మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో ధరణి పోర్టల్ వివాదం కూడా ఒకటి. ఈ పోర్టల్ నిర్వహణలో లక్షలాదిమంది భూయజమానులు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పుకున్నా ఎలాంటి ఉపయోగంలేకపోయింది. దాంతో కేసీయార్ మీద యజమానాల్లో మంట పెరిగిపోయింది. యజమనాలను దగ్గరున్న భూవివరాలు వేరు పోర్టల్లోని వివరాలు వేరుగా ఉండేది. యజమానుల దగ్గరున్న పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలను కాదని అధికార యంత్రాంగం పోర్టల్లోని వివరాలే కరెక్టని తేల్చేశాయి. దాంతో భూవిస్తీర్ణంలో చాలా తేడాలొచ్చేశాయి.
విచిత్రం ఏమిటంటే పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలు కూడా ఒకపుడు ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించినవే. తమ భూములను కాజేసేందుకు ప్రభుత్వం ధరణిపోర్టల్ ను అడ్డుపెట్టుకుందని భూయజమనాలు నిర్ధారణకొచ్చారు. దాంతో ఆందోళనలకు దిగారు. యజమానులు ఎన్ని ఆందోళనలు చేసిన యంత్రాంగం మాత్రం పోర్టల్లోని వివరాలే కరెక్టనే వాళ్ళు. దాంతో కేసీయార్ ప్రభుత్వం మీద లక్షలమంది యజమానులకు మండిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి పోర్టల్ పై వస్తున్న ఆరోపణలపై లోతుగా విచారణ చేయిస్తున్నారు.
దీంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి. పోర్టల్ నిర్వహణ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా టెర్రాసిస్ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో ఉండేదట. టెర్రాసిస్ కంపెనీ కూడా అమెరికా నుండి పోర్టల్ ను నిర్వహిస్తోందట. అంటే తెలంగాణాలోని భూవివరాలు అమెరికా కంపెనీ గుప్పిట్లో ఉన్నట్లు తేలింది. అనేక కంపెనీలు చేతులు మారి టెర్రాసిస్ తో కాంట్రాక్టు గడువు ముగిసినా ఇంకా అదే కంపెనీ నిర్వహణలో పోర్టల్ నడుస్తుండటమే ఆశ్చర్యంగా ఉందని మంత్రులే కామెంట్ చేస్తున్నారు.
ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా వట్టినాగులపల్లి, కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, గండిపేట, హైటెక్ సిటి ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువచేసి వేలాది ఎకరాలు పోర్టల్ ద్వారా చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారట. టెర్రాసిస్ కంపెనీని ఫాల్కన్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీ కొనేసిందట. తర్వాత ఫాల్కన్ కంపెనీ షేర్లను నూరుశాతం క్వాంటెలా కొనేసిందట. ప్రభుత్వంతో సంబంధంలేకుండానే ధరణి పోర్టల్ ను నిర్వహిస్తున్న కంపెనీలు చేతులు మారిపోతున్నా కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. అందుకనే ధరణిపోర్టల్ పాపాలకు మూలకారుకులు ఎవరనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చబోతోంది.
This post was last modified on February 28, 2024 5:39 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…