Political News

పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవు

ఏపీలో త్వరలో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని, ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని, టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని టీడీపీ, జనసేన నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఐప్యాక్ మాజీ బాస్ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తేల్చి చెప్పేశారు.

హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న పీకే…రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జగన్ ఏం చేసినా ఓటమి తప్పదని పీకే చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.

ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవని పీకే చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని పీకే అన్నారు. తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు షాకింగ్ గా మారాయి.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

8 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

8 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

8 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

9 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

9 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

11 hours ago