Political News

బుజ్జ‌గింపు ప‌ర్వంలో బాబు బిజీబిజీ!!

టీడీపీ అధినేత‌కు టికెట్ల కేటాయింపు క‌న్నా.. బుజ్జ‌గింపులు పెద్ద చిక్కుగా మారాయి. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 94 స్థానాల్లో అభ్య‌ర్థులను ఒక‌వైపు లైన్‌లో పెడుతూనే.. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి.. భంగ ప‌డిన నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో రోజురోజంతా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు. తన నివాసంలో ఆశావహులను కలుస్తూ.. వారిని ఊర‌డిస్తున్నారు. తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు వ‌రుస పెట్టి బాబును క‌లుస్తున్నారు. దీంతో ఆయా నేతలను బుజ్జగించి, రాజకీయ భవిష్యత్తుకు చంద్ర‌బాబు హామీ ఇస్తున్నారు.

  • చంద్రబాబు నివాసానికి కడప పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ‌చ్చారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ సీటు ఆశిస్తున్న ఆయ‌న త‌న ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. భ‌విష్య‌త్తులో పార్టీ ప‌ద‌వి ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిసింది.
  • చంద్రబాబుతో తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ భేటీ అయ్యారు. వాస్త‌వానికి తంబళ్లపల్లి స్థానాన్ని జయచంద్రా రెడ్డికి కేటాయించారు. ఇక‌, ఇదే సీటు కోసం చంద్రబాబును కలిసి శంకర్ యాదవ్‌కే సీటు ఇవ్వాలని ప‌లువురు నేత‌లు కోరారు.
  • ఇక‌, రెండు రోజుల్లో వైసీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా చేయ‌నున్నారు. ఈయ‌న కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర‌నున్నారు. క‌ర్నూలు జిల్లా ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే చాన్స్ ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి నాయ‌కులు వ‌చ్చి.. ఆయ‌న‌కు ఇవ్వ‌ద్ద‌ని కోరుతున్నారు.
  • సీనియ‌ర్ నేత‌ కోవెలమూడి రవీంద్ర చంద్ర‌బాబును క‌లిశారు. గుంటూరు-2 స్థానానికి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రవీంద్ర వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల‌ని కోరారు. అయితే.. ఇంకా ప‌రిశీల‌న‌లో ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీంతో ఆయన ముభావంగా వెనుదిరిగారు. ఇక‌, తెనాలి టికెట్ ఆశించి భంగ‌ప‌డిన మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా మ‌రోసారి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు-2 టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరిన‌ట్టు స‌మాచారం.
  • ఉమ్మ‌డి అనంత‌పురంలోని శింగనమలకు బండారు శ్రావణిని ఇటీవ‌ల చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే, ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కేశవరెడ్డి, నర్సానాయుడు చంద్ర‌బాబును క‌లిసి.. శ్రావ‌ణిని మార్చాల‌ని డిమాండ్ చేశారు. అయితే.. చంద్ర‌బాబు వారి విన్న‌పాలు తిర‌స్క‌రించారు. శ్రావణి గెలుపునకు కృషి చేయాలని ఇద్దరికీ చంద్రబాబు ఆదేశించిన‌ట్టు తెలిసింది.
  • ఇక‌, క‌ర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలో జయనాగేశ్వరరెడ్డికి చోటు ద‌క్క‌లేదు. దీంతో త‌న‌కు టికెట్ ఎక్క‌డైనా ఒక చోట ఇవ్వాల‌ని కోరారు. కానీ, గ్రాఫ్ బాగోలేద‌ని ప్ర‌జల్లో ఉండాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

This post was last modified on February 28, 2024 12:20 pm

Share
Show comments

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

7 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago