Political News

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల‌కు ముందు హైకోర్టులో దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. వ‌రుసగా హైకో ర్టు స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. మంగ‌ళ‌వారం రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై కీల‌క తీ ర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. రైతులకు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేయడా నికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్‌. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన మైనింగ్‌పైనా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న ఇసుక‌ అక్రమ త‌వ్వ‌కాల‌పై హైకోర్టు క‌న్నెర్ర చేసింది. ఈ అక్ర‌మాల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని స‌ర్కారును ప్ర‌శ్నించింది. ఇసుక‌, మ‌ట్టి, ఇత‌ర ఖ‌నిజాల విష‌యంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై త‌మ‌కు వంద‌ల కొద్దీ పిటిష‌న్లు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించింది. ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని నిల‌దీసింది.

బెంచ్ పాయింట్ ఔట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే రెండు వారాల సమయం చాలదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని కోర్టు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే అధికారుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోక తప్ప‌ద‌ని వ్యాఖ్యానించింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వానికి చెంప పెట్టుగా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 28, 2024 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్

తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…

5 minutes ago

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

1 hour ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

6 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

11 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

12 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

12 hours ago