“రెండు రోజుల్లో బూతులు నేర్చుకుని వస్తా.. కాసుకో!”- అంటూ వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేపై టీడీపీ నాయకుడు, తాజాగా టికెట్ దక్కించుకున్న నేత విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడడమే రాజకీయం అనుకుంటే.. తాను కూడా బూతులు నేర్చుకుని వచ్చి మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున సిట్టింగ్ నేత వల్లభనేని వంశీ పోటీ చేయనున్నారు.
ఇక, ఇదే నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయనున్నారు. అయితే.. వీరి మధ్య తరచుగా ఎన్నికల పోరు సాగుతోంది. ఇటీవల టీడీపీ అనుచరులను కొందరిని పోలీసులు తీసుకువెళ్లి కేసులు పెట్టారు. దీనివెనుక ఎమ్మెల్యే వంశీ హస్తం ఉందని యార్లగడ్డ అన్నారు. దీనిపై వంశీ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయి.. బూతులతో విరుచుకుపడ్డారని యార్లగడ్డ చెబుతున్నా రు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. తాను కూడా బూతులు మాట్లాడగలనని.. అయి రెండు రోజుల్లో నేర్చుకుని వస్తానని.. కాసుకో! అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇదేసమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసులకు కూడా యార్లగడ్డ వార్నింగ్ ఇచ్చా రు. “అమెరికా నుంచి వచ్చాడు.. సౌమ్యుడు.. వివాద రహితుడు అనుకుంటున్నారేమో… జిల్లా ఎస్పీ పేరు ను నారా లోకేష్ రెడ్ బుక్కులోకి చేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా”.. అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమైందని అన్నారు. టీడీపీ బీఫాంపై ఇక్కడ పోటీ చేసిన వారు ఆరు సార్లుగా గెలుస్తునే ఉన్నారని.. ఇప్పుడు తాను కూడా గెలుస్తానని.. ఇది చిన్న విషయమని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై వంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…