రాజకీయాల్లో నాయకులు అనుకుంటే కానిదేముంది? ముఖ్యంగా అధినేతలు తలుచుకుంటే జరగనిది ఏముంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రానికి గ్రీన్ సిగ్నల్ రావడం.. సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ విషయంలో చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. ఆయన గురువారం ఉదయం సీఎం జగన్ను కలుసుకోవడం.. ఆయన ఆశీర్వాదంతో వైసీపీలోకి చేరిపోవడం కూడా అయిపోయాయి.
తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్.. వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఆయనతోపాటు.. ఆయన సోదరుడు కూడా పార్టీలోకి చేరిపోయారు. ఇక, కొద్ది మంది బంధువులు కూడా పార్టీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. కర్నూలు అసెంబ్లీ సీటును వైసీపీ ఈయనకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో ఇంతియాజ్ ను తీసుకురావడం గమనార్హం.
అయితే.. వైసీపీ చేసిన ఈ ప్రయోగం కొత్తకాదు. మైనారిటీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్.. గత 2019 ఎన్నికల వేళ కూడా.. ఇలాంటి ప్రయత్నాలు చేశారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మైనారిటీ నాయకుడు, అప్పటి ఐఆర్ ఎస్ అధికారి.. మహమ్మద్ ఇక్బాల్ను పరిచయం చేశారు. ఆయన అదే తొలిసారి వైసీపీలోకి వచ్చారు. వచ్చీరావడంతోనే స్థానికులను కాదని.. ఈయనకు అవకాశం ఇచ్చారు.
అయితే.. హిందూపురంలో బాలయ్య ముందు ఈయన నిలబడలేక పోయారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. స్థానిక స్థితిగతులు పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. చేసిన ఆ ప్రయత్నం.. విఫలమైంది. ఇక, ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ నియోజకరవ్గంలోనూ జగన్ ప్రయోగం చేస్తున్నారు. మరి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. ఇక్కడ నుంచి పోటీకి చాలా మంది ఉన్నా.. వారిని పక్కన పెట్టడం గమనార్హం.
This post was last modified on February 29, 2024 3:54 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…