ఏపీలో త్వరలో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని, ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని, టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని టీడీపీ, జనసేన నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఐప్యాక్ మాజీ బాస్ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తేల్చి చెప్పేశారు.
హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న పీకే…రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జగన్ ఏం చేసినా ఓటమి తప్పదని పీకే చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవని పీకే చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని పీకే అన్నారు. తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు షాకింగ్ గా మారాయి.
This post was last modified on March 3, 2024 9:49 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…