Political News

సెంటిమెంటునే ఫాలో అవుతున్నారా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సెంటిమెంటునే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఎలాగంటే మార్చి 10వ తేదీన కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా. కేసీయార్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తునే ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే కేసీయార్ ఎన్నికల శంకారావాన్ని పూరిస్తారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ నుండే ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అయినా సరే ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల బహిరంగసభలను కూడా హుస్నాబాద్ లేదా కరీంనగర్ నుండే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. మొన్నటి నల్గొండ బహిరంగసభ జస్ట్ శాంపుల్ మాత్రమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోల ఓడిపోయిన రెండురోజే కేసీయార్ బాత్ రూంలో పడటంతో తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఆరువారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు.

డాక్టర్లు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకున్న కేసీయార్ ట్రయల్లాగ నల్గొండ సభలో పాల్గొన్నారట. అందుకే బహిరంగసభకు కేసీయార్ వీల్ ఛైర్లోనే హాజరయ్యారు. అసలు కేసీయార్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఇకనుండి కేసీయార్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటారని. అందుకనే పార్టీ వేదికల మీద కూడా పెద్దగా కనబడటంలేదు. రేపు మార్చి 1వ తేదీన ఛలో మేడిగడ్డ కార్యక్రమంలో కూడా కేసీయార్ పాల్గొనటంలేదు.

పార్టీ తరపున చేస్తున్న పర్యటనల్లో కూడా కేటీయార్, హరీష్ ఎక్కడా పొరబాటున కూడా కేసీయార్ ప్రస్తావన తేవటంలేదు. చాలాకాలం తర్వాత ఫాంహౌజ్ లో కేటీయార్, హరీష్, కవితతో కేసీయార్ చాలాసేపు భేటీ అయినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. మేడిగడ్డ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడినపుడు కూడా కేటీయార్ ఎక్కడా కేసీయార్ ప్రస్తావన తేలేదు. అందుకనే కేసీయార్ పూర్తిగా రెస్టులోకి వెళిపోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత రెస్టు తీసుకునే అవకాశముందట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

This post was last modified on February 29, 2024 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago