తెలంగాణాలో మేడిగడ్డ బ్యారేజి రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. బ్యారేజీ నాసిరకం నిర్మాణం కారణంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరగటమే కాకుండా బ్యారేజి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజి పనికిరాకుండా పోతే దీని ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పనికిరాదని మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతిని, నాసిరకం నిర్మాణంపై క్షేత్రస్ధాయి పర్యటన జరిగింది. మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు బ్యారేజీని ప్రత్యక్షంగా చూసొచ్చారు.
అందుకనే మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ నాయకత్వంలో పార్టీకి చెందిన సుమారు 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజిని సందర్శించబోతున్నారు. తమ సందర్శన ద్వారా బ్యారేజి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలేనని చెప్పబోతున్నారు. కేవలం రాజకీయంగా కేసీయార్ ను బద్నాం చేయటం ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ అని కేటీయార్ అండ్ కో ఎదురుదాడి చేయబోతున్నారు.
అయితే వీళ్ళగోల ఇలాగుంటే పార్టీలతో సంబంధం లేని ప్రజాసంఘాలు కూడా మధ్యలో దూరాయి. కేసీయార్ హయాంలో జరిగిన అవినీతిని తాము నిరూపిస్తామని మొదలుపెట్టాయి. కేటీయార్ తమను కూడా తీసుకెళితే బ్యారేజి దగ్గరే కేసీయార్ అవినీతిని నిరూపిస్తామని తెలంగాణా ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎం. రఘుమారెడ్డి సవాలు విసిరారు. కేటీయార్ కు చిత్తశుద్ది ఉంటే తమను కూడా బ్యారేజి దగ్గరకు తీసుకెళ్ళాలని డిమాండ్ చేశారు. కేసీయార్ అవినీతికి పాల్పడకపోతే బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి గోడలకు పగుళ్ళు ఎలాగ వస్తాయని కేటీయార్ ను నిలదీస్తున్నారు.
బ్యారేజీల రాజకీయాన్ని మానుకోవాలని రఘుమారెడ్డి బీఆర్ఎస్ నేతలకు హితవుచెబుతున్నారు. కేసీయార్ హయాంలో జరిగింది ముమ్మాటికి నాసిరకం నిర్మాణాలు కాబట్టి మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు వాడకానికి పనికిరాకుండా పోతున్నాయని మండిపడ్డారు. కేంద్ర జలశక్తి సలహాదారుడు వెదిరే శ్రీరామ్ మాట్లాడుతు కాళేశ్వరం రీ డిజైనింగే పెద్ద తప్పన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతే ఇవ్వలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజి నాసిరకం నిర్మాణాన్ని పరిశీలించేందుకు జలశక్తి ఒక నిపుణుల కమిటిని ఏర్పాటుచేసింది. గోదావరి బోర్డు మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ నాయకత్వంలో కమిటి బ్యారేజిని పరిశీలించబోతోంది.
This post was last modified on March 1, 2024 12:30 pm
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…