జనసేన పార్టీకి మరో స్టార్ క్యాంపెయినర్ రెడీ అయ్యారు. అది కూడా మెగా కుటుంబం నుంచే కావడం గమ నార్హం. వచ్చే ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం విశేషం. అయితే.. ఆ స్టార్ క్యాంపెయినర్.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
బాబాయి(జనసేనాని పవన్)తో కలిసి అనేక సందర్భాల్లో రైతులను కలిశారు. వారి కష్టాలు విన్నాను. వారి సమస్యలు తెలుసుకున్నాను. అప్పటి నుంచే నాకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. గత ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తానని చెప్పాను. కానీ, ఎందుకో ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాను. ఇప్పుడు కూడా బాబాయి తరఫున ప్రచారం చేసేందుకు నేను సిద్ధంగానే ఉన్నాను అని నిహారిక వెల్లడించారు.
తన ఓటు ఏపీలోనే ఉన్నదన్న ఆమె.. గత ఏడాది కూడా ఓటు వేసినట్టు తెలిపారు. ఇప్పుడు కూడా ఏపీ లోనే ఓటు వేయనున్నట్టు తెలిపారు. మార్పు కోసం పవన్ చేస్తున్న ప్రయత్నాలకు యువత కలిసి రావాల ని ఆమె పిలుపునిచ్చారు. ఏపీ రాజకీయాలను తాను ఆసక్తిగా గమనిస్తున్నానని చెప్పారు. ఏపీలో రాజకీయ మార్పు కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే.. దీనికి బాబాయి తరఫున మెగా కుటంబం కూడా కదులుతుందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి మెగా స్టార్ రామ్ చరణ్కూడా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. పవన్ ఆయనను నిలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికే నాగబాబు ప్రచారంంలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా.. తన నియోజకవర్గం వరకు ఆయన ప్రచారంలో ముమ్మరంగానే తిరుగుతున్నారు.
This post was last modified on March 1, 2024 8:01 am
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…