Political News

కంగనా రనౌత్ పై 2 కేసులు నమోదు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్‌ ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరేను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కంగనా రనౌత్‌పై ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గౌరవానికి భంగం కలిగించేలా కంగనా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలోని విఖ్రోలి పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలకు నటి కంగనా రనౌత్ పై ఒక కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ను కంగనా “తుఝే” అని ఏకవచనంతో సంబోధిస్తూ అగౌరవపరిచిందని కేసు నమోదైంది. ఉద్ధవ్ థాకరే తుఝే క్యా లగ్ తా హై అంటూ కంగనా మాట్లాడిన వీడియోపై శివసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదైంది.

తన ఆఫీసును కూల్చివేసిన తర్వాత కంగనా బీఎంసీ అధికారులపై, మహారాష్ట్ర సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు జరిగిన ఘటనను కశ్మీర్ పండిట్ల ఘటనతో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఒక మతం, వర్గం వారికి వ్యతిరేకంగా ఉన్నాయని కంగనాపై రెండో కేసు నమోదైంది.మరోవైపు, ఉధ్ధవ్ థాకరేపై కంగనా మాటల దాడి కొనసాగుతూనే ఉంది. అధికారం కోసం బాలా సాహెబ్ థాకరే భావజాలాన్ని అమ్మకానికి పెట్టిన పార్టీ ఇప్పుడు శివసేనగా లేదని..సోనియా సేనగా మారిందంటూ కంగనా రనౌత్ మరో సంచలన ట్వీట్ చేసింది.

This post was last modified on September 10, 2020 11:21 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

1 hour ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

3 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

4 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

4 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

7 hours ago