Political News

ఇంతియాజ్ ఎంట్రీ.. క‌ర్నూలు అసెంబ్లీ నుంచే పోటీ!

రాజ‌కీయాల్లో నాయ‌కులు అనుకుంటే కానిదేముంది? ముఖ్యంగా అధినేత‌లు త‌లుచుకుంటే జ‌ర‌గ‌నిది ఏముంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి ప‌రిణామ‌మే జ‌రిగింది. బుధ‌వారం ఉద‌యం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. సాయంత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం.. సీనియ‌ర్ ఐఏఎస్ ఇంతియాజ్ విష‌యంలో చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అంతేకాదు.. ఆయ‌న గురువారం ఉద‌యం సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకోవ‌డం.. ఆయ‌న ఆశీర్వాదంతో వైసీపీలోకి చేరిపోవ‌డం కూడా అయిపోయాయి.

తాజాగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌.. వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఆయ‌న‌తోపాటు.. ఆయ‌న సోద‌రుడు కూడా పార్టీలోకి చేరిపోయారు. ఇక‌, కొద్ది మంది బంధువులు కూడా పార్టీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. క‌ర్నూలు అసెంబ్లీ సీటును వైసీపీ ఈయ‌న‌కు ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో ఇంతియాజ్ ను తీసుకురావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వైసీపీ చేసిన ఈ ప్ర‌యోగం కొత్త‌కాదు. మైనారిటీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. గ‌త 2019 ఎన్నిక‌ల వేళ కూడా.. ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేశారు. హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మైనారిటీ నాయ‌కుడు, అప్ప‌టి ఐఆర్ ఎస్ అధికారి.. మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్‌ను ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న అదే తొలిసారి వైసీపీలోకి వ‌చ్చారు. వ‌చ్చీరావడంతోనే స్థానికుల‌ను కాద‌ని.. ఈయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు.

అయితే.. హిందూపురంలో బాల‌య్య ముందు ఈయ‌న నిల‌బ‌డ‌లేక పోయారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ.. స్థానిక స్థితిగ‌తులు పార్టీ నేత‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. చేసిన ఆ ప్ర‌య‌త్నం.. విఫల‌మైంది. ఇక‌, ఇప్పుడు క‌ర్నూలు అసెంబ్లీ నియోజ‌క‌ర‌వ్గంలోనూ జ‌గ‌న్ ప్ర‌యోగం చేస్తున్నారు. మ‌రి ఏమేర‌కు ఫలిస్తుందో చూడాలి. ఇక్క‌డ నుంచి పోటీకి చాలా మంది ఉన్నా.. వారిని ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 29, 2024 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఈసారి ఉగాది పండగా మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

1 hour ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

4 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

5 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

6 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

7 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

8 hours ago