Political News

పార్టీ ఏదైనా బీసీలకే టాప్ ప్రయారిటీ ?

రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరు అనుకుంటున్నదే. అందుకనే ఏ పార్టీ అయినా బీసీలకే టాప్ ప్రయారిటి ఇస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు టీడీపీ, జనసేన కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 99 మంది మొదటిజాబితాలో ఉత్తరాంధ్ర విషయం తీసుకుందాం. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో రెండు పార్టీలు కలిపి 17 సీట్లను ప్రకటించాయి.

ఈ 17 సీట్లలో జనసేన ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించగా మిగిలిన 15 చోట్ల టీడీపీ ప్రకటించింది. జనసేన ప్రకటించిన రెండు సీట్లు నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణలు ఇద్దరు బీసీలే. ఇక కొణాతల అయితే గవర సామాజికవర్గం. ఇక టీడీపీ ప్రకటించిన 15 మంది అభ్యర్ధుల్లో ఆరుగురు బీసీలే. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ ను ఇచ్చాపురంలో, ఆముదాలవలసలో కూనరవికుమార్ ను, కొప్పుల వెలమకు చెందిన అచ్చెన్నాయుడుకు టెక్కలి టికెట్ ఇచ్చారు.

విజయనగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలిలో బేబీనాయనకు కూడా టికెట్ దక్కింది. విశాఖ పశ్చిమ సీటును గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబు, నర్సీపట్నంలో కొప్పుల వెలమ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీచేయబోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక మ్యాగ్జిమమ్ సామాజిక సమీకరణల మీదే ఆధారపడుంటుందని అర్ధమవుతోంది.

వైసీపీ, టీడీపీనే కాదు ఏ పార్టీ గెలుపు రేసులో ఉండాలని అనుకున్నా సామాజికవర్గాల సమతూకాన్ని పాటించక వేరే దారిలేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీసీల్లోనే వివిధ సామాజికవర్గాలకు చెందిన కీలక నేతలంతా ఎక్కువగా వైసీపీ, టీడీపీల్లో సర్దేసుకుంటారు. మిగిలిన అరాకొరా నేతలు జనసేన తరపున పోటీచేస్తే చేయచ్చంతే. కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే నేతలను కూడా ఇదే పద్దతిలో ఎంపికచేసినా వాళ్ళ ప్రభావం దాదాపు శూన్యమనే అనుకోవాలి. ఇక, బీజేపీ, వామపక్షాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.

This post was last modified on February 27, 2024 1:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago