Political News

ప‌వ‌న్‌ని కలిస్తే.. జ‌గ‌న్ ఊరుకుంటాడా

వైసీపీకి జ‌న‌సేన‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉన్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్య‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మ‌ల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆరణి శ్రీనివాసులు నేరుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న‌ను క‌లిశారు. త‌న రాజ‌కీయ భ‌వితవ్యంపై చ‌ర్చించారు. అంతే.. ఈ విష‌యం బ‌య‌ట‌కు లీక్ కాగానే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆర‌ణిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి వేరే పార్టీ అధ్యక్షుడ్ని కలిశారని, స‌ద‌రు స‌స్పెన్ష‌న్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ ప‌లునియోజ‌క‌వ‌ర్గాలకు స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ప‌క్క‌న పెట్టింది. ఈ స్థానం నుంచి ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. తనను కాదని అధిష్టానం వేరొకరికి తన నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వీడాలని భావించిన ఆయ‌న‌.. ఈ క్రమంలో జనసేనాని పవన్ తో సమావేశమై చర్చించారు. పార్టీలో చేరిక‌కు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఆయ‌న‌ త్వరలోనే జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.

మ‌రింత మంది జంప్?

వైనాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఇంఛార్జ్‌ల వరుస జాబితాలు విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ సీటు గల్లంతు కావడంతో అసంతృప్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోరిన చోట సీటు రాకున్నా కొందరు అధిష్టానా నికి ఆ మాట స్పష్టం చేస్తున్నారు. ఇదివరకే కొందరు నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా.. తాజాగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తనను ఇంఛార్జ్‌గా ప్రకటించక పోవడం, టికెట్ పై స్పష్టమైన హామీ రాకపోవడంతో వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక‌, రాబోయే రోజుల్లో ఈ జంపింగుల ప‌ర్వం మ‌రింత ఊపందుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on March 3, 2024 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago