రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలోసస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీచేయబోతున్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంనై ప్రచారం జరిగినా మళ్ళీ ఎందుకో మరుగునపడిపోయింది. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ ప్రచారం ఊపందుకుంది.
అసలైతే భీమవరంలోనే పవన్ పోటీ అన్నారు. అయితే ఇక్కడినుండి మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులని పోటీచేయమని స్వయంగా పవనే అడిగారు. దాంతో భీమవరంలో పవన్ పోటీచేయటంలేదని తేలిపోయింది. మరి పోటీచేసే ఉద్దేశ్యంలేనపుడు టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మద్దతివ్వమని ఎందుకు అడిగారో అర్ధంకావటంలేదు. టీడీపీ నేతల ఇళ్ళకి పవనే స్వయంగా వెళ్ళి మద్దతు అడగటంతో భీమవరంలో పవనే పోటీచేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. సరే ఈ విషయమై క్లారిటి రాగానే పిఠాపురం నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వచ్చేసింది.
ఈ నియోజకవర్గం పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే పవన్ తన పోటీ విషయమై ఫిబ్రవరి నెలలోనే రెండుసార్లు సర్వే చేయించుకున్నారట. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పవన్ సర్వే చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి ప్రధానకారణం ఏమిటంటే ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమేనట. నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల ఓట్లుంటే కాపుల ఓట్లు సుమారు 60 వేలదాక ఉంటుందని అంటున్నారు.
కాపులంతా గంపగుత్తగా ఓట్లేసి ఇతర సామాజికవర్గాల్లోని వాళ్ళు కూడా ఓట్లస్తే పవన్ గెలుపు ఖాయమని సర్వేలో తేలినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా కాపులకు బీసీలకు ఏమాత్రం పడదు. అలాగే కాపులకు ఎస్సీలకు కూడా పడదు. ఇలాంటి నేపధ్యంలో ఇతర సామాజికవర్గాలు పవన్ కు ఓట్లేస్తాయా అన్నది కీలకమైన పాయింట్. సమాజమంతా కులాల వారీగా ఎప్పుడో చీలిపోయింది. కాబట్టి కులాలకు అతీతంగా అందరు లేకపోతే మెజారిటి జనాలు పవన్ కు ఓట్లేసి గెలిపిస్తారని అనుకునేందుకు లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…