“ఆ.. ఎంతో మంది అక్రమాలకు పాల్పడుతున్నారు.. నేను ఈ మాత్రం తీసుకుంటే తప్పేంటి?” అనే మాట తరచుగా వినిపిస్తుంది. కానీ, పాపపు సొమ్ము ఎప్పుడూ నిలబడదు. చివరకు.. అది ఎక్కడకు చేరాలో.. ఎవరికి వెళ్లాలో.. అక్కడికే వెళ్లిపోతుంది. జనాల్ని దోచుకుని.. అక్రమ మార్గాలు, వక్రమ మార్గాల్లో సంపాయించిన సొమ్ము..చివరకు సర్కారుకు చేరిన ఘటన ఢిల్లీలో జరిగింది. దాదాపు 400 కోట్ల రూపాయల అక్రమ ఆస్తిని సర్కారు బలగాలను పెట్టి మరీ సొంతం చేసుకుంది.
ఇవీ వివరాలు..
ఉత్తర్ ప్రదేశ్లో లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే గురుదీప్ సింగ్ ఉరఫ్ పాంటీ చద్దా.. జనాల్ని బాగానే దోచుకున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగవేసి, రాజకీయ నేతలను ప్రలోభాలకు గురి చేసి భూముల కబ్జాలు, దందాలు చేశాడు. ఇలా సంపాయించిన సొమ్ముతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా.. చద్దా.. ఒక్క యూపీలోనే కాకుండా.. బిహార్, ఢిల్లీ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆస్తులు పోగేశాడు. ఈ విషయంలోనే అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా జరిగాయి.
ఢిల్లీలో 10 ఎకరాలను దౌర్జన్యంగా సొంతం చేసుకున్న పాంటీ చద్దా.. ఇక్కడ భారీ ఫామ్ హౌస్ను నిర్మించాడు. ఈ విషయంలో పాంటీకి ఆయన చిన్నతమ్ముడు హర్దీప్కు మధ్య వివాదం రేగింది. ఇరువురు తన్నుకున్నారు. ఈ క్రమంలో హర్దీప్ పాంటీని కాల్చి చంపేశాడు. సినిమా అక్కడితో అయిపోలేదు.. పాంటీకి ఉన్న సెక్యూరిటీ.. హర్దీప్ను చంపేసింది. అంటే.. సొంత అన్నదమ్ములు ఇద్దరూ ఆస్తుల కోసం.. అది కూడా అక్రమాస్తుల కోసం చచ్చిపోయారు.
కట్ చేస్తే..
ఢిల్లీ పరిధిలోని ఛత్రపుర్ ప్రాంతంలో పాంటీ చద్దా ఏర్పాటు చేసుకున్న 400 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ ప్రస్తుతం చద్దా తనయుడి ఆధ్వర్యంలో ఉంది. అయితే.. ఈయనకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నిర్వహణ లేకుండా పడి ఉంది. అంటే.. ఇంత ఆస్తిని కూడా అనుభవించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తాజాగా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫామ్ హౌస్ పూర్తిగా నేలమట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకుంది. చద్దా గతంలో బీజేసీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకున్నారు. దీనిలో గార్డెన్, అత్యంత విలాస వంతమైన ఔట్హౌస్, ప్రధాన భవనం ఉన్నాయి. మొత్తానికి అక్రమంగా వచ్చిన సొమ్ము.. సర్కారుకే చేరడం గమనార్హం.
This post was last modified on March 3, 2024 9:47 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…