కాపులు ఐక్యంగా ఉండాలి.. కాపు నేతలు కలిసి రావాలి.. అప్పుడే వైసీపీని గద్దెదించగలం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. పిల్ల పుట్టగానే పరుగులు పెట్టదన్నట్టుగా.. జనసేన కూడా.. పరుగులు పెట్టేందుకు సమయం పడుతుందని.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను పరిశీలనలోకి తీసుకుంటే ఈ విషయం అవగతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. “బలం ఉందో లేదో చూసుకోకుండా.. ఎగిరితే మనమే నష్టపోతాం” అని చెప్పుకొచ్చారు.
అదేసమయంలో గత 2019 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానంలో విజయం దక్కించుకున్నామని.. అలా కాకుండా.. 10 చోట్ల అయినా విజయం దక్కించుకుని ఉంటే వేరే పరిస్థితి ఉండదని కూడా పవన్ చాటు తున్నారు. మరీ ముఖ్యంగా రెండు చోట్ల తాను పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలిపించుకోలేక పోయారని కూడా వ్యాక్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎగిరే బదులు.. కలిసి నడిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. దీనికి అందరూ కలిసిరావాలని అంటున్నారు.
తద్వారా పార్టీ పుంజుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి మీ కలలు ఫలించే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. దీనివెనుక వ్యూహం స్పస్టంగా ఉంది. ‘ఒంటె మంత్రం’ పఠిస్తున్నారన్న వినికిడి కూడా ఉంది. ముందు మెల్లమెల్లగా గుడారంలోకి అడుగు పెట్టిన ఒంటె.. తర్వాత.. ఏం చేసిందో అందరకి తెలిసిందే అలాగే ముందుకు 24 నుంచి ప్రారంభించి.. వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని సీట్ల దిశగా పార్టీని నడిపించే వ్యూహంలో అధికారాన్ని పంచుకునే ఉద్దేశంతో పవన్ ఉన్నారనేది తెలుస్తోంది.
కానీ, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోని కొందరు ప్రబుద్ధులు.. ఎవరి ప్రోత్సాహంతోనో.. లేఖలు సంధించడం.. కాపుల్లో ఉన్న ఐక్యతను దునుమాడడం.. పవన్ను ఒంటరిని చేయడం.. వారి ఓటు బ్యాంకును ఒక అనిశ్చితిలోకి నెట్టడం అనే క్రతువును భుజాన వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడూ పిడి వాదం పనికిరాదు.పట్టువిడుపులు అత్యంత ముఖ్యం. ఈ దిశగానే పవన్ వేస్తున్న అడుగులకు కలిసి వస్తే.. కాపులకు మేళ్లు కనుచూపు మేరలోనే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 29, 2024 7:23 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…