బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర సర్కార్ ల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్ధవ్ థాకరేను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశించి కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కంగనా రనౌత్పై ముంబైలో రెండు కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే గౌరవానికి భంగం కలిగించేలా కంగనా వ్యాఖ్యలు చేసినందుకు ముంబైలోని విఖ్రోలి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై చేసిన వ్యాఖ్యలకు నటి కంగనా రనౌత్ పై ఒక కేసు నమోదైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ను కంగనా “తుఝే” అని ఏకవచనంతో సంబోధిస్తూ అగౌరవపరిచిందని కేసు నమోదైంది. ఉద్ధవ్ థాకరే తుఝే క్యా లగ్ తా హై అంటూ కంగనా మాట్లాడిన వీడియోపై శివసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదైంది.
తన ఆఫీసును కూల్చివేసిన తర్వాత కంగనా బీఎంసీ అధికారులపై, మహారాష్ట్ర సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు జరిగిన ఘటనను కశ్మీర్ పండిట్ల ఘటనతో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఒక మతం, వర్గం వారికి వ్యతిరేకంగా ఉన్నాయని కంగనాపై రెండో కేసు నమోదైంది.మరోవైపు, ఉధ్ధవ్ థాకరేపై కంగనా మాటల దాడి కొనసాగుతూనే ఉంది. అధికారం కోసం బాలా సాహెబ్ థాకరే భావజాలాన్ని అమ్మకానికి పెట్టిన పార్టీ ఇప్పుడు శివసేనగా లేదని..సోనియా సేనగా మారిందంటూ కంగనా రనౌత్ మరో సంచలన ట్వీట్ చేసింది.
This post was last modified on September 10, 2020 11:21 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…