Political News

ఇంతియాజ్ ఎంట్రీ.. క‌ర్నూలు అసెంబ్లీ నుంచే పోటీ!

రాజ‌కీయాల్లో నాయ‌కులు అనుకుంటే కానిదేముంది? ముఖ్యంగా అధినేత‌లు త‌లుచుకుంటే జ‌ర‌గ‌నిది ఏముంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి ప‌రిణామ‌మే జ‌రిగింది. బుధ‌వారం ఉద‌యం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. సాయంత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం.. సీనియ‌ర్ ఐఏఎస్ ఇంతియాజ్ విష‌యంలో చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అంతేకాదు.. ఆయ‌న గురువారం ఉద‌యం సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. ఆయ‌న ఆశీర్వాదంతో వైసీపీలోకి చేరిపోవ‌డం కూడా అయిపోయాయి.

తాజాగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌.. వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌తోపాటు.. ఆయ‌న సోద‌రుడు కూడా పార్టీలోకి చేరిపోయారు. ఇక‌, కొద్ది మంది బంధువులు కూడా పార్టీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. క‌ర్నూలు అసెంబ్లీ సీటును వైసీపీ ఈయ‌న‌కు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో ఇంతియాజ్ ను తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వైసీపీ చేసిన ఈ ప్ర‌యోగం కొత్త‌కాదు. మైనారిటీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గ‌త 2019 ఎన్నిక‌ల వేళ కూడా.. ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేశారు. హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మైనారిటీ నాయ‌కుడు, అప్ప‌టి ఐఆర్ ఎస్ అధికారి.. మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌ను ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న అదే తొలిసారి వైసీపీలోకి వ‌చ్చారు. వ‌చ్చీరావడంతోనే స్థానికుల‌ను కాద‌ని.. ఈయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు.

అయితే.. హిందూపురంలో బాల‌య్య ముందు ఈయ‌న నిల‌బ‌డ‌లేక పోయారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ.. స్థానిక స్థితిగ‌తులు పార్టీ నేత‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. చేసిన ఆ ప్ర‌య‌త్నం.. విఫల‌మైంది. ఇక‌, ఇప్పుడు క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌ర‌వ్గంలోనూ జ‌గ‌న్ ప్ర‌యోగం చేస్తున్నారు. మ‌రి ఏమేర‌కు ఫలిస్తుందో చూడాలి. ఇక్క‌డ నుంచి పోటీకి చాలా మంది ఉన్నా.. వారిని ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 29, 2024 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

40 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago