Political News

నారా లోకేష్ ఎందుకు రాలేదు?

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖరారై సీట్ల పంపిణీలో కూడా ఒక అవగాహనకు వచ్చాక కొన్ని రోజుల కిందటే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఉమ్మడి ప్రెస్ మీట్‌తోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లయింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం ‘జెండా’ పేరుతో తొలి ఉమ్మడి బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం యువనేత, నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాకపోవడం చర్చనీయాంశం అయింది.

బాలయ్య కూడా హాజరైన ఈ సభకు లోకేష్ ఎందుకు రాలేదన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. సీట్ల పంపిణీ విషయమై జనసైనికుల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సభ ద్వారా సానుకూల సందేశం ఇవ్వడం.. జనసేనను, పవన్ కళ్యాణ్‌కు హైలైట్ చేసి జనసైనికులను శాంతింపజేయడమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేశారని.. అందుకే నారా లోకేష్‌ ఈ సభను అవాయిడ్ చేశాడని స్పష్టమవుతోంది.

యువగళం ముగింపు సభకు పవన్ హాజరైనపుడు అది లోకేష్ కార్యక్రమం కాబట్టి తాను ఎక్కువగా మాట్లాడకుండా టీడీపీ యువనేతనే హైలైట్ అయ్యేలా చేశారు. ‘జెండా’ సభ విషయానికి వస్తే దానికి తాను హాజరై టీడీపీ వాళ్లు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుండదని భావించి.. అందులో పవనే ప్రధాన ఆకర్షణ కావాలని లోకేష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి జెండా సభ ‘జనసేన’కు సొంతం. ఆ పార్టీకి, అధినేతకు, కార్యకర్తలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని.. వారిని గౌరవిస్తామని చెప్పడానికే ఈ సభను టీడీపీ ఏర్పాటు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభకు ఏర్పాట్లు పూర్తిగా తెదేపానే చేసింది. సభలో పూర్తిగా పవనే హైలైట్ అయ్యేలా చూసింది.

వాస్తవంగా పార్టీల స్థాయి, అనుభవం దృష్ట్యా ఈ సభలో చివరగా మాట్లాడాల్సింది చంద్రబాబు. కానీ ఆయన ఒక స్టెప్ వెనక్కి వెళ్లి ముందే ప్రసంగం పూర్తి చేశారు. పవన్‌కు చివరగా అవకాశమిచ్చారు. అంటే ఈ సభలో ముఖ్య ప్రసంగీకుడిగా పవన్‌ను ముందు నిలబెట్టారు. ఇది చంద్రబాబు హుందాతనానికి నిదర్శనం. జనసేనానిని గౌరవించిన తీరు.. జనసైనికులకు ఎంతో ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా పవన్ కూడా సీట్ల పంపిణీ విషయంలో తనను ప్రశ్నిస్తున్న, విమర్శిస్తున్న వారికి సూటిగా చెప్పాల్సింది చెప్పేశారు. ఈ సభ జనసైనికుల్లో కచ్చితంగా మార్పు తీసుకొస్తుందని.. ఇక టీడీపీతో కలిసి పని చేయడానికి వాళ్లు సిద్ధంగా ఉంటారని భావిస్తున్నారు.

This post was last modified on February 29, 2024 7:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago