నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిరోజులుగా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనను గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించగా ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే లావు త్వరలోనే టిడిపిలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా పలుమార్లు భేటీ అయ్యారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
అయితే, తాను టిడిపిలో చేరుతున్నట్టుగా లావు ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే తాజాగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు లావు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను టిడిపిలో చేరబోతున్నానని లావు ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ప్రజలు తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారని, వాటిని ఎన్నటికీ మరువలేనని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన తదుపరి రాజకీయ కార్యచరణ గురించి అందరూ అడుగుతున్నారని, ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని లావు చెప్పారు. ఇక, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో త్వరలోనే టిడిపిలో చేరుతున్నారని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి తనవంతు కృషి చేశానని లావు చెప్పుకొచ్చారు. గతంలో మాదిరిగానే మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడుపుతానని అన్నారు. పల్నాడు వాసుల దశాబ్దాల కల అయిన వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి వారి చిరకాల కోరికను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. ఇక, నరసరావుపేటలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను వైసిపి లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 26, 2024 5:50 pm
మాములుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టరని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్ లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ…
https://www.youtube.com/watch?v=kR4Y4m3FyhU&t=225s హాస్యానికి మారుపేరుగా ఇప్పటి భాషలో చెప్పాలంటే మీమ్ గాడ్ గా చెప్పుకునే బ్రహ్మానందంకు నట వారసత్వం రూపంలో రాజా…
ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందాని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు…
బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా…
400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో…