Political News

400 కోట్ల రూపాయ‌ల ఫామ్‌ హౌస్ నాశనం!

“ఆ.. ఎంతో మంది అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు.. నేను ఈ మాత్రం తీసుకుంటే త‌ప్పేంటి?” అనే మాట త‌ర‌చుగా వినిపిస్తుంది. కానీ, పాప‌పు సొమ్ము ఎప్పుడూ నిల‌బ‌డ‌దు. చివ‌ర‌కు.. అది ఎక్క‌డ‌కు చేరాలో.. ఎవ‌రికి వెళ్లాలో.. అక్క‌డికే వెళ్లిపోతుంది. జ‌నాల్ని దోచుకుని.. అక్ర‌మ మార్గాలు, వ‌క్ర‌మ మార్గాల్లో సంపాయించిన సొమ్ము..చివ‌ర‌కు స‌ర్కారుకు చేరిన ఘ‌ట‌న ఢిల్లీలో జ‌రిగింది. దాదాపు 400 కోట్ల రూపాయ‌ల అక్ర‌మ‌ ఆస్తిని స‌ర్కారు బ‌ల‌గాల‌ను పెట్టి మ‌రీ సొంతం చేసుకుంది.

ఇవీ వివ‌రాలు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసే గురుదీప్ సింగ్ ఉర‌ఫ్ పాంటీ చ‌ద్దా.. జ‌నాల్ని బాగానే దోచుకున్నారు. ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ‌వేసి, రాజ‌కీయ నేత‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి భూముల క‌బ్జాలు, దందాలు చేశాడు. ఇలా సంపాయించిన సొమ్ముతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. చ‌ద్దా.. ఒక్క యూపీలోనే కాకుండా.. బిహార్‌, ఢిల్లీ త‌దిత‌ర ఉత్త‌రాది రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆస్తులు పోగేశాడు. ఈ విష‌యంలోనే అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి.

ఢిల్లీలో 10 ఎక‌రాల‌ను దౌర్జ‌న్యంగా సొంతం చేసుకున్న పాంటీ చ‌ద్దా.. ఇక్క‌డ భారీ ఫామ్ హౌస్‌ను నిర్మించాడు. ఈ విష‌యంలో పాంటీకి ఆయ‌న చిన్న‌త‌మ్ముడు హ‌ర్దీప్‌కు మ‌ధ్య వివాదం రేగింది. ఇరువురు త‌న్నుకున్నారు. ఈ క్ర‌మంలో హ‌ర్దీప్ పాంటీని కాల్చి చంపేశాడు. సినిమా అక్క‌డితో అయిపోలేదు.. పాంటీకి ఉన్న సెక్యూరిటీ.. హ‌ర్దీప్‌ను చంపేసింది. అంటే.. సొంత అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ ఆస్తుల కోసం.. అది కూడా అక్ర‌మాస్తుల కోసం చ‌చ్చిపోయారు.

క‌ట్ చేస్తే..

ఢిల్లీ పరిధిలోని ఛత్రపుర్‌ ప్రాంతంలో పాంటీ చద్దా ఏర్పాటు చేసుకున్న‌ 400 కోట్ల రూపాయ‌ల విలువైన‌ ఫామ్‌ హౌస్ ప్ర‌స్తుతం చ‌ద్దా త‌న‌యుడి ఆధ్వ‌ర్యంలో ఉంది. అయితే.. ఈయ‌న‌కు మాన‌సిక స్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో నిర్వ‌హ‌ణ లేకుండా ప‌డి ఉంది. అంటే.. ఇంత ఆస్తిని కూడా అనుభ‌వించే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో అనేక ఫిర్యాదులు అందిన నేప‌థ్యంలో తాజాగా ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ ఫామ్ హౌస్‌ పూర్తిగా నేలమట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకుంది. చ‌ద్దా గతంలో బీజేసీ ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌భుత్వ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వెంట‌నే స్వాధీనం చేసుకున్నారు. దీనిలో గార్డెన్‌, అత్యంత విలాస వంత‌మైన‌ ఔట్‌హౌస్‌, ప్రధాన భవనం ఉన్నాయి. మొత్తానికి అక్ర‌మంగా వ‌చ్చిన సొమ్ము.. స‌ర్కారుకే చేర‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 3, 2024 9:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?

ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…

10 minutes ago

ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు

ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…

3 hours ago

పాకిస్థాన్‌లో నో రిలీజ్… అయినా అక్క‌డ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్

కొన్నేళ్ల నుంచి భార‌త్‌, పాకిస్థాన్ సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. ఈ ఏడాది ఆరంభంలో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత అవి పూర్తిగా…

4 hours ago

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

6 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

8 hours ago