Political News

అర్ధ‌రాత్రి నిర్ణ‌యం.. ఎనిమిది మందిపై అన‌ర్హ‌త వేటు!

ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సోమ‌వారం అర్ధ‌రాత్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. వీరిలో వైసీపీ నుంచి న‌లుగురు, టీడీపీ నుంచి న‌లుగురు ఉన్నారు. వీరంతా పార్టీలు మారిన వారే కావ‌డం గ‌మ‌నార్మం. ఇటీవల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపి, టీడిపి పార్టీలు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం రాత్రి చాలా పొద్దు పోయిన త‌ర్వాత స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పిటిషన్‌తో ఆనం రామనారాయణరెడ్డి(వెంక‌ట‌గిరి), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(ఉద‌య‌గిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరురూర‌ల్‌), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ‌)పై అనర్హత వేటు వేశారు. టీడీపీ చేసిన ఫిర్యాదు పిటిషన్‌తో మద్దాల గిరి(గుంటూరు వెస్ట్‌), కరణం బలరాం (చీరాల‌), వల్లభనేని వంశీ(గ‌న్న‌వ‌రం), వాసుపల్లి గణేష్‌(విశాఖ సౌత్‌)పై వేటు వేశారు. దీనిని ఎలా అమ‌లు చేస్తార‌నేది చూడాల్సి ఉంటుంది.

వాస్త‌వానికి అన‌ర్హ‌త అంటే.. ఆరు సంవ‌త్స‌రాలు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌ద‌రు అభ్య‌ర్థులు దూరంగా ఉండాలి. అయితే.. గ‌త సుప్రీంకోర్టు తీర్పుల ప్ర‌కారం.. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అన‌ర్హ‌త‌ల‌కు అర్థాలు మారుతున్నాయి.దీనిని బ‌ట్టి ఏపీలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌నే విష‌యంపై స్పీక‌ర్ ఇచ్చే వివ‌ర‌ణ‌ను బ‌ట్టి చూడాలి.

ఏం జ‌రిగింది?

గ‌త ఏడాది 2023లో జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్‌ దాటి టీడీపీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. ఆ తరువాత వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా రాజ్యసభ ఎన్నికల టైంలో వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలపై చర్యలకు అధికార పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్‌ కార్యాలయం వారికి నోటీసులు పంపించింది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా మెలిగిన వారికి స్పీకర్‌ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి.

రెండు పార్టీలకు చెందిన రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ కార్యాలయంలో విచారించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత స్పీకర్ తమ్మినేని 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అయితే.. ప్ర‌స్తుతం వీరిలో టీడీపీ స‌భ్యులు హైకోర్టును ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్లు ప్ర‌స్తుతం విచ‌ర‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.

This post was last modified on February 27, 2024 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago