Political News

3 రాజధానుల పై జగన్ కు లైన్ క్లియర్

ఏపీలో రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, దీనికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం గతంలోనే కేంద్రం హోం శాఖ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని హైకోర్టుకు కేంద్ర హోం శాఖ రెండు సార్లు సమర్పించిన అఫిడవిట్ లలో స్పష్టం చేసింది. అయితే, విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని ఉండాలని, మూడు రాజధానులు కాదని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఏపీ రాజధాని అంశంపై కేంద్ర హోం శాఖ మరింత స్పష్టతనిచ్చింది. ఏపీలో రాజధాని, విభజన చట్టంలో రాజధాని అంశం గురించి క్లారిటీ ఇస్తూ కేంద్రం హోం శాఖ మూడోసారి హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది.

ఏపీలో 3 రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ మరోసారి స్పందించింది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం ఉండబోదని, 3 రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని, రాజధాని పై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని మరోమారు స్పష్టం చేసింది. 3 రాజధానులు ఉండాలన్న రాష్ట్ర నిర్ణయంలో కేంద్రం తలదూర్చదని తేల్చి చెప్పింది.

3 రాజధానుల అంశంలో కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి కేవలం అపోహలేనని హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. ఏపీ రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే కేంద్రం చెప్పిందని స్పష్టం చేసింది. తాజాగా మూడోసారి కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడంతో మూడు రాజధానులపై కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదన్న వషయం మరోసారి స్పష్టమైంది.

This post was last modified on September 10, 2020 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 minutes ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

3 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

3 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago