రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలోసస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీచేయబోతున్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంనై ప్రచారం జరిగినా మళ్ళీ ఎందుకో మరుగునపడిపోయింది. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ ప్రచారం ఊపందుకుంది.
అసలైతే భీమవరంలోనే పవన్ పోటీ అన్నారు. అయితే ఇక్కడినుండి మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులని పోటీచేయమని స్వయంగా పవనే అడిగారు. దాంతో భీమవరంలో పవన్ పోటీచేయటంలేదని తేలిపోయింది. మరి పోటీచేసే ఉద్దేశ్యంలేనపుడు టీడీపీ నేతల ఇళ్ళకు వెళ్ళి మద్దతివ్వమని ఎందుకు అడిగారో అర్ధంకావటంలేదు. టీడీపీ నేతల ఇళ్ళకి పవనే స్వయంగా వెళ్ళి మద్దతు అడగటంతో భీమవరంలో పవనే పోటీచేస్తున్నారనే ప్రచారం పెరిగిపోయింది. సరే ఈ విషయమై క్లారిటి రాగానే పిఠాపురం నియోజకవర్గం పేరు ప్రచారంలోకి వచ్చేసింది.
ఈ నియోజకవర్గం పేరు ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటే పవన్ తన పోటీ విషయమై ఫిబ్రవరి నెలలోనే రెండుసార్లు సర్వే చేయించుకున్నారట. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా పవన్ సర్వే చేయించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. దీనికి ప్రధానకారణం ఏమిటంటే ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమేనట. నియోజకవర్గంలో సుమారు 2.5 లక్షల ఓట్లుంటే కాపుల ఓట్లు సుమారు 60 వేలదాక ఉంటుందని అంటున్నారు.
కాపులంతా గంపగుత్తగా ఓట్లేసి ఇతర సామాజికవర్గాల్లోని వాళ్ళు కూడా ఓట్లస్తే పవన్ గెలుపు ఖాయమని సర్వేలో తేలినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా కాపులకు బీసీలకు ఏమాత్రం పడదు. అలాగే కాపులకు ఎస్సీలకు కూడా పడదు. ఇలాంటి నేపధ్యంలో ఇతర సామాజికవర్గాలు పవన్ కు ఓట్లేస్తాయా అన్నది కీలకమైన పాయింట్. సమాజమంతా కులాల వారీగా ఎప్పుడో చీలిపోయింది. కాబట్టి కులాలకు అతీతంగా అందరు లేకపోతే మెజారిటి జనాలు పవన్ కు ఓట్లేసి గెలిపిస్తారని అనుకునేందుకు లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…