Political News

10 వేల కోట్లపైన కన్నేసిందా ?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 10 వేల కోట్ల పై కన్నేసింది. అర్జంటుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను అమలుచేయాలంటే ఏడాదికి రు. 1.53 లక్షల కోట్లు అవసరం. అయితే అంతటి ఆదాయం ప్రభుత్వానికి లేదన్నది వాస్తవం. అందుకనే మొన్నటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలుకు కేటాయించింది రు. 43 వేల కోట్లు మాత్రమే.

ఈ కేటాయింపులను చూస్తే రేవంత్ ప్రభుత్వం గ్యారెంటీల అమలుకు ఎంత ఇబ్బందులు పడుతోందో అర్ధమవుతోంది. అందుకనే అర్జంటుగా ఆదాయాలను పెంచుకోకపోతే చాలా కష్టమని అర్ధమైపోయింది. అర్జంటుగా ఆదాయాలను పెంచుకోవాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలు కొన్నే. అవేమిటంటే ప్రభుత్వ భూములను వేలం వేయటం. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేయటం. ఎక్సైజ్ అమ్మకాలను పెంచుకుని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం. ఇవికాకుండా మిగిలిన మరో మార్గం ఏమిటంటే మున్సిపల్ పన్నులు పెంచటంతో పాటు నిబంధనలను అతిక్రమించి నిర్మించుకున్న కట్టడాలను రెగ్యులర్ చేయటం.

అందుకనే ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్ఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ(ఎల్ఆర్ఎస్) వెసులుబాటును తీసుకొచ్చింది. అవసరమైనపుడల్లా స్కీమ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి ఫీజులు కట్టించుకుని అక్రమాలను సక్రమాలు చేయటమే. ఇందులో భాగంగానే ఇపుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు ప్రభుత్వం తెరలేపింది. ఈ స్కీమ్ లో ప్రభుత్వానికి తక్కువలో తక్కువ రు. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఎలాగంటే స్కీమ్ ను కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2020లోనే తెచ్చారు. అయితే ఎందుకనో ప్రభుత్వం అమలును పట్టించుకోలేదు. దాంతో సుమారు 25 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. గ్రేటర్ మున్సిపల్ పరిధిలోనే లక్షకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. కొంతకాలంగా తెలంగాణాలో రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇపుడు తెచ్చిన స్కీమ్ లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31వరకు రేవంత్ ప్రభుత్వం గడువు విధించింది. అంటే ఇప్పటికే పెండింగులో ఉన్న సుమారు 25 లక్షల దరఖాస్తులకు మరికొన్ని యాడ్ అవటం ఖాయం. కాబట్టి వీటన్నింటినీ పరిష్కరిస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం రావటం ఖాయం. 

This post was last modified on February 27, 2024 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago