Political News

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల‌కు ముందు హైకోర్టులో దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. వ‌రుసగా హైకో ర్టు స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. మంగ‌ళ‌వారం రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంపై కీల‌క తీ ర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. రైతులకు గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇచ్చిన ఫ్లాట్ల‌ను ర‌ద్దు చేయడా నికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి భారీ ఎఫెక్ట్‌. ఇక‌, ఇప్పుడు కీల‌క‌మైన మైనింగ్‌పైనా హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది.

గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న ఇసుక‌ అక్రమ త‌వ్వ‌కాల‌పై హైకోర్టు క‌న్నెర్ర చేసింది. ఈ అక్ర‌మాల‌పై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని స‌ర్కారును ప్ర‌శ్నించింది. ఇసుక‌, మ‌ట్టి, ఇత‌ర ఖ‌నిజాల విష‌యంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై త‌మ‌కు వంద‌ల కొద్దీ పిటిష‌న్లు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించింది. ఇంత జ‌రుగుతున్నా.. ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని నిల‌దీసింది.

బెంచ్ పాయింట్ ఔట్ చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని మైనింగ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే రెండు వారాల సమయం చాలదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీంతో ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని కోర్టు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదికలో తేడా ఉంటే అధికారుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోక తప్ప‌ద‌ని వ్యాఖ్యానించింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వానికి చెంప పెట్టుగా ఉన్నాయ‌ని ప్ర‌తిప‌క్షాలు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 28, 2024 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago