Political News

‘అమ‌రావ‌తి’ విష‌యంలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ దూకుడుకు హైకోర్టు మ‌రోసారి ప‌గ్గాలు వేసింది. రాజ‌దాని కోసం.. 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన రైతుల‌కు.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ర‌ద్దు చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జీవోలు కూడా జారీ చేసింది. అయితే.. వీటిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో అమ‌రావ‌తి రైతులు మ‌రో విజ‌యం ద‌క్కించుకున్న ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

ఏపీ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఇక్క‌డ రైతులు 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చారు. ఈ రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇక్క‌డ తేడా జ‌రిగింద‌ని, అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. రాజ‌ధానిని మార్చే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రైతుల‌కు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ప్ర‌భుత్వం కూడా సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని కోర్టుకు తెలిపింది. అటు రైతులు, ఇటు ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదనలు విన్న కోర్టు.. దీనికి సంబంధించిన జీవోలు, నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.

ల్యాండ్ పూలింగ్ ద్వారా..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. కొందరు ఇవ్వడానికి విముఖత చూపారు. ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్‌పూలింగ్‌ భూముల్లో అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

రిజిస్ట్రేషన్‌ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి, అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైసీపీప ప్ర‌భుత్వాన్ని రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకుంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దుచేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని నోటీసులు ఇచ్చింది. దీనిపైనే తాజాగా స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌త‌గిలింది.

This post was last modified on February 27, 2024 11:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago