Political News

‘ఇబ్బందులు ప‌డుతున్నా.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా’

“అవ‌స‌ర‌మైతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటా. ఇప్ప‌టికే అన్ని విధాలా స‌ర్దుకుని రాజ‌కీయాల్లో ఉన్నా. పైగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు న‌న్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఒంగోలు పేద ప్ర‌జ‌ల కోసం ఇళ్ల ప‌ట్టాలను ఇవ్వాల‌ని అడిగాన‌ని.. ఇది త‌న స్వార్థం కోసం కాద‌ని బాలినేని చెప్పారు. అయితే.. ఇదేదో త‌న ఇంట్లో కార్య‌క్ర‌మం మాదిరిగా కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నార‌ని.. పార్టీకి చెడు సంకేతాలు ఇచ్చార‌ని బాలినేని విమ‌ర్శించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన బాలినేని.. సీఎం జ‌గ‌న్‌పైనా ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. “నేను సీఎం జగన్‌ని ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారు” అని వ్యాఖ్యానించారు. తాను అలిగింది ప్రజల కోసమేన‌ని చెప్పారు. అది కూడా గూడు లేని ప్ర‌జ‌ల కోస‌మేనని, రాష్ట్ర వ్యాప్తంగా 33 ల‌క్ష‌ల మందికి ఇళ్లు ఇచ్చిన మ‌న పార్టీ.. కేవ‌లం 25 వేల మందికి ఇళ్లు ఇవ్వ‌లేక‌పోతే.. న‌గుబాటు త‌ప్ప‌ద‌ని అలిగాన‌ని చెప్పారు. “ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలోని 25 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నా. దీనిని సీఎం స‌హా అంద‌రూ త‌ప్పుబ‌ట్టారు. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం ఇంటెలిజెన్స్ అధికారులతో అంటున్నారు” అని బాలినేని చెప్పారు.

ప్రజల్లో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు వ‌స్తాయ‌ని బాలినేని వ్యాఖ్యానించారు. సీఎం దగ్గర అందరిలాగా తాను డబ్బాలు కొట్టన‌ని, క‌నీసం పొగిడే ప్ర‌య‌త్నం కూడా చేయ‌న‌ని చెప్పారు. అయితే.. ఇలా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలానే కోల్పోయాన‌ని.. అయినా ఇది ఇష్ట‌మేన‌ని.. అయిన వారికి ఏమీ చేయ‌లేక పోయాన‌ని.. ప‌రోక్షంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇప్పించుకోలేక పోయిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. టికెట్ ఇవ్వ‌నందునే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం టీడీపీలోకి వెళ్తోంద‌ని చెప్పారు. ఇది ఎఫెక్ట్ చూపిస్తందుని బాలినేని వ్యాఖ్యానించారు.

నేను వెళ్ల‌ను!

మాగుంట‌కు టికెట్ ఇవ్వాలని ప‌ట్టుబ‌ట్టిన మాట వాస్త‌వ‌మేన‌ని బాలినేని చెప్పారు. అయితే, ఆయ‌న‌కు ఇవ్వలేద‌ని.. దీంతో ఆయ‌న త‌న దారి తాను చూసుకున్నార‌ని.. ఇప్పుడు తాను కూడా టీడీపీలోకి వెళ్తాన‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. అలా ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌ని.. అవ‌స‌ర‌మైతే.. రాజకీయాల‌నుంచి త‌ప్పుకొంటాన‌ని బాలినేని చెప్పారు. త‌న మ‌న‌సుకు న‌చ్చే పార్టీలో ఉంటున్నాన‌ని..పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం త‌న‌ది కాద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌లే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని.. ఆపై తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని బాలినేని చెప్పారు.

This post was last modified on February 28, 2024 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago