Political News

ఒత్తిడి పెరిగిపోతోందా ?

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కొద్ది బీజేపీ ఏపీ చీఫ్  దగ్గుబాటి పురందేశ్వరిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. టీడీపీ, జనసేనతో పొత్తుంటుందో ఉండదో ఆమె చెప్పలేకపోతున్నారు. అధికారికంగా బీజేపీ, జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ ఆచరణలో మాత్రం అది కనబడటంలేదు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పొత్తు కుదుర్చుకున్నారు. సీట్ల సర్దుబాటు కూడా మొదలైపోయింది. కాబట్టి మాకు జనసేన మిత్రపక్షమే అని పురందేశ్వరి చెప్పేదంతా ఉత్త సొల్లు మాత్రమే అని అందరికీ తెలుసు.

అందుకనే టీడీపీ కూటమితో బీజేపీ కలుస్తుందా కలవదా అన్న విషయంలో అయోమయం పెరిగిపోతోంది. నిజానికి ఇంత అయోమయం అవసరమే లేదు. అయితే మొన్నటి 6వ తేదీన సడెన్ గా పొత్తు చర్చలకు ఢిల్లీకి  రమ్మని అమిత్ షా నుండి చంద్రబాబుకు కబురు వచ్చింది. వెంటనే చంద్రబాబు కూడా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది ఎవరికీ తెలీదు. పొత్తును ఫైనల్ చేస్తానని పదేపదే చెప్పిన పవన్ కూడా ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు. దాంతో రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన వచ్చేసింది.

కొద్దిరోజులు బీజేపీ కోసం వెయిట్ చేసిన చంద్రబాబు, పవన్ సడెన్ గా సీట్ల సర్దుబాటును ప్రకటించేశారు.  రెండు పార్టీల తరపున పోటీచేయబోయే 99 మంది అభ్యర్ధులను ప్రకటించేశారు.  దాంతో పొత్తు విషయం తేల్చుకోవాల్సిన అవసరం బీజేపీపైన పడింది. మీడియాతో పాటు పార్టీలోని నేతలు కూడా పదేపదే పొత్తు విషయాన్ని పురందేశ్వరిని అడుగుతున్నారు. వీళ్ళకి సమాధానం చెప్పలేక, అగ్రనేతలతో  దీనిపై మాట్లాడలేక ఆమె నానా అవస్థలు పడుతున్నారు.

దాని ఫలితంగానే పురందేశ్వరిపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నా అగ్రనేతలేమో పొత్తుపై ఏమీ తేల్చకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. 27వ తేదీన అంటే మంగళవారం ఏలూరులో జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్న కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఏమన్నా క్లారిటి ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. నిజానికి రాజ్ నాధ్ కు ఏపీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా ఢిల్లీ నుంచి వస్తున్నారు కాబట్టి అమిత్ షా నుండి ఏమన్నా సంకేతాలు తెస్తారా అని అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. 

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

18 minutes ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

28 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

2 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago