Political News

రెండుసార్లు సర్వే చేయించుకున్నారా ?

రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలోసస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీచేయబోతున్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంనై ప్రచారం జరిగినా మళ్ళీ ఎందుకో మరుగునపడిపోయింది. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ ప్రచారం ఊపందుకుంది.

అసలైతే భీమవరంలోనే పవన్ పోటీ అన్నారు. అయితే ఇక్కడినుండి మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులని పోటీచేయమని స్వయంగా పవనే అడిగారు. దాంతో భీమవరంలో పవన్ పోటీచేయటంలేదని తేలిపోయింది. మరి పోటీచేసే ఉద్దేశ్యంలేనపుడు టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మద్దతివ్వమని ఎందుకు అడిగారో అర్ధంకావటంలేదు. టీడీపీ నేతల ఇళ్ళకి పవనే స్వయంగా వెళ్ళి మద్దతు అడగటంతో భీమవరంలో పవనే పోటీచేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. సరే ఈ విషయమై క్లారిటి రాగానే పిఠాపురం నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వచ్చేసింది.

ఈ నియోజకవర్గం పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే పవన్ తన పోటీ విషయమై ఫిబ్రవరి నెలలోనే రెండుసార్లు సర్వే చేయించుకున్నారట. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పవన్ సర్వే చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి ప్రధానకారణం ఏమిటంటే ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమేనట. నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల ఓట్లుంటే కాపుల ఓట్లు సుమారు 60 వేలదాక ఉంటుందని అంటున్నారు.

కాపులంతా గంపగుత్తగా ఓట్లేసి ఇతర సామాజికవర్గాల్లోని వాళ్ళు కూడా ఓట్లస్తే పవన్ గెలుపు ఖాయమని సర్వేలో తేలినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా కాపులకు బీసీలకు ఏమాత్రం పడదు. అలాగే కాపులకు ఎస్సీలకు కూడా పడదు. ఇలాంటి నేపధ్యంలో ఇతర సామాజికవర్గాలు పవన్ కు ఓట్లేస్తాయా అన్నది కీలకమైన పాయింట్. సమాజమంతా కులాల వారీగా ఎప్పుడో చీలిపోయింది. కాబట్టి కులాలకు అతీతంగా అందరు లేకపోతే మెజారిటి జనాలు పవన్ కు ఓట్లేసి గెలిపిస్తారని అనుకునేందుకు లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on March 1, 2024 12:32 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

51 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

57 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

3 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

3 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

9 hours ago