Political News

ఏపీలో కోటిమందిని టచ్ చేసి వెళ్లిన కరోనా

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న కొత్తలో వైరస్ పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల విపరీతంగా భయపడేవారు. క్రమక్రమంగా కరోనా లక్షణాలు, చికిత్స పై అవగాహన పెరగడంతో…కరోనాకు అతిగా భయపడకుండా అప్రమత్తంగా ఉంటున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు మాత్రం ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఒక వేళ చాలామందిలో స్వల్ప లక్షణాలు కనిపించినా…వెంటనే హోం క్వారంటైన్ లో చికిత్స పొంది కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇక, చాలామంది తమకు కరోనా వచ్చి వెళ్లిన సంగతే తెలీదని…ఇప్పటికి ఒక్కసారైనా వచ్చి పోయి ఉంటుందని చెప్పుకుంటున్నారు. స్వల్ప లక్షణాలు, అసలు లక్షణాలు లేకుండా చాలామందిని కరోనా టచ్ చేసి వెళ్లిపోయిందని అనుకుంటున్నారు. వారంతా అనుకున్నట్టుగానే ఏపీలో 19.7 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని సీరో సర్వేలెన్స్ ఫలితాల్లో వెల్లడైంది. ఏపీ జనాభాలో సుమారుగా కోటి మందిని కరోనా టచ్ చేసి వెళ్లిందని సర్వేలో వెల్లడైంది.

కమ్యూనల్‌ డీసీజ్‌ ఎంత తీవ్రస్థాయిలో ఉందో తెలుసుకోవడం కోసం సీరో సర్వేలేన్స్‌ చేపడతారని, హరియాణా తర్వాత ఏపీలోనే ఈ తరహా సీరో సర్వే చేపట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 19.9 శాతం మందికి కరోనా వచ్చివెళ్లిందని వెల్లడించారు. పట్టణాల్లో 22.5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5 శాతం, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3 శాతం మందికి, హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చి పోయిందని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు దఫాలుగా సీరో సర్వైలెన్స్ సర్వే నిర్వహించామని అధికారులు తెలిపారు. ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్‌ టెస్ట్‌ చేశామన్నారు. పూర్తిగా ఏ లక్షణాలు లేని వారి మీద కూడా ఈ సర్వే చేపట్టామన్నారు . ఈ సర్వే ద్వారా త్వరలోనే కర్నూల్, విజయనగరం జిల్లాలో కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేశామన్నారు‌. త్వరలోనే చిత్తూరు, విశాఖలో కేసులు తగ్గుముఖం పట్టనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఆ జిల్లాలో పరీక్షలు ఎక్కువగా చేసి, బెడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

This post was last modified on September 11, 2020 12:23 am

Share
Show comments
Published by
suman

Recent Posts

నంబర్ వన్ కమెడియన్లు ఒక్కటయ్యారు

తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…

1 hour ago

బండి వివాదంపై తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…

2 hours ago

త్రిష చేతిలో బంపర్ ఆఫర్?

మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…

2 hours ago

మాజీ సీఎం ఇంటికి కొత్త సీఎం… వాహ్!

తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…

3 hours ago

బండి సంజయ్ కు సీఎం షాక్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

4 hours ago

పవన్‌తో బాలినేని సినిమా?

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…

6 hours ago