ఏపీ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్కు టీడీపీ నాయకురాలు.. విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే.. నీ గుడ్డు పగిలిద్ది! అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దళిత సామాజిక వర్గానికి చెందిన తనపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై తాను కోర్టును ఆశ్రయిస్తానని అనిత చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తనపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనిత కోడి గుడ్లు పగలు కొట్టారు.
అసలేంటి వివాదం..
ఇటీవల కాలంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వయసు ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. దీనిపై వైసీపీ నాయకులు ఆయన వృద్ధుడు అయిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన వయసు అయిపోయిందని.. షెడ్డుకు వెళ్లడమే మిగిలి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనిత.. స్పందిస్తూ.. చంద్రబాబు వయసు కేవలం నెంబర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఆయన ఇప్పటికీ యువకుడేనని చెప్పారు.
అయితే.. అనిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ రియాక్ట్ అవుతూ.. చంద్రబాబు యువకుడు అన్న విషయం నీకెలా తెలిసింది? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై రివర్స్ ఎటాక్ చేసిన అనిత.. మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ అమర్నాథ్ మెదడు మోకాలులో ఉందన్నారు. గుడివాడ.. ముద్ద పప్పుకి తక్కువ… గన్నేరు పప్పుకి ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు.
కోడిగుడ్డు మంత్రివి!
ఈ క్రమంలో అనిత మంత్రి అమర్నాథ్ పై విమర్శలు గుప్పించారు. “నువ్వు కోడి గుడ్డు మంత్రివి. నీ పని అయిపోయింది. నీ నోటి దురద కారణంగా జగన్ నీకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఐటి మంత్రి… ఒక కంపెనీ అయినా తెచ్చారా? గుడివాడ నీ స్థాయి ఏమిటి?.. నా స్థాయి ఏమిటి? ఎక్కువ మాట్లాడితే.. మేము, జనసేన సైనికులు తరిమి కొడతాం పిడత పట్టుకొని… మిడతలా ఉన్నావ్” అని అనిత రెచ్చిపోయారు.
This post was last modified on February 27, 2024 9:20 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…