Political News

‘అమ‌రావ‌తి’ విష‌యంలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ దూకుడుకు హైకోర్టు మ‌రోసారి ప‌గ్గాలు వేసింది. రాజ‌దాని కోసం.. 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన రైతుల‌కు.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ర‌ద్దు చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జీవోలు కూడా జారీ చేసింది. అయితే.. వీటిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో అమ‌రావ‌తి రైతులు మ‌రో విజ‌యం ద‌క్కించుకున్న ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

ఏపీ రాజధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఇక్క‌డ రైతులు 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చారు. ఈ రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇక్క‌డ తేడా జ‌రిగింద‌ని, అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. రాజ‌ధానిని మార్చే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రైతుల‌కు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ 862 మంది రైతులకు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్లాట్ల రద్దు, సీఆర్‌డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమని నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ప్ర‌భుత్వం కూడా సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని కోర్టుకు తెలిపింది. అటు రైతులు, ఇటు ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాదనలు విన్న కోర్టు.. దీనికి సంబంధించిన జీవోలు, నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.

ల్యాండ్ పూలింగ్ ద్వారా..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు ఎందరో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. కొందరు ఇవ్వడానికి విముఖత చూపారు. ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ప్రతిఫలంగా సదరు రైతులకు నిర్ణయించిన ధర ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ల్యాండ్‌పూలింగ్‌ భూముల్లో అమరావతికి భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

రిజిస్ట్రేషన్‌ కాని ఆ స్థలాలను ఉపయోగించుకోవడానికి, అవసరాలకు అమ్ముకోవడానికి లేకుండా పోతోందంటూ, వాటిని మార్చి ఇవ్వాలని వైసీపీప ప్ర‌భుత్వాన్ని రైతులు సీఆర్డీఏ అధికారులను వేడుకుంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో స్పందించని రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ ఉన్నట్టుండి ఇప్పుడు సదరు ప్లాట్లు రద్దుచేసుకోవాలని, వేరేచోట ప్లాట్లు కేటాయిస్తామని నోటీసులు ఇచ్చింది. దీనిపైనే తాజాగా స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌త‌గిలింది.

This post was last modified on February 27, 2024 11:01 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మంత్రులు సైలెంట్‌.. అన్నింటికీ రేవంత్ కౌంట‌ర్‌

కాంగ్రెస్ హైక‌మాండ్ ఎంత చెప్పినా తెలంగాణ‌లోని ఆ పార్టీకి చెందిన కొంత‌మంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావ‌డం లేద‌ని తెలిసింది.…

23 mins ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఫ‌స్ట్ టైం మోడీ.. రాజీవ్ జ‌పం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది.…

2 hours ago

సినీ ప్రపంచం కళ్ళన్నీ కల్కి వేడుక మీదే

రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు…

3 hours ago

కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు ?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయ్యారు.…

4 hours ago

వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో…

4 hours ago

బొత్స ‘ముహూర్తం’ పెట్టారు.. వైవీ ‘స‌మ‌యం’ నిర్ణ‌యించారు!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాట‌లే కాదు.. ఆశ‌లు కూడా కోట‌లు దాటుతున్నాయి. ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్‌లో…

5 hours ago