పష్టమైన హామీ రాకపోవడంతో వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక‌, రాబోయే రోజుల్లో ఈ జంపింగుల ప‌ర్వం మ‌రింత ఊపందుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on March 3, 2024 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

2 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

2 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

3 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

3 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

5 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

6 hours ago