Political News

అర్ధ‌రాత్రి నిర్ణ‌యం.. ఎనిమిది మందిపై అన‌ర్హ‌త వేటు!

ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సోమ‌వారం అర్ధ‌రాత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. వీరిలో వైసీపీ నుంచి న‌లుగురు, టీడీపీ నుంచి న‌లుగురు ఉన్నారు. వీరంతా పార్టీలు మారిన వారే కావ‌డం గ‌మ‌నార్మం. ఇటీవల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపి, టీడిపి పార్టీలు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం రాత్రి చాలా పొద్దు పోయిన త‌ర్వాత స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పిటిషన్‌తో ఆనం రామనారాయణరెడ్డి(వెంక‌ట‌గిరి), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(ఉద‌య‌గిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరురూర‌ల్‌), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ‌)పై అనర్హత వేటు వేశారు. టీడీపీ చేసిన ఫిర్యాదు పిటిషన్‌తో మద్దాల గిరి(గుంటూరు వెస్ట్‌), కరణం బలరాం (చీరాల‌), వల్లభనేని వంశీ(గ‌న్న‌వ‌రం), వాసుపల్లి గణేష్‌(విశాఖ సౌత్‌)పై వేటు వేశారు. దీనిని ఎలా అమ‌లు చేస్తార‌నేది చూడాల్సి ఉంటుంది.

వాస్త‌వానికి అన‌ర్హ‌త అంటే.. ఆరు సంవ‌త్స‌రాలు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌ద‌రు అభ్య‌ర్థులు దూరంగా ఉండాలి. అయితే.. గ‌త సుప్రీంకోర్టు తీర్పుల ప్ర‌కారం.. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అన‌ర్హ‌త‌ల‌కు అర్థాలు మారుతున్నాయి.దీనిని బ‌ట్టి ఏపీలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌నే విష‌యంపై స్పీక‌ర్ ఇచ్చే వివ‌ర‌ణ‌ను బ‌ట్టి చూడాలి.

ఏం జ‌రిగింది?

గ‌త ఏడాది 2023లో జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్‌ దాటి టీడీపీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆ తరువాత వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా రాజ్యసభ ఎన్నికల టైంలో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలకు అధికార పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్‌ కార్యాలయం వారికి నోటీసులు పంపించింది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా మెలిగిన వారికి స్పీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి.

రెండు పార్టీలకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ కార్యాలయంలో విచారించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత స్పీకర్ తమ్మినేని 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అయితే.. ప్ర‌స్తుతం వీరిలో టీడీపీ స‌భ్యులు హైకోర్టును ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్లు ప్ర‌స్తుతం విచ‌ర‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.

This post was last modified on February 27, 2024 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

44 minutes ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

1 hour ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

2 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

2 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

2 hours ago

కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?

తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…

3 hours ago