Political News

అసమ్మతి నేతలను బీజేపీ పట్టించుకోలేదా ?

తెలంగాణాలో విడుదలైన బీజేపీ ఎంపీ అభ్యర్ధుల మొదటిజాబితాను చూసిన తర్వాత ఇదే విషయం అర్ధమవుతోంది. మొదటిజాబితాలో పార్టీ అగ్రనేతలు తొమ్మిది స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. సికింద్రాబాద్ నుండి కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్ కు టికెట్లు దక్కాయి. వీరుముగ్గురు ప్రస్తుతం పై నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగో స్ధానం ఆదిలాబాద్ లో ఎంపీ సోయం బాబూరావు పేరను ప్రకటించకుండా పెండింగులో ఉంచారు.

మరి బాబూరావుకు టికెట్ ఇస్తారా లేకపోతే కొత్తవారిని పోటీచేయిస్తారా అన్నవిషయంలో సస్పెన్సు కంటిన్యు అవుతోంది. ఇక మల్కాజ్ గిరి నుండి ఈటల రాజేందర్, జహీరాబాద్ నుండి బీబీ పాటిల్, హైదరాబాద్ నుండి డాక్టర్ మాధవీలత, చేవెళ్ళ నుండి కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుండి పి. భరత్, భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ పోటీచేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే టికెట్ హామీతో బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన నాగర్ కర్నూలు ఎంపీ పి. రాములుకు టికెట్ ఇవ్వలేదు. రాములుకు బదులు భరత్ కు ఇచ్చారు.

ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎంతమంది నేతలు వద్దని చెప్పినా మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ కు అగ్రనేతలు టికెట్ ప్రకటించటం. మల్కాజ్ గిరి టికెట్ కోసం చాడ సురేష్ రెడ్డి, కొమరయ్య, మురళీధరరావు, శ్రీశైలం గౌడ్ లాంటి చాలామంది నేతలు గట్టిగా ప్రయత్నించుకున్నారు. వీళ్ళందరు కూడా తమ ప్రయత్నాలకు మద్దతుగా లోకల్స్ కే టికెట్ ఇవ్వాలనే కోరస్ డిమాండ్ ను అగ్రనేతలకు వినిపించారు.

వీళ్ళల్లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా అగ్రనేతలు మాత్రం ఈటలకే టికెట్ ప్రకటించారు. టికెట్ దక్కే విషయంలో అనుమానంతోనే గౌడ్ కాంగ్రెస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా, ఎంత ఒత్తిళ్ళు తెచ్చినా ఎలాంటి ఉపయోగాలు లేకుండా పోయాయి. మరి ఇంతమందిని కాదని టికెట్ తెచ్చుకున్న ఈటలకు స్ధానిక నేతలు ఏమేరకు సహకరిస్తారన్నది అనుమానమే.

This post was last modified on March 3, 2024 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

9 minutes ago

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

53 minutes ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

1 hour ago

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

1 hour ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

1 hour ago

అన్నగారికి అసలు టెన్షనే లేదు

అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…

1 hour ago