Political News

ధరణి పాపం ఎవరిదో ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో ధరణి పోర్టల్ వివాదం కూడా ఒకటి. ఈ పోర్టల్ నిర్వహణలో లక్షలాదిమంది భూయజమానులు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పుకున్నా ఎలాంటి ఉపయోగంలేకపోయింది. దాంతో కేసీయార్ మీద యజమానాల్లో మంట పెరిగిపోయింది. యజమనాలను దగ్గరున్న భూవివరాలు వేరు పోర్టల్లోని వివరాలు వేరుగా ఉండేది. యజమానుల దగ్గరున్న పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలను కాదని అధికార యంత్రాంగం పోర్టల్లోని వివరాలే కరెక్టని తేల్చేశాయి. దాంతో భూవిస్తీర్ణంలో చాలా తేడాలొచ్చేశాయి.

విచిత్రం ఏమిటంటే పాస్ పుస్తకాలు, పత్రాల్లోని వివరాలు కూడా ఒకపుడు ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించినవే. తమ భూములను కాజేసేందుకు ప్రభుత్వం ధరణిపోర్టల్ ను అడ్డుపెట్టుకుందని భూయజమనాలు నిర్ధారణకొచ్చారు. దాంతో ఆందోళనలకు దిగారు. యజమానులు ఎన్ని ఆందోళనలు చేసిన యంత్రాంగం మాత్రం పోర్టల్లోని వివరాలే కరెక్టనే వాళ్ళు. దాంతో కేసీయార్ ప్రభుత్వం మీద లక్షలమంది యజమానులకు మండిపోయింది. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి పోర్టల్ పై వస్తున్న ఆరోపణలపై లోతుగా విచారణ చేయిస్తున్నారు.

దీంతో అసలు విషయాలు బయటపడుతున్నాయి. పోర్టల్ నిర్వహణ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా టెర్రాసిస్ అనే ప్రైవేటు కంపెనీ చేతిలో ఉండేదట. టెర్రాసిస్ కంపెనీ కూడా అమెరికా నుండి పోర్టల్ ను నిర్వహిస్తోందట. అంటే తెలంగాణాలోని భూవివరాలు అమెరికా కంపెనీ గుప్పిట్లో ఉన్నట్లు తేలింది. అనేక కంపెనీలు చేతులు మారి టెర్రాసిస్ తో కాంట్రాక్టు గడువు ముగిసినా ఇంకా అదే కంపెనీ నిర్వహణలో పోర్టల్ నడుస్తుండటమే ఆశ్చర్యంగా ఉందని మంత్రులే కామెంట్ చేస్తున్నారు.

ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యంగా వట్టినాగులపల్లి, కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, గండిపేట, హైటెక్ సిటి ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువచేసి వేలాది ఎకరాలు పోర్టల్ ద్వారా చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారట. టెర్రాసిస్ కంపెనీని ఫాల్కన్ ఇన్వెస్టిమెంట్స్ కంపెనీ కొనేసిందట. తర్వాత ఫాల్కన్ కంపెనీ షేర్లను నూరుశాతం క్వాంటెలా కొనేసిందట. ప్రభుత్వంతో సంబంధంలేకుండానే ధరణి పోర్టల్ ను నిర్వహిస్తున్న కంపెనీలు చేతులు మారిపోతున్నా కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. అందుకనే ధరణిపోర్టల్ పాపాలకు మూలకారుకులు ఎవరనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చబోతోంది.

This post was last modified on February 28, 2024 5:39 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

14 mins ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

1 hour ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

3 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

4 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

4 hours ago

తాడిప‌త్రిలో ఉండొద్దు.. జేసీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసిన పోలీసులు

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రిలో ఎన్నిక‌ల అనంత‌రం తీవ్ర హింస చెల‌రేగింది. ఇక్క‌డ పోటీలో ఉన్న జేసీ…

10 hours ago