బీఆర్ఎస్ చాప్టర్ దాదాపు క్లోజ్ అయిపోయిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ చాప్టర్ క్లోజ్ అంటే తెలంగాణ లో కాదు. జాతీయస్థాయిలో అని అర్ధం. తెలంగాణాను బేస్ చేసుకుని దేశమంతా పార్టీని విస్తరింప చేయాలని కేసీయార్ చాలా కలలు కన్నారు. అందుకు కొంత ప్రయత్నాలు కూడా చేశారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వీటిల్లో కూడా మహారాష్ట్రకు చాలాసార్లు వెళ్ళొచ్చారు. అక్కడ బహిరంగసభలు కూడా నిర్వహించారు.
మహారాష్ట్రలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని చోట్ల గెలుచుకున్నారు. జాతీయ స్ధాయిలో చక్రంతిప్పేయాలని ఉబలాటపడి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అన్నీ బాగానే ఉన్నాయి కాని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో కథంతా అడ్డంతిరిగింది. తెలంగాణాలోనే పార్టీని కాపాడుకోలేకపోతున్నారు. దాంతో మిగిలిన రాష్ట్రాల్లో ఇంకేమి పట్టించుకుంటారు ? అందుకనే మహారాష్ట్ర, ఏపీ నేతలతో అసలు టచ్ లోనే ఉండటం లేదట.
ఇపుడు ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్ధాయికి చేరుకుంటున్నది. తొందరలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంతో, సభలతో, అభ్యర్థుల కసరత్తుతో చాలా హడావుడి పడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం స్తబ్దుగా ఉంది. ఎందుకంటే ఏపీలో పోటీచేయకూడదని డిసైడ్ అయ్యిందట. అందుకనే ఏపీ నేతలు కేసీయార్ ను కలవాలని ఎంత ప్రయత్నించినా కుదరడంలేదని పార్టీవర్గాల సమాచారం. ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు చాలారోజుల క్రితమే వైసీపీలో చేరిపోయారు. ఇపుడు అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే ఉన్నారు. ఈయన కూడా తొందరలోనే రాజీనామా చేసేస్తారని అంటున్నారు.
మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అన్నట్లుగానే ఉంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీచేసే పరిస్థితిలో లేదని అర్థమైపోతోంది. అందుకనే మహారాష్ట్ర, ఏపీ నేతలు మాట్లాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ అందుబాటులోకి రావటంలేదట. దాంతో మహారాష్ట్రాలో చాలామంది నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో చెప్పుకోవటానికి పెద్దగా నేతలు లేరు కాబట్టి రాజీనామాల హడావుడి కనబడటంలేదు. బహుశా అధ్యక్షుడిగా తోట రాజీనామా చేసేస్తే ఇక ఏపీ బీఆర్ఎస్ కు ఆపీసు కూడా ఉండదేమో.
This post was last modified on February 26, 2024 9:42 am
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…