రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో రాహుల్ ను రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు కలిశారు. ఆ సమయంలో తెలంగాణా నుంచి పోటీచేయాలని ఆహ్వానించినట్లు సమాచారం. తెలంగాణాలోని ఖమ్మం, భువనగిరి లేదా నల్గొండలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమని రాహుల్ కు రేవంత్ అండ్ కో గ్యారంటీ ఇచ్చారట.
నిజానికి ఖమ్మం నుంచి సోనియాగాంధీని పోటీచేయాలని మొదట్లో రేవంత్ అండ్ కో పీసీసీ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేసి పంపారు. దాన్ని ఏఐసీసీ కీలక వ్యక్తులు పరిశీలించారు కూడా. అయితే సోనియా అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదని డిసైడ్ చేసుకున్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు సోనియా స్పష్టంచేశారు. పోటీ నుంచి తప్పుకుంటున్న కారణంగానే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అమేథి స్ధానంలో కూతురు ప్రియాంకను పోటీచేయిస్తున్నట్లు చెప్పారు.
సోనియా పోటీకి దూరమని తెలియగానే వెంటనే చాలామంది ప్రియాంక పేరును ప్రస్తావించారు. అయితే ప్రియాంక అమేథిలో పోటీ చేయబోతున్నారని తేలిపోయిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఇపుడు సడెన్ గా రాహుల్ పేరు ప్రస్తావన పెరిగిపోతోంది. ఎందుకంటే ఇపుడు రాహుల్ కేరళలోని వాయనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వాయనాడు నుండి రాబోయే ఎన్నికల్లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా భార్య పేరును ఆ పార్టీ ప్రకటించేసింది. అంటే వచ్చేఎన్నికల్లో వాయనాడు నుండి రాహుల్ పోటీ చేయడం లేదని తేలిపోయింది.
మరి అమేథిలో పోటీచేయక, వాయనాడులోనూ పోటీ చేయకపోతే రాహుల్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు ? అందుకనే తెలంగాణా నేతలు రాహుల్ ను తెలంగాణా నుండి పోటీ చేయమని ఆహ్వానిస్తున్నారు. పైన చెప్పిన మూడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుండి పోటీచేసినా గెలుపు ఖాయమని కూడా చెప్పారట. సోనియా కుటుంబంలో నుండి ఎవరో ఒకరిని పోటీచేయించాలన్నది తెలంగాణా కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉంది. మరి రాహుల్ స్పందన ఎలాగుంటుందో చూడాలి. పోటీ చేస్తే మాత్రం పార్టీకి మంచి ఊపు ఖాయమని పార్టీ అనుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 28, 2024 11:07 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…