Political News

ప‌వ‌న్ కంఠ శోష‌.. అర్ధం కావ‌డం లేదా?

కాపులు ఐక్యంగా ఉండాలి.. కాపు నేత‌లు క‌లిసి రావాలి.. అప్పుడే వైసీపీని గ‌ద్దెదించ‌గలం అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అంతేకాదు.. పిల్ల పుట్ట‌గానే ప‌రుగులు పెట్ట‌ద‌న్న‌ట్టుగా.. జ‌న‌సేన కూడా.. ప‌రుగులు పెట్టేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభ‌వాల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటే ఈ విష‌యం అవ‌గ‌తం అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. “బలం ఉందో లేదో చూసుకోకుండా.. ఎగిరితే మ‌న‌మే న‌ష్ట‌పోతాం” అని చెప్పుకొచ్చారు.

అదేస‌మ‌యంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక స్థానంలో విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని.. అలా కాకుండా.. 10 చోట్ల అయినా విజ‌యం ద‌క్కించుకుని ఉంటే వేరే ప‌రిస్థితి ఉండ‌ద‌ని కూడా ప‌వ‌న్ చాటు తున్నారు. మ‌రీ ముఖ్యంగా రెండు చోట్ల తాను పోటీ చేస్తే.. ఒక్క చోట కూడా గెలిపించుకోలేక పోయార‌ని కూడా వ్యాక్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎగిరే బ‌దులు.. క‌లిసి న‌డిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు తెలిపారు. దీనికి అంద‌రూ క‌లిసిరావాల‌ని అంటున్నారు.

త‌ద్వారా పార్టీ పుంజుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మీ క‌ల‌లు ఫలించే అవ‌కాశం ఉంద‌ని కూడా వ్యాఖ్యా నిస్తున్నారు. దీనివెనుక వ్యూహం స్ప‌స్టంగా ఉంది. ‘ఒంటె మంత్రం’ ప‌ఠిస్తున్నార‌న్న వినికిడి కూడా ఉంది. ముందు మెల్ల‌మెల్ల‌గా గుడారంలోకి అడుగు పెట్టిన ఒంటె.. త‌ర్వాత‌.. ఏం చేసిందో అంద‌ర‌కి తెలిసిందే అలాగే ముందుకు 24 నుంచి ప్రారంభించి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రిన్ని సీట్ల దిశ‌గా పార్టీని న‌డిపించే వ్యూహంలో అధికారాన్ని పంచుకునే ఉద్దేశంతో ప‌వన్ ఉన్నార‌నేది తెలుస్తోంది.

కానీ, ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కొంద‌రు ప్ర‌బుద్ధులు.. ఎవ‌రి ప్రోత్సాహంతోనో.. లేఖ‌లు సంధించ‌డం.. కాపుల్లో ఉన్న ఐక్య‌త‌ను దునుమాడ‌డం.. ప‌వ‌న్‌ను ఒంట‌రిని చేయ‌డం.. వారి ఓటు బ్యాంకును ఒక అనిశ్చితిలోకి నెట్ట‌డం అనే క్ర‌తువును భుజాన వేసుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రాజ‌కీయాల్లో ఎప్పుడూ పిడి వాదం ప‌నికిరాదు.ప‌ట్టువిడుపులు అత్యంత ముఖ్యం. ఈ దిశ‌గానే ప‌వ‌న్ వేస్తున్న అడుగులకు క‌లిసి వ‌స్తే.. కాపుల‌కు మేళ్లు క‌నుచూపు మేర‌లోనే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీలకులు.

This post was last modified on February 29, 2024 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

2 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

3 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

4 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

4 hours ago