Political News

ఏపీలో కోటిమందిని టచ్ చేసి వెళ్లిన కరోనా

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కొత్తలో వైరస్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల విపరీతంగా భయపడేవారు. క్రమక్రమంగా కరోనా లక్షణాలు, చికిత్స పై అవగాహన పెరగడంతో…కరోనాకు అతిగా భయపడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు మాత్రం ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఒక వేళ చాలామందిలో స్వల్ప లక్షణాలు కనిపించినా…వెంటనే హోం క్వారంటైన్ లో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇక, చాలామంది తమకు కరోనా వచ్చి వెళ్లిన సంగతే తెలీదని…ఇప్పటికి ఒక్కసారైనా వచ్చి పోయి ఉంటుందని చెప్పుకుంటున్నారు. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేకుండా చాలామందిని కరోనా టచ్ చేసి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. వారంతా అనుకున్నట్టుగానే ఏపీలో 19.7 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని సీరో సర్వేలెన్స్ ఫలితాల్లో వెల్లడైంది. ఏపీ జనాభాలో సుమారుగా కోటి మందిని కరోనా టచ్ చేసి వెళ్లిందని సర్వేలో వెల్లడైంది.

కమ్యూనల్‌ డీసీజ్‌ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలేన్స్‌ చేపడతారని, హరియాణా తర్వాత ఏపీలోనే ఈ తరహా సీరో సర్వే చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చివెళ్లిందని వెల్లడించారు. పట్టణాల్లో 22.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి, హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్‌ టెస్ట్‌ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఈ సర్వే చేపట్టామన్నారు . ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూల్, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు‌. త్వరలోనే చిత్తూరు, విశాఖలో కేసులు తగ్గుముఖం పట్టనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ జిల్లాలో పరీక్షలు ఎక్కువగా చేసి, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

This post was last modified on September 11, 2020 12:23 am

Share
Show comments
Published by
suman

Recent Posts

చంద్ర‌బాబుకు ఊపిరి పోసిన అమిత్ షా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని పెద్ద‌లు ఎవ‌రూ.. ముఖ్యంగా బీజేపీ అగ్ర‌నాయ‌కులుగా ఉన్న‌వారు…

6 hours ago

ఏపీ డీజీపీ బ‌దిలీ : ఈసీ యాక్ష‌న్‌

ఏపీలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా మంది…

6 hours ago

కుటుంబాల్లో పొలిటిక‌ల్‌ క‌ల్లోలం!

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో వారం రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 13న అంటే వ‌చ్చే సోమ‌వారం.. ఎన్నిక‌ల…

7 hours ago

ఇండియన్-2 ఫిక్స్.. గేమ్‌చేంజర్‌కు భయం లేదు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…

8 hours ago

జ‌గ‌న్ రాముడిని అవ‌మానించాడు.. అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు.…

9 hours ago

పుష్ప గొంతు విప్పాడు

ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…

10 hours ago