Political News

ప‌వ‌న్ కంఠ శోష‌.. అర్ధం కావ‌డం లేదా?

కాపులు ఐక్యంగా ఉండాలి.. కాపు నేత‌లు క‌లిసి రావాలి.. అప్పుడే వైసీపీని గ‌ద్దెదించ‌గలం అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. పిల్ల పుట్ట‌గానే ప‌రుగులు పెట్ట‌ద‌న్న‌ట్టుగా.. జ‌న‌సేన కూడా.. ప‌రుగులు పెట్టేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభ‌వాల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటే ఈ విష‌యం అవ‌గ‌తం అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. “బలం ఉందో లేదో చూసుకోకుండా.. ఎగిరితే మ‌న‌మే న‌ష్ట‌పోతాం” అని చెప్పుకొచ్చారు.

అదేస‌మ‌యంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక స్థానంలో విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని.. అలా కాకుండా.. 10 చోట్ల అయినా విజ‌యం ద‌క్కించుకుని ఉంటే వేరే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కూడా ప‌వ‌న్ చాటు తున్నారు. మ‌రీ ముఖ్యంగా రెండు చోట్ల తాను పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలిపించుకోలేక పోయార‌ని కూడా వ్యాక్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎగిరే బ‌దులు.. క‌లిసి న‌డిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలిపారు. దీనికి అంద‌రూ క‌లిసిరావాల‌ని అంటున్నారు.

త‌ద్వారా పార్టీ పుంజుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మీ క‌ల‌లు ఫలించే అవ‌కాశం ఉంద‌ని కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. దీనివెనుక వ్యూహం స్ప‌స్టంగా ఉంది. ‘ఒంటె మంత్రం’ ప‌ఠిస్తున్నార‌న్న వినికిడి కూడా ఉంది. ముందు మెల్ల‌మెల్ల‌గా గుడారంలోకి అడుగు పెట్టిన ఒంటె.. త‌ర్వాత‌.. ఏం చేసిందో అంద‌ర‌కి తెలిసిందే అలాగే ముందుకు 24 నుంచి ప్రారంభించి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రిన్ని సీట్ల దిశ‌గా పార్టీని న‌డిపించే వ్యూహంలో అధికారాన్ని పంచుకునే ఉద్దేశంతో ప‌వన్ ఉన్నార‌నేది తెలుస్తోంది.

కానీ, ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కొంద‌రు ప్ర‌బుద్ధులు.. ఎవ‌రి ప్రోత్సాహంతోనో.. లేఖ‌లు సంధించ‌డం.. కాపుల్లో ఉన్న ఐక్య‌త‌ను దునుమాడ‌డం.. ప‌వ‌న్‌ను ఒంట‌రిని చేయ‌డం.. వారి ఓటు బ్యాంకును ఒక అనిశ్చితిలోకి నెట్ట‌డం అనే క్ర‌తువును భుజాన వేసుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడూ పిడి వాదం ప‌నికిరాదు.ప‌ట్టువిడుపులు అత్యంత ముఖ్యం. ఈ దిశ‌గానే ప‌వ‌న్ వేస్తున్న అడుగులకు క‌లిసి వ‌స్తే.. కాపుల‌కు మేళ్లు క‌నుచూపు మేర‌లోనే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు.

This post was last modified on February 29, 2024 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

6 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

7 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

8 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

10 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

10 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

10 hours ago