Political News

సెగలు పుట్టిస్తున్న ‘మేడిగడ్డ’ రాజకీయం

తెలంగాణాలో మేడిగడ్డ బ్యారేజి రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. బ్యారేజీ నాసిరకం నిర్మాణం కారణంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరగటమే కాకుండా బ్యారేజి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజి పనికిరాకుండా పోతే దీని ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పనికిరాదని మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతిని, నాసిరకం నిర్మాణంపై క్షేత్రస్ధాయి పర్యటన జరిగింది. మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు బ్యారేజీని ప్రత్యక్షంగా చూసొచ్చారు.

అందుకనే మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నాయకత్వంలో పార్టీకి చెందిన సుమారు 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజిని సందర్శించబోతున్నారు. తమ సందర్శన ద్వారా బ్యారేజి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని చెప్పబోతున్నారు. కేవలం రాజకీయంగా కేసీయార్ ను బద్నాం చేయటం ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ అని కేటీయార్ అండ్ కో ఎదురుదాడి చేయబోతున్నారు.

అయితే వీళ్ళగోల ఇలాగుంటే పార్టీలతో సంబంధం లేని ప్రజాసంఘాలు కూడా మధ్యలో దూరాయి. కేసీయార్ హయాంలో జరిగిన అవినీతిని తాము నిరూపిస్తామని మొదలుపెట్టాయి. కేటీయార్ తమను కూడా తీసుకెళితే బ్యారేజి దగ్గరే కేసీయార్ అవినీతిని నిరూపిస్తామని తెలంగాణా ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎం. రఘుమారెడ్డి సవాలు విసిరారు. కేటీయార్ కు చిత్తశుద్ది ఉంటే తమను కూడా బ్యారేజి దగ్గరకు తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. కేసీయార్ అవినీతికి పాల్పడకపోతే బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి గోడలకు పగుళ్ళు ఎలాగ వస్తాయని కేటీయార్ ను నిలదీస్తున్నారు.

బ్యారేజీల రాజకీయాన్ని మానుకోవాలని రఘుమారెడ్డి బీఆర్ఎస్ నేతలకు హితవుచెబుతున్నారు. కేసీయార్ హయాంలో జరిగింది ముమ్మాటికి నాసిరకం నిర్మాణాలు కాబట్టి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు వాడకానికి పనికిరాకుండా పోతున్నాయని మండిపడ్డారు. కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్ మాట్లాడుతు కాళేశ్వరం రీ డిజైనింగే పెద్ద తప్పన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతే ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణాన్ని పరిశీలించేందుకు జలశక్తి ఒక నిపుణుల కమిటిని ఏర్పాటుచేసింది. గోదావరి బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ నాయకత్వంలో కమిటి బ్యారేజిని పరిశీలించబోతోంది.

This post was last modified on March 1, 2024 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

56 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago