Political News

టీడీపీ-జనసేన.. అసలు సవాల్ ముందుంది

మొత్తానికి తెలుగుదేశం-జనసేనల కూటమి నుంచి తొలి జాబితా బయటికి వచ్చేసింది. టీడీపీ నుంచి 94 మంది.. జనసేన నుంచి 5 మందిని తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన మొత్తంగా 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. దీనిపై జనసైనికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమందేమో.. పవన్ అన్నట్లే ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు, మెజారిటీ గెలవడం, జగన్‌ను ఓడించడం ప్రధాన లక్ష్యం కావాలి అన్నట్లు మాట్లాడుతుంటే.. మెజారిటీ జనసైనికులు సీట్ల సంఖ్య విషయంలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నారు.

కొందరు జనసైనికుల పేరుతో వైసీపీ వాళ్లే.. సీట్ల విషయమై నానా రభస చేస్తూ ఒరిజినల్ జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. అలా అని అందరినీ ఆ గాటన కట్టడానికి వీల్లేదు. జనసేనకు మరీ తక్కువ సీట్లు ఇచ్చారని ఆవేదన చెందుతున్న జనసేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నారు.

ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్‌నే ఎక్కువమంది తప్పుబడుతున్నారు. పొత్తు ప్రకటన దగ్గర్నుంచి పవన్ వ్యవహార శైలి సరిగ్గా లేదన్నది వారి అభిప్రాయం. పవన్ తనకు తానే బార్గైనింగ్ పవర్ తగ్గించుకున్నాడని వాళ్లు అంటున్నారు. సీట్ల సంఖ్య విషయంలో అసంతృప్తితో టీడీపీకి ఓటు బదిలీ కాదని చెబుతూ జనసేన గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే కష్టమే. ఈ అసంతృప్తిని హ్యాండిల్ చేయడం సవాలే.

జనసైనికుల ఆగ్రహ జ్వాలను చల్లార్చే ప్రయత్నం పవన్ మాత్రమే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చేయాల్సిందే. వారిని ఊరడించేలా మాట్లాడి.. పొత్తు అసలు లక్ష్యాన్ని వివరించాలి. ముఖ్యంగా చంద్రబాబు చొరవ తీసుకుని జనసేనానికి, జనసేన అభ్యర్థులకు, కార్యకర్తలకు తగిన గౌరవం, భరోసా ఇచ్చి కూటమి పట్ల విశ్వాసం పెంచాలి. వీలైతే ఇంకొన్ని సీట్లు పెంచే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. ఇవన్నీ జరిగితేనే జనసైనికుల్లో సానుకూల భావన ఏర్పడి.. ఓటు బదిలీ సాఫీగా జరుగుతుందన్నది వాస్తవం.

This post was last modified on February 26, 2024 6:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి…

3 minutes ago

ప్రేమకథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ

డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…

11 minutes ago

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

1 hour ago

పెద్ది గురించి శివన్న….హైప్ పెంచేశాడన్నా

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…

1 hour ago

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

3 hours ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

4 hours ago