బీఆర్ఎస్ చాప్టర్ దాదాపు క్లోజ్ అయిపోయిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ చాప్టర్ క్లోజ్ అంటే తెలంగాణ లో కాదు. జాతీయస్థాయిలో అని అర్ధం. తెలంగాణాను బేస్ చేసుకుని దేశమంతా పార్టీని విస్తరింప చేయాలని కేసీయార్ చాలా కలలు కన్నారు. అందుకు కొంత ప్రయత్నాలు కూడా చేశారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వీటిల్లో కూడా మహారాష్ట్రకు చాలాసార్లు వెళ్ళొచ్చారు. అక్కడ బహిరంగసభలు కూడా నిర్వహించారు.
మహారాష్ట్రలో జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని చోట్ల గెలుచుకున్నారు. జాతీయ స్ధాయిలో చక్రంతిప్పేయాలని ఉబలాటపడి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అన్నీ బాగానే ఉన్నాయి కాని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో కథంతా అడ్డంతిరిగింది. తెలంగాణాలోనే పార్టీని కాపాడుకోలేకపోతున్నారు. దాంతో మిగిలిన రాష్ట్రాల్లో ఇంకేమి పట్టించుకుంటారు ? అందుకనే మహారాష్ట్ర, ఏపీ నేతలతో అసలు టచ్ లోనే ఉండటం లేదట.
ఇపుడు ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్ధాయికి చేరుకుంటున్నది. తొందరలోనే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంతో, సభలతో, అభ్యర్థుల కసరత్తుతో చాలా హడావుడి పడుతున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం స్తబ్దుగా ఉంది. ఎందుకంటే ఏపీలో పోటీచేయకూడదని డిసైడ్ అయ్యిందట. అందుకనే ఏపీ నేతలు కేసీయార్ ను కలవాలని ఎంత ప్రయత్నించినా కుదరడంలేదని పార్టీవర్గాల సమాచారం. ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు చాలారోజుల క్రితమే వైసీపీలో చేరిపోయారు. ఇపుడు అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే ఉన్నారు. ఈయన కూడా తొందరలోనే రాజీనామా చేసేస్తారని అంటున్నారు.
మొత్తానికి ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అన్నట్లుగానే ఉంది. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీచేసే పరిస్థితిలో లేదని అర్థమైపోతోంది. అందుకనే మహారాష్ట్ర, ఏపీ నేతలు మాట్లాడాలని ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ అందుబాటులోకి రావటంలేదట. దాంతో మహారాష్ట్రాలో చాలామంది నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో చెప్పుకోవటానికి పెద్దగా నేతలు లేరు కాబట్టి రాజీనామాల హడావుడి కనబడటంలేదు. బహుశా అధ్యక్షుడిగా తోట రాజీనామా చేసేస్తే ఇక ఏపీ బీఆర్ఎస్ కు ఆపీసు కూడా ఉండదేమో.
This post was last modified on February 26, 2024 9:42 am
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…
నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు కూడా.. అనేక జాగ్రత్తలు తీసుకున్నా రు. అధికారులను మార్చేశారు.…
రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని…