Political News

400 కోట్ల రూపాయ‌ల ఫామ్‌ హౌస్ నాశనం!

“ఆ.. ఎంతో మంది అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు.. నేను ఈ మాత్రం తీసుకుంటే త‌ప్పేంటి?” అనే మాట త‌ర‌చుగా వినిపిస్తుంది. కానీ, పాప‌పు సొమ్ము ఎప్పుడూ నిల‌బ‌డ‌దు. చివ‌ర‌కు.. అది ఎక్క‌డ‌కు చేరాలో.. ఎవ‌రికి వెళ్లాలో.. అక్క‌డికే వెళ్లిపోతుంది. జ‌నాల్ని దోచుకుని.. అక్ర‌మ మార్గాలు, వ‌క్ర‌మ మార్గాల్లో సంపాయించిన సొమ్ము..చివ‌ర‌కు స‌ర్కారుకు చేరిన ఘ‌ట‌న ఢిల్లీలో జ‌రిగింది. దాదాపు 400 కోట్ల రూపాయ‌ల అక్ర‌మ‌ ఆస్తిని స‌ర్కారు బ‌ల‌గాల‌ను పెట్టి మ‌రీ సొంతం చేసుకుంది.

ఇవీ వివ‌రాలు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసే గురుదీప్ సింగ్ ఉర‌ఫ్ పాంటీ చ‌ద్దా.. జ‌నాల్ని బాగానే దోచుకున్నారు. ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ‌వేసి, రాజ‌కీయ నేత‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి భూముల క‌బ్జాలు, దందాలు చేశాడు. ఇలా సంపాయించిన సొమ్ముతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. చ‌ద్దా.. ఒక్క యూపీలోనే కాకుండా.. బిహార్‌, ఢిల్లీ త‌దిత‌ర ఉత్త‌రాది రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆస్తులు పోగేశాడు. ఈ విష‌యంలోనే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి.

ఢిల్లీలో 10 ఎక‌రాల‌ను దౌర్జ‌న్యంగా సొంతం చేసుకున్న పాంటీ చ‌ద్దా.. ఇక్క‌డ భారీ ఫామ్ హౌస్‌ను నిర్మించాడు. ఈ విష‌యంలో పాంటీకి ఆయ‌న చిన్న‌త‌మ్ముడు హ‌ర్దీప్‌కు మ‌ధ్య వివాదం రేగింది. ఇరువురు త‌న్నుకున్నారు. ఈ క్ర‌మంలో హ‌ర్దీప్ పాంటీని కాల్చి చంపేశాడు. సినిమా అక్క‌డితో అయిపోలేదు.. పాంటీకి ఉన్న సెక్యూరిటీ.. హ‌ర్దీప్‌ను చంపేసింది. అంటే.. సొంత అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఆస్తుల కోసం.. అది కూడా అక్ర‌మాస్తుల కోసం చ‌చ్చిపోయారు.

క‌ట్ చేస్తే..

ఢిల్లీ పరిధిలోని ఛత్రపుర్‌ ప్రాంతంలో పాంటీ చద్దా ఏర్పాటు చేసుకున్న‌ 400 కోట్ల రూపాయ‌ల విలువైన‌ ఫామ్‌ హౌస్ ప్ర‌స్తుతం చ‌ద్దా త‌న‌యుడి ఆధ్వ‌ర్యంలో ఉంది. అయితే.. ఈయ‌న‌కు మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో నిర్వ‌హ‌ణ లేకుండా ప‌డి ఉంది. అంటే.. ఇంత ఆస్తిని కూడా అనుభ‌వించే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో అనేక ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో తాజాగా ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ ఫామ్ హౌస్‌ పూర్తిగా నేలమట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకుంది. చ‌ద్దా గతంలో బీజేసీ ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌భుత్వ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వెంట‌నే స్వాధీనం చేసుకున్నారు. దీనిలో గార్డెన్‌, అత్యంత విలాస వంత‌మైన‌ ఔట్‌హౌస్‌, ప్రధాన భవనం ఉన్నాయి. మొత్తానికి అక్ర‌మంగా వ‌చ్చిన సొమ్ము.. స‌ర్కారుకే చేర‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

4 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

4 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

4 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

5 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

5 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

7 hours ago