బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్ ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరేను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కంగనా రనౌత్పై ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గౌరవానికి భంగం కలిగించేలా కంగనా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలోని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలకు నటి కంగనా రనౌత్ పై ఒక కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ను కంగనా “తుఝే” అని ఏకవచనంతో సంబోధిస్తూ అగౌరవపరిచిందని కేసు నమోదైంది. ఉద్ధవ్ థాకరే తుఝే క్యా లగ్ తా హై అంటూ కంగనా మాట్లాడిన వీడియోపై శివసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదైంది.
తన ఆఫీసును కూల్చివేసిన తర్వాత కంగనా బీఎంసీ అధికారులపై, మహారాష్ట్ర సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు జరిగిన ఘటనను కశ్మీర్ పండిట్ల ఘటనతో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఒక మతం, వర్గం వారికి వ్యతిరేకంగా ఉన్నాయని కంగనాపై రెండో కేసు నమోదైంది.మరోవైపు, ఉధ్ధవ్ థాకరేపై కంగనా మాటల దాడి కొనసాగుతూనే ఉంది. అధికారం కోసం బాలా సాహెబ్ థాకరే భావజాలాన్ని అమ్మకానికి పెట్టిన పార్టీ ఇప్పుడు శివసేనగా లేదని..సోనియా సేనగా మారిందంటూ కంగనా రనౌత్ మరో సంచలన ట్వీట్ చేసింది.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…