Political News

పార్టీ ఏదైనా బీసీలకే టాప్ ప్రయారిటీ ?

రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరు అనుకుంటున్నదే. అందుకనే ఏ పార్టీ అయినా బీసీలకే టాప్ ప్రయారిటి ఇస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు టీడీపీ, జనసేన కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 99 మంది మొదటిజాబితాలో ఉత్తరాంధ్ర విషయం తీసుకుందాం. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో రెండు పార్టీలు కలిపి 17 సీట్లను ప్రకటించాయి.

ఈ 17 సీట్లలో జనసేన ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించగా మిగిలిన 15 చోట్ల టీడీపీ ప్రకటించింది. జనసేన ప్రకటించిన రెండు సీట్లు నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణలు ఇద్దరు బీసీలే. ఇక కొణాతల అయితే గవర సామాజికవర్గం. ఇక టీడీపీ ప్రకటించిన 15 మంది అభ్యర్ధుల్లో ఆరుగురు బీసీలే. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ ను ఇచ్చాపురంలో, ఆముదాలవలసలో కూనరవికుమార్ ను, కొప్పుల వెలమకు చెందిన అచ్చెన్నాయుడుకు టెక్కలి టికెట్ ఇచ్చారు.

విజయనగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలిలో బేబీనాయనకు కూడా టికెట్ దక్కింది. విశాఖ పశ్చిమ సీటును గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబు, నర్సీపట్నంలో కొప్పుల వెలమ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీచేయబోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక మ్యాగ్జిమమ్ సామాజిక సమీకరణల మీదే ఆధారపడుంటుందని అర్ధమవుతోంది.

వైసీపీ, టీడీపీనే కాదు ఏ పార్టీ గెలుపు రేసులో ఉండాలని అనుకున్నా సామాజికవర్గాల సమతూకాన్ని పాటించక వేరే దారిలేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీసీల్లోనే వివిధ సామాజికవర్గాలకు చెందిన కీలక నేతలంతా ఎక్కువగా వైసీపీ, టీడీపీల్లో సర్దేసుకుంటారు. మిగిలిన అరాకొరా నేతలు జనసేన తరపున పోటీచేస్తే చేయచ్చంతే. కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే నేతలను కూడా ఇదే పద్దతిలో ఎంపికచేసినా వాళ్ళ ప్రభావం దాదాపు శూన్యమనే అనుకోవాలి. ఇక, బీజేపీ, వామపక్షాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.

This post was last modified on February 27, 2024 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

57 minutes ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

1 hour ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

2 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

2 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

3 hours ago

కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?

తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…

3 hours ago