Political News

కేసీయార్ కీలక సమావేశం

కేసీయార్ తన ఫాం హౌజ్ లో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కవితతో చాలాసేపు భేటీ అయ్యారట. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రచారం, ఎంపిక చేయాల్సిన అభ్యర్ధులు, క్యాడర్ను నడిపించే బాధ్యతలు, అభ్యర్ధులకు నేతల మధ్య సమన్వయం తదితరాలపైనే చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత నలుగురితో ఒకేసారి కేసీయార్ భేటీ అవటం ఇదే మొదటిసారట.

ఎన్నికల ప్రచారం, సమన్వయం, అభ్యర్థుల ఎంపిక తదితరాల్లో కవిత పాత్ర చాలా నామమాత్రమే అని పార్టీ వర్గాలంటున్నాయి. భారమంతా ఎక్కువగా కేటీయార్, హరీష్ రావుపైనే ఉందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీయార్ బహిరంగ సభలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. కేసీయార్ బహిరంగ సభలకు పరిమితమైపోతే కేటీఆర్, హరీష్ మాత్రం నియోజకవర్గాల్లో బహిరంగ సభలతో పాటు రోడ్డుషోలు, ర్యాలీలు, అభ్యర్ధుల ఎంపికపై సర్వేల్లో కూడా కీలకపాత్ర పోషించారు. పార్టీ తరపున సోషల్ మీడియాకు అభ్యర్ధులకు, అభ్యర్ధులకు నేతల మధ్య సమన్వయాన్ని కూడా కేటీయార్ , హరీషే ఎక్కువగా చూసుకున్నారు.

సరే ఎవరెంతగా కష్టపడినా, ఎన్ని వ్యూహాలు అమలు చేసినా ఎంత ప్రయత్నించినా పార్టీకి ఓటమి అయితే తప్పలేదు. కేసీయార్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కామారెడ్డిలో ఓడిపోయినా గజ్వేలులో గెలిచారు కాబట్టి పరువు నిలిచింది.  అలాగే కేటీయార్, హరీష్ ఇద్దరు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్దుగా తయారైన ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ను మళ్ళీ యాక్టివ్ చేయాలని కేసీయార్ ముగ్గురుని ఆదేశించారట.

ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేయబోయే వారికి ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలతో సమన్వయం కుదర్చాలని చెప్పారట. నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించాలని చెప్పారట. ఏ అసెంబ్లీ నియోజకర్గానికి ఏ ఎంఎల్ఏ లేదా ఏ మాజీ ఎంఎల్ఏని నియమించబోయేది తొందరలోనే ఫైనల్ చేద్దామని అన్నారని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని సమావేశంలో కేసీయార్ స్పష్టంగా చెప్పారట. ముఖ్యంగా సిక్స్ గ్యారెంటీస్ అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న విషయంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని కేసీయార్ చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. 

This post was last modified on February 27, 2024 9:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago