Political News

సెంటిమెంటునే ఫాలో అవుతున్నారా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సెంటిమెంటునే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఎలాగంటే మార్చి 10వ తేదీన కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా. కేసీయార్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తునే ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే కేసీయార్ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ నుండే ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అయినా సరే ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ లేదా కరీంనగర్ నుండే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. మొన్నటి నల్గొండ బహిరంగసభ జస్ట్ శాంపుల్ మాత్రమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోల ఓడిపోయిన రెండురోజే కేసీయార్ బాత్ రూంలో పడటంతో తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆరువారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు.

డాక్టర్లు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకున్న కేసీయార్ ట్రయల్లాగ నల్గొండ సభలో పాల్గొన్నారట. అందుకే బహిరంగసభకు కేసీయార్ వీల్ ఛైర్లోనే హాజరయ్యారు. అసలు కేసీయార్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఇకనుండి కేసీయార్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారని. అందుకనే పార్టీ వేదికల మీద కూడా పెద్దగా కనబడటంలేదు. రేపు మార్చి 1వ తేదీన ఛలో మేడిగడ్డ కార్యక్రమంలో కూడా కేసీయార్ పాల్గొనటంలేదు.

పార్టీ తరపున చేస్తున్న పర్యటనల్లో కూడా కేటీయార్, హరీష్ ఎక్కడా పొరబాటున కూడా కేసీయార్ ప్రస్తావన తేవటంలేదు. చాలాకాలం తర్వాత ఫాంహౌజ్ లో కేటీయార్, హరీష్, కవితతో కేసీయార్ చాలాసేపు భేటీ అయినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మేడిగడ్డ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడినపుడు కూడా కేటీయార్ ఎక్కడా కేసీయార్ ప్రస్తావన తేలేదు. అందుకనే కేసీయార్ పూర్తిగా రెస్టులోకి వెళిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత రెస్టు తీసుకునే అవకాశముందట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 29, 2024 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

1 hour ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

1 hour ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

5 hours ago