Political News

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల‌కు ముందు హైకోర్టులో దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. వ‌రుసగా హైకో ర్టు స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. మంగ‌ళ‌వారం రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై కీల‌క తీ ర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. రైతులకు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేయడా నికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్‌. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన మైనింగ్‌పైనా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న ఇసుక‌ అక్రమ త‌వ్వ‌కాల‌పై హైకోర్టు క‌న్నెర్ర చేసింది. ఈ అక్ర‌మాల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని స‌ర్కారును ప్ర‌శ్నించింది. ఇసుక‌, మ‌ట్టి, ఇత‌ర ఖ‌నిజాల విష‌యంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై త‌మ‌కు వంద‌ల కొద్దీ పిటిష‌న్లు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించింది. ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని నిల‌దీసింది.

బెంచ్ పాయింట్ ఔట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే రెండు వారాల సమయం చాలదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని కోర్టు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే అధికారుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోక తప్ప‌ద‌ని వ్యాఖ్యానించింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వానికి చెంప పెట్టుగా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

2 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

5 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago