Political News

భారమంతా చంద్రబాబుదేనా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. వీటిల్లో నాలుగు స్ధానాల్లో అసమ్మతి అట్టుడికిపోతోంది. అసమ్మతి నేతలతో మాట్లాడటం, బుజ్జగించటం, దారికి తెచ్చుకోవటం అభ్యర్ధుల వల్లే అయ్యేట్లు లేదు. అందుకనే అసమ్మతి నేతలతో మాట్లాడి దారికితెచ్చే బాధ్యతలు నలుగురు అభ్యర్థులు చంద్రబాబుపైనే పెట్టేశారు. విషయం ఏమిటంటే కల్యాణదుర్గం, శింగనమల, మడకశిర, పెనుకొండలో అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యతిరేక వర్గాలు రెచ్చిపోతున్నాయి. దాంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

పెనుకొండలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ బీకే పార్ధసారధిని కాదని సవితకు టికెట్ ఇచ్చారు. దీన్ని జీర్ణించుకోలేని బీకే వర్గీయులు పార్టీ ఆఫీసుమీద దాడిచేసి ధ్వంసంచేశారు. పార్టీ ఆఫీసులోని కటౌట్లను, బ్యానర్లు, జెండాలను తగలబెట్టేశారు. పార్టీ ఆఫీసుకు తాళాలు కూడా వేసేశారు. సవిత పార్ధసరాధితో మాట్లాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక శింగనమలలో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వటాన్ని ఆమె వ్యతిరేకులు తట్టుకోలేకపోతున్నారు. జిల్లా కార్యాలయంపై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. పోయిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన శ్రావణికి మళ్ళీ టికెట్ ఇస్తే సానుభూతి ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన.

కల్యాణదుర్గంలో కన్ స్ట్రక్షన్ కంపెనీ అధినేత సురేంద్రబాబుకు టికెట్ కేటాయించారు. ఈయన పార్టీలో కొత్త కాకపోతే ఆర్ధికంగా స్తితిమంతుడు. ఇప్పటికే మాజీ ఎంఎల్ఏ ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వరనాయుడు టికెట్ కోసం పోటీపడుతున్నారు. పోయిన ఎన్నికల్లో ఇలాగే పోటీపడినా ఉమాకే టికెట్ దక్కింది. దాంతో ఉన్నం సహకరించకపోవటంతో ఉమ ఓడిపోయారు. ఇపుడు కూడా అలాగే గొడవలవుతాయనే మధ్యేమార్గంగా చంద్రబాబు కొత్త అభ్యర్ధికి టికెట్ ఇచ్చారు.

తామిద్దరినీ కాదని చంద్రబాబు కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వటంతో అభ్యర్ధికి వ్యతిరేకంగా రెండు వ్యతిరేక గ్రూపులు ఏకమయ్యాయి. ఇక మడకశిరలో మాజీ ఎంఎల్ఏ ఈరన్న, తిప్పేస్వామి టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఈరన్న కొడుకు సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించారు. దాంతో తిప్పేస్వామి మద్దతుదారులు మండిపోతున్నారు. టికెట్ వచ్చింది కాబట్టి మద్దతు కోరేందుకు ఈరన్న, సునీల్ తిప్పేస్వామి ఇంటికి వెళ్ళినపుడు మద్దతుదారులు చెప్పులతో దాడిచేసి తరిమేశారట. దాంతో పై నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను బుజ్జగించే బాధ్యతలను అభ్యర్ధులు చంద్రబాబు మీదే పెట్టేశారట. మరి చంద్రబాబు వీళ్ళతో ఎప్పుడు మాట్లాడుతారో వీళ్ళెపుడు దారికివస్తారో చూడాలి.

This post was last modified on February 29, 2024 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

43 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago