ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన.. తొలి ఎన్నికల సభ ఫుల్లుగా సక్సెస్ అయిందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అనంతపురంలో సోమవారం రాత్రి నిర్వహించిన న్యాయ సాధన సభ ఆ పార్టీలో జోష్ నింపింది. అయితే.. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షాలు సహా అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటి వరకు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలితే.. తాము లబ్ధి పొందుతామని.. ప్రతిపక్షాలు అంచనా వేసుకున్నాయి.
అదేసమయంలో అధికార పార్టీ కూడా.. ఎవరు వచ్చినా.. తమ ఓటు బ్యాంకు చీలదని అంచనాలు వేసు కుంది. కానీ, షర్మిల నేతృత్వంలో నిర్వహించిన సభకు దాదాపు 20 వేల మంది పైచిలుకు జనాభా హాజరయ్యారు. వాస్తవానికి ఈ సభను స్థానిక నాయకులు లైట్ తీసుకున్నారు. ఏం పుంజుకుంటుందిలే.. అనుకున్నారు. అందుకే.. కేవలం రెండు రోజుల ముందు మాత్రమే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే.. షర్మిల దాదాపు తన కుమారుడి వివాహం నేపథ్యంలో వారానికిపైగా రాష్ట్రానికి దూరంగా ఉన్నారు.
దీంతో కీలక నాయకులు కూడా.. పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ.. 20 వేల మంది హాజరయ్యారని అంచనా ఉంది. ఇక, పట్టుదలతో కూర్చుని ప్రయత్నాలు చేస్తే.. మున్ముందు సభలకు జనస మీకరణ చేస్తే.. ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. త్వరలోనే విశాఖలో భారీ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకు మించి జనాలను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ జోష్ పెరుగుతున్నదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
మరోవైపు.. కాంగ్రెస్ ఇలా బలపడుతూ.. పోతే.. క్షేత్రస్థాయిలో ఓట్లు చీలడం ప్రారంభమై.. కాంగ్రెస్కు సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకు వైసీపీకి దూరమవుతుంది. దీని వల్ల కనీసంలో కనీసం 20 సీట్లపై ప్రభావం పడుతుందనే అంచనా వస్తోంది. ఇదేసమయంలో ఓట్లు చీలడం ప్రారంభమైతే.. ఇది తమకు ఎఫెక్ట్ అని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేయగా.. ఇప్పుడు టీడీపీని కూడా టార్గెట్ చేస్తుండడం గమనార్హం. దీంతో ఈ పార్టీ నాయకులు కూడా అంతర్మథనంలో పడిపోయారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 27, 2024 3:55 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…