Political News

తొలి జాబితాపై బాబు హ్యాపీ..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన మిత్రప‌క్షం 118 స్తానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే ఇక‌, మిగిలిన కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. బీజేపీ క‌ల‌సి వ‌స్తే.. అంటూ. చంద్ర‌బాబు ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు.ఒకవేళ ఆ పార్టీ క‌లిసి వ‌చ్చినా.. 10-15 సీట్ల‌లోపే అవ‌కాశం ఇస్తారు. మిగిలి స్థానాల్లో అంటే.. 42లో టీడీపీ పోటీ చేయ‌నుంది. అయితే.. జ‌న‌సేన నుంచి అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఉండ‌డంతో మ‌రో 5-10 సీట్లు ఆ పార్టీకి ఇచ్చే ఆలోచ‌న‌తో టీడీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇప్ప‌టికిప్పుడు 30 స్థానాల‌పై దృష్టి పెట్టారు. ఆయా స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను కొలిక్కి తెచ్చేస్తే.. ఇక‌, ప్ర‌ధాన క్ర‌తువు పూర్త‌వుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక‌. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 94 స్థానాల‌(టీడీపీ)కు భారీ ఇబ్బందులు వ‌స్తాయ‌ని అనుకున్నా.. అనుకున్న విధంగా ఏమీ సంచ‌ల‌నాలు చోటు చేసుకోలేదు. కేవ‌లం 5 నుంచి 6 నియోజ‌క‌వ‌ర్గాల‌లోనే నాయ‌కులు అసంతృప్తితో ర‌గులుతున్నారు. వీరిని బుజ్జ‌గిస్తున్నారు. దీంతో తొలి జాబితా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇక‌, ఇప్పుడు మ‌లిజాబితా స‌హా 22 ఎంపీ సీట్ల‌పై క‌స‌రత్తు ప్రారంభించారు. అయితే.. వీటిలో 4 సీట్ల‌ను బీజేపీ ఆశిస్తున్న నేప‌థ్యంలో మొగిలిన 18 స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిని పూర్తి చేసేలా చంద్ర‌బాబు ఇంటి నుంచి క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే విజ‌యం సాధించ‌గా.. ఒక‌రు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. దీనికి తోడు ఒక‌రు(గ‌ల్లా జ‌య‌దేవ్‌) రాజ‌కీయాల‌కు ఏకంగా దూర‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో మిగిలిన 17 స్థానాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

This post was last modified on February 26, 2024 5:47 pm

Share

Recent Posts

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

7 minutes ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

25 minutes ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

56 minutes ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

1 hour ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

ఆవారాపన్ 2… అంతగా ఏముందబ్బా

కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago